ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 07

కెసియార్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాడు, జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు అనే ప్రచారం సాగుతూ ఉన్నా జగన్ స్పందించలేదు.

ప్రభుత్వపరంగా, పార్టీపరంగా వైసిపి వైఫల్యాలలో ప్రధానమైనవి స్పందన లేకపోవడం, నెగటివ్ ప్రచారాన్ని తిప్పి కొట్టకపోవడం. ప్రయత్నం చేసి విఫలమైతే అదో దారి. ప్రయత్నం చేయకుండా కూర్చోవడం చేత జగన్‌ది డోంట్ కేర్ ఏటిట్యూడ్ అని ప్రజలకు నమ్మకం కలిగింది. ‘మీరేమనుకున్నా, అన్నా ఖాతరు చేయను, నా ఓటు బ్యాంకు నాకుంది, మీ విమర్శలకు వాళ్లు ప్రభావితం కారు. ఇక మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం నాకేముంది?’ అనుకుంటున్నాడనే భావం ప్రజల్లో నాటుకుంది. తమాషా ఏమిటంటే విమర్శలను జగన్ పట్టించుకోక పోయినా, తామైనా పట్టించుకుని జగన్ తరఫున పోరాడాలి అని వైసిపి సానుభూతిపరులు సోషల్ మీడియాలో యుద్ధానికి దిగితే వారికి వైసిపి తరఫు నుంచి మద్దతు లేదు, జగన్ తరఫు నుంచి మెప్పు లేదు.

పంచతంత్రంలో కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు సంతకు మేకను తీసుకెళుతూంటే నలుగురు దొంగలు ఒకరి తర్వాత మరొకరు వచ్చి అది మేక కాదు, కుక్క అనే భావాన్ని బ్రాహ్మణుడిలో నాటుతారు. చివరకు అతను దాన్ని కుక్కగా భావించి, వదిలి వేస్తాడు. వేల సంవత్సరాల నుంచి యీ టెక్నిక్ అమలవుతూనే ఉంది. కానీ 20వ శతాబ్దంలో వచ్చిన గోబెల్స్ పేరే అందరూ చెప్తారు. అంతకు ముందు ఎందరు చాణక్యులు, ఎందరు మేకియవిల్లీలు లేరు? చంద్రబాబు వారి దగ్గర్నుంచి కొంత నేర్చుకోకుండా ఉంటారా? వైయస్ జీవించి ఉండగానే జగన్‌లోని నాయకత్వ లక్షణాలను బాబు పసిగట్టి ఉంటారు. ఇతను ఎప్పటికైనా నా వారసుడు లోకేశ్‌కు ప్రత్యర్థి అవుతాడు, మొగ్గలోనే తుంచాలి, లేదా జనం దృష్టిలో ఓ చెడు ముద్ర వేసి ఎదగకుండా చేయాలి అనుకుని ఉంటారు.

పరిటాల రవి హత్య 2005లో జరిగింది. అప్పటికి జగన్‌కు 33 యేళ్ల వయసు. రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ కూడా కాలేదు. నేరచరిత్ర ఏమీ లేదు. పరిటాల రవి జిల్లావాడు కాదు. అయినా రవి హత్యకు జగన్‌కు ముడిపెడుతూ బాబు నానా హంగామా చేశారు. వైయస్ సిబిఐ చేత విచారణ చేయించుకోండి అని ఛాలెంజ్ చేశారు. చివరకు చూస్తే అది మరో ఫాక్షనిస్టు చేయించిన హత్య అని తేలింది. కానీ బాబు మీడియా జగన్‌పై రాజారెడ్డి వారసుడు అనే ముద్రను మాత్రం కొట్టి కూర్చుంది, వైయస్ ఉండగా తండ్రి పదవి అడ్డుపెట్టుకుని వ్యాపారాల్లో ఎదుగుతున్నాడు అని ప్రచారం చేసింది. అనూహ్యంగా వైయస్ మరణించి జగన్ విజృంభణ ప్రారంభం కావడంతో యిక ఆగ్రహం పట్టలేక పోయింది. నానా రకాల వదంతులూ ప్రచారంలోకి తెచ్చింది.

బాబాయిని కొట్టాడని కొందరంటే, అబ్బే సాక్షాత్తూ తండ్రినే కొట్టాడని మరొకడు. కళ్లతో చూశానని సాక్ష్యం చెప్పేవాడు ఒక్కడూ లేడు. అసలు సాక్ష్యంతో పనేముంది? రోజూ లీటరు మానవరక్తం తాగుతాడని, బాబాయిని స్వయంగా గొడ్డలితో నరికి చంపాడని చెప్పినా నమ్మేందుకు జనాలు సిద్ధంగా ఉండగా! ‘మేం చెప్పడమే కాదు, రోశయ్య కూడా చెప్పాడు’ అంటూ తెగ వీడియోలు వచ్చేస్తూ ఉంటాయి. తను పదవీభ్రష్టుడు కావడానికి జగన్ కారణమైనప్పుడు రోశయ్య అలా చెప్పడంలో ఆశ్చర్యమేముంది? వైయస్ తర్వాత జగన్ ఆశించిన సిఎం గద్దెపై కాంగ్రెసు రోశయ్యను కూర్చోబెట్టిన పార్టీ అధిష్టానం ‘మమ్మల్ని ధిక్కరించిన జగన్‌ను అణచడమే నీ పని’ అని చెప్పింది. కానీ ఓదార్పు యాత్ర పేరుతో జనాల్లో తిరుగుతున్న జగన్‌ను నివారించడం, అతని వద్దకు వెళుతున్న ప్రజలను నిరోధించడం రోశయ్య వలన కాలేదు.

