జనసేన.. కలర్ ఫుల్ కార్యాలయం ఖాళీ!

కచ్చితంగా ఏడాది కిందట ఆ కార్యాలయానికి సంబంధించి తొలిసారి ఫొటోలు నెట్ లో షికారు చేశాయి. దగదగా మెరిసిపోతున్న లైట్లతో ఆ కార్యాలయం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు పవన్ కల్యాణ్ అభిమానులు.…

కచ్చితంగా ఏడాది కిందట ఆ కార్యాలయానికి సంబంధించి తొలిసారి ఫొటోలు నెట్ లో షికారు చేశాయి. దగదగా మెరిసిపోతున్న లైట్లతో ఆ కార్యాలయం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు పవన్ కల్యాణ్ అభిమానులు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో ప్రారంభం అయిన జనసేన కార్యాలయం అది. గత ఏడాది ఆగస్టులో అందుకు సంబంధించిన ఫొటోలో వైరల్ గా మారాయి.

మరీ అంతలా మెరిసిపోతున్న భారీ ఆఫీసును చూసి మిగతా పార్టీల అభిమానులు కూడా కుళ్లుకున్నారు. జనసేన వైభవం అలా మొదలవుతోందని ఆ పార్టీ అభిమానులు గట్టిగా చెప్పుకున్నారు కూడా. విశేషం ఏమిటంటే.. ఇప్పుడు మెరుపుల భవనం బయట టు లెట్ బోర్డు ఏర్పాటు అయ్యింది.

పవన్ కల్యాణ్ పోస్టర్లు, జనసేన స్టిక్కరింగులు అలాగే ఉన్నాయి కానీ ఆ పార్టీ ఆ కార్యాలయాన్ని ఖాళీ చేసింది. దాన్ని ఏడాది కిందట అద్దెకు తీసుకున్నారు. ఎన్నికల్లో జనసేన పార్టీ చిత్తు కింద ఓడాకా చాలాచోట్ల ఆ పార్టీ కార్యాలయాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

అందులో భాగంగా ఈ దగదగల ఆఫీసు కూడా ఖాళీ అవుతోంది. ఇప్పటికే జనసేన ఆ భవనం ఓనర్ కు చెప్పేయడం, ఆయన టు లెట్ బోర్డు పెట్టేయడం జరిగిపోయిందట. ప్రస్తుతం జనసేన ఆఫీసు బిల్డింగ్ లో బార్ అండ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడానికి కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!