నాడు వద్దు… నేడు ముద్దు

ఉద్ద‌వ్ థ్రాకే ప్ర‌భుత్వంను కూలదోసి అధికారంకు వ‌చ్చిన ఏక్ నాథ్ షిండే- బీజేపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గం ఇవాళ కొలువు దీరింది. అయితే ఈ కేబినేట్ కూర్పు త‌రువాత శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే ఒక‌రి…

ఉద్ద‌వ్ థ్రాకే ప్ర‌భుత్వంను కూలదోసి అధికారంకు వ‌చ్చిన ఏక్ నాథ్ షిండే- బీజేపీ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు మంత్రివ‌ర్గం ఇవాళ కొలువు దీరింది. అయితే ఈ కేబినేట్ కూర్పు త‌రువాత శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే ఒక‌రి వ‌ల్ల బీజేపీ తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఏక్ నాథ్ షిండే మంత్రివ‌ర్గంలో శివ‌సేన ఎమ్మెల్యే సంజ‌య్ రాథోడ్ ఎంపిక తీవ్ర ర‌చ్చ‌కు దారి తీసింది. ఎందుకంటే సంజయ్ రాథోడ్ గ‌తంలో ఉద్ద‌వ్ గ‌ర్న‌మోంట్ లో మంత్రిగా ఉన్న‌ప్పుడు ఓ మ‌హిళ‌తో సంబంధం న‌డిపి.. ఆమె అత్మ‌హ‌త్య‌కు కార‌ణం సంజ‌య్ అని బ‌లంగా ఆరోప‌ణ‌లు బ‌లంగా వ‌చ్చాయి. అప్ప‌ట్లో ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ ఉద్ద‌వ్, సంజ‌య్ తో బ‌ల‌వంతంగా రాజీనామా చేయించారు.

అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు బీజేపీ తీవ్ర స్థాయిలో పోరాటం చేసీ సంజ‌య్ ను రాజీనామా చేయించింది. బీజేపీ నుండి మ‌హారాష్ట్ర ఉపాధ్య‌క్షురాలు చిత్ర కిషోర్ వాగ్ ఆ బాధిత మ‌హిళ కోసం తీవ్రంగా పోరాటం చేసింది. కానీ బీజేపీ మాత్రం ఇప్పుడు అదే ఎమ్మెల్యేకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఉపాధ్య‌క్షురాలు చిత్ర తీవ్రంగా స్పందిచారు.

ఇదిలా ఉంటే.. గతంలో సంజయ్‌ రాథోడ్‌ను గద్దె దించే పోరాటంలో ముందున్న దేవేంద్ర ఫడ్నవిస్‌.. సమక్షంలోనే సంజయ్‌ రాథోడ్‌ మంత్రిగా ప్రమాణం చేయడం మరో హైలైట్‌. మ‌రోవైపు షిండే సైతం రాథోడ్ ను గ‌త కొంత‌కాలంగా త‌న ఆరోప‌ణ‌ల‌ను కొట్టిప‌డేస్తూ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చార‌నే విష‌యాన్ని ప‌దేప‌దే గుర్తు చేస్తున్నారు.