తెలంగాణలో ఓదార్పు యాత్ర జరగకుండా వరంగల్ జిల్లా వంగిపల్లి రైల్వే స్టేషన్‌లో గొడవ అయినప్పుడు ‘ఇదంతా నువ్వు చేయించినదే’ అని జగన్ పబ్లిగ్గా నిందించినప్పుడు రోశయ్య ఉడుక్కుని ఉండడా? వాళ్ల నాన్నే నన్ను మన్నించేవాడు, యీ బచ్చా నన్ను పట్టుకుని నువ్వు అంటాడా అని మండిపడి ఉండడా? జగన్‌ను ఆపడం నీ వలన కాదులే అని రోశయ్యను తీసిపారేసి, కిరణ్ కుమార్‌ను పెట్టింది అధిష్టానం. అప్పటిదాకా అనేక మంత్రి పదవుల్లో ఎంతో పేరు తెచ్చుకున్న రోశయ్య ముఖ్యమంత్రిగా అసమర్థుడి ముద్ర వేయించుకుని 14 నెలల్లో దిగాల్సి వచ్చింది. ఇవన్నీ ఆయన్ని రగిలించి ఉండవా? అందుకే ‘వీడితో వాళ్ల నాన్నే వేగలేక పోయాడు, నేనెక్కడ వేగుతాను? వైయస్ వీడి గురించి నా దగ్గర మొత్తుకున్నాడు.’ అని జర్నలిస్టులతో చెప్పి ఉంటాడు.

చెప్పినంత మాత్రాన నిజం అయి తీరాలని లేదు. రోశయ్య చెన్నారెడ్డిపై చేసినన్ని ఆరోపణలు, తిట్టినన్ని తిట్లు వేరెవరూ చేసి ఉండరు. ఇంతా తిట్టి, మంత్రి పదవి యిస్తానంటే వెళ్లి ఆ పార్టీలో చేరి, కాబినెట్‌లో కూర్చున్నాడు. ఇక చంద్రబాబుపై చేసిన ఆరోపణలు కూడా అన్నీయిన్నీ కావు. జగన్‌పై చేసిన ఆరోపణ ఒక్కటే నిజమైనది, బాబుపై చేసినవన్నీ అబద్ధం అనుకోవాలా? రోశయ్య హేజ్ ఏన్ యాక్స్ టు గ్రైండ్ విత్ జగన్. ఆయన అన్న మాట పట్టుకుని పదేపదే వల్లించడం, దానికి చిలువలు పలువలు చేర్చడం యిదంతా స్మియర్ కాంపెయిన్‌లో భాగమే. కానీ యీ కాంపెయిన్ ప్రభావం తక్కువేమీ కావు. తటస్థులపై పడుతుంది.

లోతుగా విషయాలను అధ్యయనం చేయడానికి, పాత విషయాలన్నీ గుర్తు పెట్టుకోవడానికీ ఎవరికీ తీరిక, ఓపిక ఉండవు. భుక్తి కోసం తిప్పలు పడడానికే ఎంత సమయమూ చాలకుండా ఉంటే యీ సత్యాసత్య విచారణకు ఎవడు దిగుతాడు? ‘కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నా’ అన్నట్లు ‘జగన్ ఫ్యాక్షనిస్టు, రక్తపిపాసి, రాక్షసుడు, తుగ్లక్, సైకో’ అని రోజూ వల్లిస్తూ ఉంటే ‘అంతేగా, అంతేగా’ అనుకుని తలూపేస్తారు. తెలుగు మీడియా తనను యిలా చిత్రీకరిస్తుందని తెలిసినప్పుడు తను అది కాదని నిరూపించు కోవడానికి జగన్ విశేష ప్రయత్నాలు చేయాలి.

వైయస్‌పైన కూడా యిలాటి ముద్రే ఉండేది. పాతికేళ్ల పాటు నిరంతర అసమ్మతివాదంతో మహా అరాచకవాదిగా పేరుబడ్డాడు. అతను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో రక్తం ఏరులై పారుతుంది అనే భయం కలిగించింది తెలుగు మీడియా. అయినా ప్రజలు నమ్మారు, గెలిపించారు. గెలిచాక వైయస్ యిమేజి మొత్తం మారిపోయింది. రక్తం కాకుండా, నీరు ప్రవహించేలా అనేక ప్రాజెక్టుల రూపకల్పన చేశాడు. ప్రాణాలు తీయడం కాదు కదా, రక్షించడానికి ఆరోగ్యశ్రీ పెట్టాడు. పేదల పక్షపాతిగా ఫీజు రీయంబర్స్‌మెంట్ పెట్టాడు. ‘పాదయాత్రలో నా కోపం నరం తెగిపోయింది’ అని చెప్పుకుంటూ ప్రతిపక్ష సభ్యులతో కూడా ఆదరంగా మెలుగుతూ, అందర్నీ కలుస్తూ, అందరికీ పనులు చేసి పెడుతూ, మంచి యిమేజి తెచ్చుకుని పోయాడు.

బతికున్నంతకాలం వైయస్‌ను నోరారా, అక్షరాలా తిట్టిపోసిన వారందరూ ఆ తర్వాత మెచ్చుకోవడం మొదలుపెట్టారు, జగన్‌ను తిట్టడానికి! మాటిమాటికీ, ప్రతీదానికీ వైయస్‌తో పోలుస్తూ, తండ్రి లక్షణాలు లేవంటూ జగన్‌ను నెగటివ్‌గా చూపసాగారు. ఏ కొడుకూ తండ్రిలా ఉండడు. ఉండేమాటైతే డూప్లికేట్లు చేయడం దండగ అనుకుని దేవుడు వాణ్ని సృజించేవాడే కాదు. హీరోల వారసులకు వున్న సమస్య అదే. జగన్ అది గ్రహించి, మసలు కోవాల్సి ఉంది. ‘వైయస్ జనాల్ని కలిసేవాడు, యితను కలవడు’ అనే మాట వస్తున్నపుడు తన ఫిలాసఫీ ఏమున్నా, కొంతమేరకేనా తండ్రిని అనుకరించే ప్రయత్నం చేయాల్సింది.

