భ‌ర్త కంటే రెట్టింపు మెజార్టీ దిశ‌గా డాక్ట‌ర్ సుధ‌

వైఎస్సార్ జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ దూసుకెళుతోంది. ప్ర‌త్య‌ర్థులకు అంద‌నంత దూరంలో ఆమె మెజార్టీ ఉంది.  Advertisement గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య త‌న…

వైఎస్సార్ జిల్లా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ దూసుకెళుతోంది. ప్ర‌త్య‌ర్థులకు అంద‌నంత దూరంలో ఆమె మెజార్టీ ఉంది. 

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి టీడీపీ అభ్య‌ర్థి రాజ‌శేఖ‌ర్‌పై 44,734 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డాక్ట‌ర్ వెంక‌ట‌సుబ్బ‌య్య ఆక‌స్మిక మృతితో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో ఆయ‌న స‌తీమ‌ణి డాక్ట‌ర్ సుధ నిలిచారు.

బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉన్నాయి. ఉప ఎన్నిక‌లో 1,47,213 ఓట్లు పోల‌య్యాయి. ఇవాళ బ‌ద్వేల్ గురుకుల ప్ర‌భుత్వ బాలిక‌ల పాఠ‌శాల‌లో కౌంటింగ్ జ‌రుగుతోంది. మొద‌టి రౌండ్ నుంచి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ ప్ర‌త్య‌ర్థుల‌పై భారీ ఆధిక్య‌త‌తో కొన‌సాగుతున్నారు.

ఏడు రౌండ్ల కౌంటింగ్ ముగిసే స‌రికి డాక్ట‌ర్ సుధ 60,785 ఓట్ల ఆధిక్య‌త క‌న‌బ‌రిచారు. ఇంకా నాలుగు రౌండ్లు మిగిలి ఉన్నాయి. ప్ర‌స్తుత మెజార్టీ ఇదే విధంగా కొన‌సాగితే ల‌క్ష ఆధిక్య‌త చేరుకునే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ అంచ‌నా వేస్తోంది. భ‌ర్త వెంక‌ట‌సుబ్బ‌య్య ఆధిక్య‌త కంటే రెట్టింపు ఓట్ల‌ను డాక్ట‌ర్ సుధ సాధిస్తుంద‌ని వైసీపీ ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.