ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు కోసం వేట‌!

తెలంగాణ‌లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన త‌మ పార్టీ నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు బీఆర్ఎస్ న్యాయ వేట సాగిస్తోంది.

తెలంగాణ‌లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన త‌మ పార్టీ నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు బీఆర్ఎస్ న్యాయ వేట సాగిస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌లు తీసుకునే విష‌య‌మై ప‌రిశీలించాల‌ని ఆరు నెల‌ల క్రితం తెలంగాణ హైకోర్టు స్పీక‌ర్ ప్ర‌సాద్‌కు సూచించింది. అయితే ఇంత వ‌ర‌కూ ఆ దిశ‌గా స్పీక‌ర్ వైపు నుంచి ఎలాంటి ముంద‌డుగు ప‌డ‌లేదు.

ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో చేరిన సుమారు 10 మంది ఎమ్మెల్యేల‌పై ఎలాగైనా అన‌ర్హ‌త వేటు వేయించి, ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే ప‌ట్టుద‌ల‌తో వుంది. ఈ క్ర‌మంలో బీఆర్ఎస్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రెండు వేర్వేరు పిటిష‌న్లు దాఖ‌లు చేసింది.

క‌డియం శ్రీ‌హ‌రి, తెల్లం వెంక‌ట్రావు, దానం నాగేంద‌ర్‌కు వ్య‌తిరేకంగా ఎస్ఎల్‌పీ, అలాగే మ‌రో ఏడుగురు ఎమ్మెల్యేల‌పై రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై చ‌ర్య‌ల‌కు సంబంధించి హైకోర్టు ఆరు నెల‌ల క్రితం డైరెక్ష‌న్ ఇచ్చినా, ఇంత వ‌ర‌కూ ఎలాంటి ముంద‌డుగు ప‌డ‌లేద‌ని సుప్రీంకోర్టు దృష్టికి బీఆర్ఎస్ తీసుకెళ్లింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వివ‌ర‌ణ కోరేందుకు క‌నీసం నోటీసులు కూడా స్పీక‌ర్ ఇవ్వ‌లేద‌ని బీఆర్ఎస్ పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అనుస‌రించి ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేసేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని బీఆర్ఎస్ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని కోరింది.

One Reply to “ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు కోసం వేట‌!”

  1. కోఠిలో నున్న తెలంగాణ సరస్వత పరిషద్ లెక్చరర్ బిరుదురాజారత్నం నకిలీదళిత పత్రాలతో2002 లో ఉద్యో గం కాజేసి,2010లో హైదరాబాద్ కలెక్టర్ కు పట్టుబడ్డ తర్వాత స్టే సంపాదించింది. మాల-మాదిగ అని కొట్టుకుంటున్న నాయకులూ, అధికారులు ఎప్పుడూ ఆమె కుటుంబసభ్యులను కలవలేదు. అధికారులు ఒక్కడు కూడా వాకబు చేయలేదు.HC జడ్జీలకు మనీ చూపిస్తే చట్టం పెట్టె సర్దు కుంటుంది. తండ్రి పేరుమీద తీసుకున్న దళిత పత్రాలు నకిలీ అని హైదరాబాద్ కలెక్టర్ నిర్ధారిం చాక, లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగం కోసం చీకట్లో ఒక రెడ్డి న్యాయవాదీ ని కలిసి, ఇంకో రెడ్డి జడ్జీకి లొంగిపోయింది.దాంతో చనిపోయిన తల్లికి కావలి ఇంటిపేరు తగిలించి, బిరియాని తినిపించి కావలి సంతోషాతో బంధుత్వం ఉన్నట్టు నమ్మించారు. రాజారత్నం ఫై మనసు పడ్డారు.దాంతో స్టే, పునః నియామకం జరిగి పోయింది.నకిలీ దళిత ఉద్యోగి కి శిక్ష వేయకుండా,కోర్టుల్లో ఒప్పందం చేసుకుని తాత్కాలిక ఉపశమనం క్రింద స్టే ఇస్తారు.మచ్చిక చేసుకుని జీవితాంతం జీతాలు తీసుకుంటారు.

Comments are closed.