ఒకర్ని మరొకరు వెనక్కి లాక్కునే పీతల్లాటి నేతలతో నిండిన కాంగ్రెసులో పైకి రావడానికి వైయస్ చాలా రాజకీయపు టెత్తుగడలు వేయాల్సి వచ్చింది, అందర్నీ కలుపుకుని పోవాల్సి వచ్చింది. వైయస్ సహచరుల్లో అన్ని కులాల వారూ ఉన్నారు. ఏ కులాన్నీ ఎత్తి చూపించలేదతను. చంద్రబాబును విమర్శించేటప్పుడు కూడా నేల విడిచి సాము చేస్తున్నాడని, సామాన్యుడి గోడు పట్టించుకోవటం లేదనీ అనేవాడు. చంద్రబాబు ఫార్ములా ఒన్ వంటి వాటి గురించి మాట్లాడుతూంటే ‘రైతులు ముఖ్యం, రేసులు కాదు’ అని నొక్కి చెప్పేవాడు. రైతు అనగానే అన్ని కులాల వాళ్లూ ఆ కేటగిరీలోకి వచ్చేస్తారు. ఎవరికీ అభ్యంతరం లేని పదం. జగన్ కూడా నా బిసి, నా ఎస్సీ.. పాట పాడకుండా నా రైతుల కోసం.. అని ఉంటే రెడ్లతో సహా అందరూ సంతోషించేవారు. తమను తక్కువ చేసే, వేరేవారిని ఎక్కువ చేశాడని ఫీల్ అయ్యేవారు కాదు.

కమ్మలది ప్రధానంగా వ్యాపారదృష్టి. హజం చూపే స్వభావం కాదు. వ్యాపారావకాశాలు పెంచుకునేందుకు రాజకీయాలు చేస్తారు. రెడ్లది ప్రధాన వ్యాపకం రాజకీయం. దాని ఖర్చులు రాబట్టడానికై వ్యాపారాలు చేస్తారు. హజం చూపడానికే ప్రాకులాడుతారు. జగన్ ఎప్పుడైతే గ్రామాల్లో రాయలసీమలో రెడ్ల ఆధిపత్య ధోరణికి ముకుతాడు వేసి బిసి, ఎస్సీ, మైనారిటీలకు అధికారం అప్పగించసాగాడో వాళ్లకు అతనిపై విముఖత కలిగింది. కర్నూలు పార్లమెంటు సీటు 1971 నుంచి రెడ్లది (1999-2004 తప్ప), జగన్ వచ్చి 2014 నుంచి బిసిలదిగా చేసేశాడు. ఇప్పుడు 2024లో టిడిపి కూడా బిసిని నిలబెట్టి గెలిపించుకుంది. రెడ్లకు ఆ సీటు పోయినట్లే! వాళ్లకు మండదా? రెడ్లే కాదు, ఆధిపత్యం చలాయిస్తున్న యితర అగ్రకులాలకూ యిదే వర్తిస్తుంది.

వైయస్‌లో మంచికైనా, చెడుకైనా స్పందించే లక్షణం బాగా ఉంది. దీర్ఘకాలం రాజకీయాల్లో నలిగిన కారణంగా విమర్శలను తిప్పి కొట్టే వాక్చాతుర్యం, అలవాటు ఉన్నాయి. నేడు ప్రతిపక్షంలో ఉన్నా, స్వపక్షంలో విరోధిగా ఉన్నా, రేపు ఎప్పటికైనా యితను పనికి వస్తాడేమో అనే యింగితం ఉంది. అందుకే అధికారం వచ్చాక అందరికీ హెల్ప్ చేశాడు. తనను అనునిత్యం తిట్టే టిడిపి, కమ్యూనిస్టు నాయకులతో సహా అందరికీ కావలసిన పనులు చేసిపెట్టాడు. బాలకృష్ణ కేసే పెద్ద ఉదాహరణ. జగన్ దగ్గర ఆ లక్షణం లేదు. తనను నమ్ముకున్నవారికే చేయడం తప్ప, ప్రత్యర్థులకు సహాయం చేసిన దాఖలాలు లేవు. అందుకే యితర పార్టీలలో కానీ, జర్నలిస్టుల్లో కానీ, ప్రజాభిప్రాయాన్ని ఏదో ఒక మేరకు ప్రభావితం చేయగల వారిలో కానీ జగన్ గురించి ఓ మంచి మాట చెప్పే వారు లేరు.

తనను మొగ్గలోనే తుంచి వేయడానికి చూసిన బాబుపై జగన్‌కి అపరిమితమైన కక్ష. బాబుకీ జగన్‌పై అంతే కక్ష. ఒకరి స్థానాన్ని మరొకరు గుర్తించడానికి యిచ్చగించనంత కక్ష. వైసిపి హయాంలో హింసా రాజకీయాలు నడిచాయని ఆరోపించిన టిడిపి, ప్రస్తుతం అంతకు మించి తన తడాఖా చూపిస్తోంది. బాబు, జగన్ పరస్పరం తిట్టుకుంటే ఓ మాదిరిగా ఉండేది. వాళ్లు తమ అనుయాయుల చేత కూడా అవతలివాళ్లను తిట్టిస్తూ వచ్చారు. టిడిపి హయాంలో జగన్‌ను తిట్టని టిడిపి నాయకుడు లేడు. తనకు అధికారం దక్కగానే జగన్ బదులు తీర్చేశాడు. టిడిపిని తిట్టడమే మంత్రుల విధిగా తయారైంది. తిట్టిన వారికే పెద్ద పీట, అసెంబ్లీలో తిట్టకపోతే వారికి స్లిప్పులు పంపేవారట. వాళ్లు తిడుతూ ఉంటే జగన్ చిరునవ్వులు చిందిస్తూ వినేవాడు. టిడిపి హయాంలో జగన్ మాట్లాడ్డానికి లేచి నిల్చోగానే లక్ష కోట్లు, లక్ష కోట్లు అంటూ టిడిపి వాళ్లు అల్లరి చేసేవారు.

