వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ వైపుగా?

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయిన ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీ వైపు చూస్తున్నారు…

ఇటీవల జరిగిన ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలు అయిన ఆడారి ఆనంద్ కుమార్ టీడీపీ వైపు చూస్తున్నారు అన్నది ప్రచారం సాగుతోంది. ఇపుడు ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించిందా అన్నదే అంతా తర్కించుకుంటున్నారు

ఆయన విశాఖ డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. విశాఖ డెయిరీ నుంచి సింహాచలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసేలా ఆమోదాన్ని ఆయన పొందారు. ఇప్పటి దాకా వేరే సంస్థ సరఫరా చేస్తోంది. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదం లో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అన్న ఆరోపణల నేపధ్యంలో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం వాడుతున్న నెయ్యిని సీజ్ చేశారు.

దాంతో దైనందిన వ్యవహారాలు సాగేందుకు వీలుగా విశాఖ డెయిరీ నుంచి టెంపరరీ పద్ధతిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టుని అందుకున్నారు. దాంతో ఆడారికి టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం అయినట్లే అని అంటున్నారు.

టీడీపీతో గత కొన్నేళ్ళుగా తెగిపోయిన బంధం ఈ విధంగా నెయ్యితో కొత్త నెయ్యంగా మారుతోందని అంటున్నారు. దీని వెనక ఒక మాజీ మంత్రి చక్రం తిప్పారని అంటున్నారు.

ఆడారి ఆనంద్ తండ్రి ఆడారి తులసీరావు టీడీపీలోనే ఉంటూ వచ్చారు. ఆనంద్ 2019లో అనకాపల్లి నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన ఆయన ఇపుడు మళ్ళీ మాతృ సంస్థ వైపుగా అడుగులు వేస్తున్నారు అని పుకార్లు సాగుతున్నాయి.

3 Replies to “వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ వైపుగా?”

  1. నిజానికి YCP నె ఈయనని మాట్లాడవద్దు అని చెప్పినట్ట్లు ఉంది. జనం లొ ఈయన మీద ఎంత వ్యతిరెకత ఉందొ అందరికీ తెలిసిందె.

Comments are closed.