ఇవన్నీ టీవీలో చూసి తటస్థులు చికాకు పడేవారు. ఎంతసేపూ మీలో మీరు కొట్టుకోవడమేనా, పాలన ఏమైనా చేస్తారా? అని. ఏ మాట కా మాట చెప్పాలంటే బాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వాడిన దుర్భాషలన్నీ ఒక ఎత్తు, గత ఐదేళ్లలో వాడిన దుర్భాషలు ఒక ఎత్తు. సైకో, ఉన్మాది, ..అమ్మ మొగుడు, అమ్మమ్మ మొగుడు.. యిలాటి అనుచితమైన పదాలు వాడారు. జగన్ ఆ స్థాయికి వెళ్లలేదు కానీ జగన్ మంత్రులు మాత్రం వెళ్లారు. జగన్ పవన్ భార్యల గురించి పదేపదే చేసిన అనుచిత ప్రస్తావన విమర్శలకు గురయింది. పర్శనల్ విషయాలు మాట్లాడకూడదని ఎత్తి చూపినా జగన్ ఆగలేదు. ఇక విజయసాయి విషయానికి వస్తే ఆయన చదివిన చదువుకి, చేసిన వృత్తికి, ట్వీట్లలో వాడే భాషకీ ఎక్కడా పొంతన కనబడదు. ఒక విద్యాధికుడు యింతటి దారుణమైన భాష వాడగలడా? అనిపిస్తుంది. వైసిపి వాళ్లు ఎందుకంత అసభ్యభాష ఉపయోగించారు అంటే ‘టిడిపి వాళ్లు మాత్రం మాట్లాడలేదా?’ అనే ప్రశ్న ఎదురు వస్తుంది. నిజమే, వాళ్లూ మాట్లాడారు.

కానీ అధికారంలో ఉన్నవారు హుందాగా ఉండాలి, షివల్రీ చూపాలి అనేది ప్రజల భావన. పైగా తండ్రి వయసున్న బాబును అలా హేళన చేయడమేమిటి అనే అభిప్రాయం తటస్థుల్లో కలిగింది. కొడుకు వయసు వాణ్ని గాలిలో కలిసిపోతాండటూ శాపనార్థాలు పెట్టడం బాబుకి మాత్రం తగునా? అని తోచలేదు వాళ్లకు. వీటికి లాజిక్కులుండవు. ఇప్పుడు బాబు అధికారంలోకి వచ్చారు. షివల్రీ చూపాలి కదా. చూపుతున్నారా? ఇప్పటికీ జగన్ సైకో, భూతాన్ని భూస్థాపితం చేస్తాను అనే మాట్లాడుతున్నారు కదా. హోం మంత్రి అనిత జగన్‌కు చిప్పు దొబ్బింది అంటున్నారు. ఈ విషయంలో పవన్ హుందాగా ఉన్నారు. ఎన్నికల ముందు చాలా మాట్లాడినా, అధికారంలోకి వచ్చాక మాత్రం నోరు పారేసుకోవడం లేదు. పని నేర్చుకునే పనిలో పడ్డారు.

వైసిపి అధికారంలో ఉన్నన్నినాళ్లు తిట్ల పురాణంతోనే పుణ్యకాలం గడిచిపోయింది తప్ప సరైన రీతిలో విమర్శలు ఎదుర్కోలేదు. జగన్ 2011లో పార్టీ పెట్టినా 2019 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నాడు కాబట్టి అధికారంలో ఉన్నవారిని విమర్శించడమే నేర్చుకున్నాడు. 2019లో అధికారంలో వచ్చాక విమర్శలను ఎదుర్కునే విద్య నేర్చుకుని ఉండాల్సింది, నేర్చుకోలేదు. దానికి కారణం, వాటిని పట్టించుకుని, ఎదుర్కోవలసిన అవసరం లేదని భావించడం! వైకుంఠపాళిలో 98వ స్థానానికి వచ్చిన జగన్ ‘ఇంకేముంది 100 చేరేశాం, యింకెవరికీ జవాబు చెప్పనక్కరలేదు, అవతలివాడు తోక ముడిచి పారిపోయాడు’ అనుకుని అహంకరించాడు. అంతే, పిక్కలు మళ్లీ వేసేసరికి 99లోని పాము మింగేసి 11 దగ్గర తేల్చింది.

టిడిపి, దాని అనుకూల మీడియా ప్రతి చిన్నదాన్నీ యిస్యూ చేసింది, బురద చల్లింది. అతిశయోక్తులు చెప్పింది, అసత్యాలు చెప్పింది. కానీ వైసిపి తరఫు నుంచి వాటికి సమాధానం ఉండేది కాదు. ఏదైనా శాఖ గురించి విమర్శ వస్తే, సంబంధింత మంత్రి నోరు విప్పేవాడు కాదు. అందరి తరఫున సజ్జల ఒకరే మాట్లాడేవారు. ఆయన మాట్లాడేది అస్సలు యింప్రెసివ్‌గా ఉండేది కాదు. డెడ్‌పాన్ ఫేస్‌తో ఏ ఉద్వేగమూ లేకుండా, న్యూస్ రీడర్‌లా వల్లె వేసేవాడు. సకల శాఖామంత్రి అని టిడిపి వెక్కిరిస్తున్నా, జగన్ లక్ష్యపెట్టలేదు. సజ్జల కూడా కొన్నిటి గురించే మాట్లాడేవారు. టిడిపి చేసే ఆరోపణలు నిజమా కాదా తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న సామాన్యులకు వైసిపి వైపు స్టోరీ తెలిసేది కాదు.

ఉదాహరణకి టీచర్లను సారాయి కొట్ల దగ్గర కూర్చోబెడుతున్నారు అనే ఆరోపణ ఉంది. నిజమా? ఎంతమందిని, ఎన్నాళ్లు కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టవలసి వచ్చింది? అనే క్లారిఫికేషన్ ప్రభుత్వం నుంచి రావాలిగా! సారాయి వ్యాపారంలో నగదు మాత్రమే అనే క్లాజ్ పెట్టడానికి కుంటిదో, గుడ్డిదో ఏదో ఒక సాకు ప్రభుత్వం చెప్పాలిగా! 33 వేల మంది అమ్మాయిల అంతర్ధానంలో వాలంటీర్ల హస్తం ఉంది అనే ఆరోపణ వచ్చినపుడు, వాలంటీర్ల చేత నిరసన తెలిపించారు తప్ప ప్రభుత్వం తరఫున మాయమైనవారు యింతమంది, వారిలో దొరికినవారిందరు అనే పత్రికా ప్రకటన ఒకటి యివ్వాలిగా. నెల్లాళ్ల క్రితం పార్లమెంటులో వచ్చిన క్లారిఫికేషన్ వైసిపి అధికారంలో ఉన్నపుడే యివ్వాలిగా!

‘పవన్ ఆరోపణకు సమాధానం యిస్తే పవన్ స్థాయిని పెంచేసినవాళ్లమౌతాం, అతన్ని యిగ్నోర్ చేయడమే అతనికి తగిన శిక్ష’ అనుకున్నాడా జగన్? అప్పులు ఎంత? వాటి పెరుగుదల శాతమెంత? బాండ్ల అమ్మకాలెంత? పరిశ్రమలు ఎన్ని వచ్చాయి? ఎన్ని పోయాయి? జిడిపి పెరిగిందా? తగ్గిందా? సలహాదారుల సంఖ్య, వాళ్ల జీతాలపై ఖర్చు, రోడ్లపై పెట్టిన ఖర్చు – బాబు హయాంతో పోలిస్తే హెచ్చిందా? తగ్గిందా? ఎంత శాతం? ఇలాటి వాటిపై ప్రతిపక్ష ఆరోపణలు, వైసిపి సమాధానాలు అంటూ బుక్‌లెట్స్ ఏమైనా వేసిందా అని అడిగితే ఎవరూ చెప్పలేక పోయారు.

వాదనలను తిప్పికొట్టడంలో వైసిపి చాలా పూర్. వాలంటీర్ల నియామకం ప్రజాధనంతో పార్టీ కార్యకర్తలను తయారు చేయడమే అని ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు వైసిపి ‘2002లో గుజరాత్‌లో మోదీ ప్రభుత్వం చేసినదేమిటి?’ అని అడిగి ఉండాల్సింది. 2002 జూన్‌లో మోదీ గ్రామమిత్ర పథకాన్ని ప్రకటించారు. రాష్ట్రంలోని 18 వేల గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 5గురు గ్రామ మిత్రులను నియమిస్తారు. వారికి నెలకు వెయ్యి రూపాయల జీతం. వీరు విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం వంటి విభాగాల్లో ప్రభుత్వం చేపట్టిన పథకాలు సక్రమంగా అమలయ్యేలా చేస్తారు. ఈ న్యూస్ యిస్తూ ‘‘ఇండియా టుడే’’ (2002 జులై 3 సంచిక) ‘ఈ గ్రామమిత్ర పథకం ద్వారా 90 వేల మంది యువకులతో పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలలో పని చేయించుకోవచ్చని మోదీ ఉద్దేశం కావచ్చు. ఈ విషయంలో ఆయన పశ్చిమ బెంగాల్‌ను అనుకరించారు.’ అని రాసింది. 2002లో వెయ్యి జీతం అంటే 2019లో 5 వేల కంటె ఎక్కువ కాదూ!

నేను సోషల్ మీడియాలో లేను కాబట్టి దాని గురించి నాకు పెద్దగా తెలియదు కానీ విన్నదేమిటంటే, జగన్ ప్రతిపక్షంలో ఉన్నంతకాలం అతని తరఫున చాలామంది తమ విలువైన కాలాన్ని, శక్తిని వినియోగించి, పోరాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక వారెవరి సేవలూ ఎక్నాలెజ్ చేయలేదు, అభినందించ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టించుకోలేదు. చేయక ఛస్తారా అన్నట్లు ప్రవర్తించాడు. సజ్జల భార్గవ చేతికే అప్పగించేసి, చేతులు దులిపేసుకున్నాడు. అతను మంచి కంటెంట్ ప్రొవైడ్ చేసేవారి నెవరినీ ప్రోత్సహించలేదు, ఆదరించలేదు, కేవలం టిడిపిని తిట్టేవారిని మాత్రమే పోగేసి, వైసిపి సోషల్ మీడియా యాక్టివిటీ అంటే అంతే అన్నట్లు నడిపించాడు.

టిడిపి ప్రాపగాండా మెషిన్ చాలా పటిష్టమైనది. దాన్ని ఎదుర్కోవడానికి అనేక మంది నిపుణులను, మేధావులను కలుపుకుని పోవాలి. తమ కంటె మెరుగైన వారు వస్తే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని సజ్జల, ఆయన కొడుకు ఎవర్నీ దగ్గరకు రానీయటం లేదని హితైషులు వెళ్లి జగన్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందట. ఫలితాలు చూశాక, ఆకులు పట్టుకుని యిప్పుడు భార్గవ్‌కు ఉద్వాసన పలికాడు. సజ్జలను అంత త్వరగా వదుల్చుకోవడం కష్టం. ఎందుకంటే పార్టీ గుట్టుమట్లన్నీ అతనికి తెలుసు. సడన్‌గా గుమ్మం చూపిస్తే కొంప ముంచవచ్చు. యూట్యూబుల్లో కొందరు వైసిపి పక్షాన చాలా వీడియోలు చేసేవారు. తమకు ఏ ఆర్థికసాయమూ అందలేదని కొందరు ఫిర్యాదు చేయగా విన్నాను. ఎందుకొచ్చిన కంచి గరుడసేవ అని ఎన్నికలకు ముందే వాళ్లు తప్పుకున్నారు. జగన్ తన లోకంలో తను బతుకుతూ, ప్రజలకు కానీ, అనుచరులకు కానీ, తటస్థులకు కానీ తను జవాబుదారీ కాదని అనుకుంటూ బతికాడు.

అమరావతి రైతుల సమస్య ఉంది. రాజధాని మారుద్దామనుకోవడం, కోర్టులు అడ్డుపడడం వలన మార్చలేకపోవడం అది వేరే గొడవ. డెవలప్‌మెంట్ అగ్రిమెంటు చేసుకున్న రైతులకు దాని ప్రోగ్రెస్ చెప్పవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది కదా. ఆందోళన చేసే రైతులు న్యాయానికి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి నిలదీయాలి. కానీ వారంతా టిడిపి ప్రేరేపిత బ్యాచ్ కాబట్టి జగన్‌ను లక్ష్యపెట్టలేదు, వెళ్లలేదు. కానీ ముఖ్యమంత్రికి ఓ బాధ్యత ఉంటుంది. ఫలానా కమిటీ వేశాం, వెళ్లి వాళ్ల దగ్గర మీ సమస్య చెప్పండి, మీలో ఎవరైనా భూములు వెనక్కి తీసుకుందామనుకంటే అదే భూమి కాకపోయినా, దానికి తగిన భూమి యిచ్చేస్తాం అని ఆందోళన చేసిన వారికీ, చేయనివారికీ విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. అధినేత దిగి రావాలి, తన కోసం కాదు, ప్రజల కోసం!

డా. సుధాకర్ సంగతే ఉంది. ప్రభుత్వోద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు చేయడం తప్పు, శిక్షించడం సబబే. తర్వాత ఆయన్ని ఎవరైనా గుండు కొట్టించుకుని, తాగి, రోడ్డు మీద అల్లరి చేయమన్నారా? దానిలో ప్రభుత్వహస్తం ఏమైనా ఉందా? ఆ తర్వాత మరణిస్తే ప్రభుత్వబాధ్యత ఏముంది? అయినా ప్రతిపక్షాలు అల్లరి చేశాయి. కులానికి, ఆయన ప్రవర్తనకు సంబంధం లేకపోయినా, దళితుడికి అవమానం అంటూ పెద్ద గొడవ చేశాయి. సుధాకరే, ప్రభుత్వానిది తప్పు లేదు, నాదే తప్పు అంటూ తర్వాత లేఖ పంపినా! ఇక్కడ ప్రభుత్వం తరఫున జరిగిన తప్పేమిటంటే, రోడ్డు మీద అల్లరి చేస్తూ ఉంటే పోలీసులు మోటుగా వ్యవహరించి, సామాన్లు వేసే ఆటోలో పడేసి తీసుకుపోవడం. యాంబులెన్స్‌లో తీసుకెళ్లవచ్చుగా అనే విమర్శ వచ్చినపుడు ప్రభుత్వం ఆ పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి, వారం పోయాక రివోక్ చేస్తే సరిపోయేది.

ఇలాటివి జెస్చర్స్, ప్రభుత్వ నిర్వహణలో చూపవలసిన లౌక్యాలు. అలాగే డ్రైవర్ని నరికి యింటికి డోర్ డెలివరీ చేశారు అన్న ఆరోపణ వచ్చినపుడు ‘విచారణకు ఆదేశించాం’ అంటే పోయేది. కోనసీమకు ఆంబేడ్కర్ జిల్లా పేరు పెట్టడం విషయంలో మొదట్లోనే పెట్టకుండా తర్వాత పెట్టడం పొరపాటు. గొడవ చెలరేగగానే, పునరాలోచిస్తాం అంటూ ఓ కమిటీ వేస్తే సరిపోయేది. ఇవన్నీ అనాదిగా ప్రభుత్వాలు చేసే ట్రిక్కులే. ఇవి కూడా చేయకుండా చేయకపోవడం ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకపోవడం కింద వచ్చింది. గోరంట్ల మాధవ్‌ అసభ్య ప్రవర్తన పబ్లిక్ అయినప్పుడు వెంటనే చర్య తీసుకోవాలి. 2024లో టిక్కెట్టివ్వంలే అనుకుని అప్పుడేమీ చేయకుండా ఊరుకుంటే ఎలా?

విద్యుత్ బిల్లులు చాలా ఎక్కువగా ఉన్నాయి, సంక్షేమం అంటూ ఒక చేత్తో యిచ్చి, మరో చేత్తో కరంటు బిల్లులంటూ లాగేసుకుంటున్నారు అని గగ్గోలు పుట్టినపుడు, ఎందుకు అంత ఎక్కువ పెట్టాల్సిందో వివరణ యివ్వాలి. ఏదైనా దశలవారీగా పెంచాలి. లేదా పెంచిన దాన్ని కాస్త తగ్గించాలి. ఇప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చింది. విద్యుత్ రేట్లు తగ్గిస్తుందా? కేంద్రం సూచనల మేరకు మోటార్లకు పెట్టిన మీటర్లు తీయించేస్తుందా? ప్రతిపక్షంలో ఉండగా గొడవ చేయడం సహజం. కానీ ప్రభుత్వం ప్రజలతో తమ పరిమితులను, యిబ్బందులను పంచుకోవాలి. లేకపోతే ఇన్‌సెన్సిటివ్ గవర్నమెంట్, తనకు తోచినదే చేస్తుంది తప్ప, ఎవరేమన్నా వినదు అనే ముద్ర పడిపోతుంది, వైసిపికి అలా పడింది కూడా. ప్రతిపక్షాలు నిరంతరం తప్పు పడుతూనే ఉంటాయి. కానీ సమాజంలో ఆలోచించే వర్గాలు, తమ ఆలోచనలతో యితరులను ప్రభావితం చేసే వర్గాలూ కొన్ని ఉంటాయి. వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం వైసిపి తరఫు నుంచి ఏమీ జరగలేదు.

50శాతం ఓటు నా కోటు జేబులో ఉంది, తక్కినవారు ఏమన్నా నాకేమీ నష్టం లేదు అనే ధోరణే కనబడింది. జేబులో ఉన్నారనుకున్న రెడ్ల సంగతి పైనే చెప్పాను. ఇక మైనారిటీలు. తను స్వయంగా మైనారిటీ కాబట్టి, అవతల ఉన్నది బిజెపి కూటమి కాబట్టి, మైనారిటీలు తనకి కాక వేరెవరికీ వేయరనుకున్నాడు. ఉత్తరాది మాట ఎలా ఉన్నా, ఆంధ్రలో మైనారిటీలు విడిగా, భిన్నంగా ఓటేయలేదు. ఇతర కులాలు ఎటుంటే అటే ఉన్నారు. ఇందిర వేవ్, ఎన్డీయార్ వేవ్, టిడిపి హవా, కాంగ్రెసు హవా.. యిలా ఎప్పుడూ పబ్లిక్ మూడ్‌తో పాటే పోయారు. ఇప్పుడూ అదే జరిగింది. బిజెపితో చేతులు కలిపింది కదాని టిడిపిని చూసి భయపడలేదు. పైగా జగన్ మాత్రం బిజెపితో చేతులు కలపలేదా? ఇన్నాళ్లకు వక్ఫ్ బోర్డు బిల్లు గురించి వ్యతిరేకంగా మాట్లాడాడు తప్ప, పదేళ్లగా బిజెపి చేసిన ప్రతి బిల్లుకు జైకొడుతూనే ఉన్నాడుగా!

ప్రాంతం పరంగా చూస్తే రాయలసీమ తన అడ్డా అనుకున్నాడు. అధికారంలోకి వచ్చాక మాకేం చేశాడు అని రాయలసీమ వాళ్లనుకున్నారు. కర్నూలుకి హైకోర్టు తరలిస్తాను అనడమే తప్ప కోర్టు సహకరించక పోవడం వలన తరలించలేక పోయాడు. ఓకే. కృష్ణా వాటర్ బోర్డుతో సహా అన్నీ వైజాగ్‌కు తరలించడమేమిటి? రాయలసీమకు కావలసినవి నీళ్లు. అక్కడి నీటి ప్రాజెక్టులపై జగన్ పెట్టిన ఖర్చెంత? టిడిపి ప్రభుత్వం కంటె అది ఏ విధంగా మెరుగుగా చేసింది? బాబుది అమరావతి జపం, జగన్‌ది వైజాగ్ జపం. రాయలసీమ వాసులకు విజయవాడతో నైనా రాకపోకలున్నాయి కానీ వైజాగ్‌తో అస్సలు లేవు. భార్య ఎక్కడికీ పోదులే అనే ధీమాతో ప్రియురాలి వెంట పడే భర్తకు భార్య ఎలా బుద్ధి చెప్తుందో రాయలసీమ జగన్‌కు అలా చెప్పింది.. ఇంతా చేసి ప్రియురాలు ఏం ఒరగబెట్టింది? అక్కడా వైసిపికి క్షవరమైంది. అమరావతిలో లోకల్స్ యితరులను రానీయ రనుకుంటే, వైజాగ్‌లో బయటివాళ్ల డామినేషన్ పెరిగిపోయింది. వైవి సుబ్బారెడ్డికి, విజయ సాయి రెడ్డికి అక్కడ పనేముంది? అందుకే శిక్ష పడింది.

రాయలసీమలో వస్తున్న వ్యతిరేకతను గుర్తించి, వారికి నచ్చచెప్పే ప్రయత్నం జగన్ ఏమీ చేయలేదు. కెసియార్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు రాడు, జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాడు అనే ప్రచారం సాగుతూ ఉన్నా జగన్ స్పందించలేదు. పబ్లిక్ పెర్‌సెప్షన్ అనేది చాలా ముఖ్యం. తెరాస పాలనలో ఎంతో మంచి జరిగింది, చెడూ జరిగింది, కానీ కెసియార్ యాటిట్యూడే కొంప ముంచింది. గ్రామీణులు కెసియార్‌కు బుద్ధి చెప్పాలనుకున్నారు, చెప్పేశారు. అది చూసి కూడా జగన్ నేర్చుకోలేదు. 2021 నవంబరులో హుజూరాబాద్ ఫలితం వచ్చాక నేను రాసినదిది – ‘ముఖ్యమంత్రి తమకు అందుబాటులో వుండాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిథులు కోరుకుంటారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకే కాదు, స్వపక్షంలోని ఎమ్మెల్యేలను సైతం దూరం పెడుతూ, ‘పథకాల ద్వారా ఓటర్ల హృదయంలో వుంటే చాలు, వారధిగా మీరుంటే ఎంత? లేకపోతే ఎంత?’ అనే ఆలోచనా ధోరణి మంచిది కాదని యీ ఫలితం ఎలుగెత్తి చాటింది. కెసియార్ యిరిగేషన్ పథకాలు వగైరా తెలంగాణలో భూముల విలువలను పెంచాయి. ఎంతోకొంత అభివృద్ధి జరుగుతోంది. కానీ పెత్తందారీ పాలన సహించమని ప్రజలు ఆగ్రహంగా చెప్పారు.’ అని. 2024లో ఆంధ్రలో అదే జరిగింది. ఓటమికి దోహదపడ్డాయని కొందరు ప్రస్తావించే తక్కిన విషయాలపై నా అభిప్రాయాలను తర్వాతి వ్యాసంలో చెప్పి సీరీస్ ముగిస్తాను. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2024)

243 Replies to “ఎమ్బీయస్‍: జగన్ పరాజయ కారణాలు 07”

  1. “నెగటివ్ ప్రచారాన్ని తిప్పి కొట్టకపోవడం.”..

    So YCP was good and failed to retard to negative propoganda..that whole govt was negative propaganda on andhra people…

    should I laugh or cry at this.

  2. “తను పదివి బ్రష్టటుడు కావడానికి జగన్ కారణమైనపుడు రోశయ్య ఆలా చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది?”…..

    ఇది వాక్యం చదివిన తరువాత మీ వ్యాసం చదవాలనిపించలేదు……. సో రోశయ్య అంత అపద్దం చెప్పే స్థితికి దిగజారాడంటావ్…… Good….

  3. పరాజయానికి కారణాలలో చర్చిలలో చేయించిన ప్రచారం కూడా ఒకటి. జూపూడి చెప్పినట్టు, పాపిష్టి సంఘాలలో పూనకం వచ్చేలా ఊదరగొట్టిన ప్రచారాలు హిందువులను రెచ్చగొట్టాయి

  4. హజం అంటే ఏంటి?

    బ్రాహ్మణుడు మేక ను మాంసం కొట్టు వాడికి అమ్మడమేంటి, మెదడు వుండే రాస్తున్నారా? ఆ కథలో బ్రాహ్మణుడు కాదు, ఒక అమాయకపు కాపరి.

    1. ఒక బ్రాహ్మణుడు సంతకు మేకను తీసుకెళుతూంటే అని నేను రాస్తే మీరు మాంసం కొట్టువాణ్ని ఎక్కణ్నుంచి పట్టుకుని వచ్చారు? నేను చదివిన కథలో బ్రాహ్మణుడు అని ఉంది. అమాయకత్వానికి కులంతో పని లేదు.

      1. బ్రాహ్మణుడు ఆవులు తప్ప మేకల్ని పెంచడు. ఇంకా సంతకు తెలుకెళ్లేది బలి కోసం అమ్మవారికి ఇచ్చి మాంసం తినేవాళ్లకే. అది బ్రాహ్మణుడు చెయ్యదు, మీరు మూల కథ లింక్ పంపగలరని మనవి.

        1. ఇదొకటా? చిన్నప్పుడు చదివిన కథ యింటర్నెట్‌లో ఉంటుందా? దాని లింకు వెతికి పంపాలా?

          అక్కడి విషయం ఏమిటి? నలుగురు తలచుకుంటే నందికి కూడా పంది ముద్ర వేయగలరు, అమాయకులు దాన్ని నమ్ముతారు కూడా అని. దాన్ని గ్రహించండి చాలు. పంచతంత్రంపై రిసెర్చి ఆపుదాం.

        2. బ్రాహ్మణుడు ఒక ఆవుని తీసుకుని వెళ్తుంటే దారిలో కొంతమంది అతడిని మోసం చెయ్యాలని ఏమిటి పంతులుగారు మేకని ఎక్కడకి తీసుకుని వెళ్తున్నారు అని ఒకరి తర్వాత ఒకరు అడుగుతూ ఉంటారు. మొదట నమ్మకపోయినా అందరూ అలాగే అడుగుతూ ఉండేసరికి నాకే ఏదో దృష్టి దోషం తగిలినట్టు ఉంది, ఇది మేకే తప్ప ఆవు కాదు అని వదిలేసి వెళ్ళిపోతాడు.

          1. అవునా? అయి ఉండొచ్చు. విష్ణు శర్మ రాసిన కథల్లో అన్ని పక్షులు, జంతువులే తప్ప, మనుషుల పాత్ర ఉండదు, అందుకే అతను వరల్డ్ ఫేమస్. ఇది వేరే ఎవరో రాసి వుంటారు.

          2. చిన్నప్పుడు ఏదో కథల పుస్తకంలో చదివాను…అది ఎవరి సృజన అనేది తెలియదు సార్

    2. హజం అంటే.. అని అడిగారు. దర్పం, దాష్టీకం అనే అర్థంలో వాడతారు.

  5. స్థూలం గా మీరు చెప్పేదేంటంటే జగన్ మితిమీరిన గర్వము తో ఏ ఒక్కరిని లెక్క పెట్టలేదు. కాంగ్రెస్ లో సొంత పార్టీ వాళ్ళను కూడా బాధపెట్టాడు, సొంత రెడ్డి కులాన్ని అణగదొక్కాడు. పార్టీ కార్యకర్తలను అసహ్యించుకున్నాడు. మ్మెల్యే లతో ప్రతిపక్షనాయకుల్ని బూతులు తిట్టించి ముషి ముషి నవ్వులు నవ్వుకున్నాడు. పవన్ మీద గోబెల్స్ ప్రచారం చేయించాడు. ఇన్ని చేసిన సొంత మీడియా సమర్ధవంతం గా కప్పి పుచ్చలేదు. ఈ తప్పుల్ని కవర్ చేసిన వైసీపీ సోషల్ మీడియా కి పేమెంట్ చెయ్యలేదు. తన క్రిస్టియన్, మైనారిటీ వోట్ బ్యాంకు చూసుకుని మిగతా కులాల అందరి నోట్లో మన్ను గొట్టాడు. కానీ మైనారిటీ వాళ్ళు కూడా ఓట్లు వెయ్యలేదు. . Good summary mastaru.

  6. స్థూలం గా మీరు చెప్పేదేంటంటే జగన్ మితిమీరిన గర్వము తో ఏ ఒక్కరిని లెక్క పెట్టలేదు. కాంగ్రెస్ లో సొంత పార్టీ వాళ్ళను కూడా బాధపెట్టాడు, సొంత రెడ్డి కులాన్ని అణగదొక్కాడు. పార్టీ కార్యకర్తలను అసహ్యించుకున్నాడు. మ్మెల్యే లతో ప్రతిపక్షనాయకుల్ని బూ/ తు/లు తిట్టించి ముషి ముషి నవ్వులు నవ్వుకున్నాడు. పవన్ మీద గోబెల్స్ ప్రచారం చేయించాడు. ఇన్ని చేసిన సొంత మీడియా సమర్ధవంతం గా కప్పి పుచ్చలేదు. ఈ తప్పుల్ని కవర్ చేసిన వైసీపీ సోషల్ మీడియా కి పేమెంట్ చెయ్యలేదు. తన క్రిస్టియన్, మైనారిటీ వోట్ బ్యాంకు చూసుకుని మిగతా కులాల అందరి నోట్లో మన్ను గొట్టాడు. కానీ మైనారిటీ వాళ్ళు కూడా ఓట్లు వెయ్యలేదు.

    1. షోలే సినిమా మళ్లీ చూడాలి అనిపిస్తోంది, ఎన్ని తప్పులు ఉన్నా కానీ పెళ్లి సంబంధాలకు వెళ్లి అమితాబ్, ధర్మేంద్ర ని హేమమాలిని కి ప్రపోజ్ చేసే సీన్. ఇది కూడా అంతే. అంటా జనాల తప్పు ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించక పోవడం. ఈయనకి మాత్రం బానే ముట్ట చెప్పరు లాగా వుంది సోషల్ మీడియా లో ప్రచారం చేసిన వాళ్ళ కన్నా,

  7. మీ లెక్కలో జగన్ సాంప్రదా యి నీ , సుద్దపూసిని అని అర్థం అయింది.

    కడప లో 50 ఏళ్ల దాటిన ఎవరినీ అడిగిన చెబుతారు, తన తల్లి తండ్రులని కొట్టే అలవాటు అతనికి వుండేది అని. సిఎం ను తన కొడుకు కొట్టాడు అంటే తల వంపులు అని వైఎస్ఆర్ అతన్ని బెంగళూర్ లోనే వుంచడానికి ట్రై చేసారు అని.

    డాక్టర్ సుధాకర్ గారూ మరణించిన అతని మీద మీ విషం చిమ్మడం ,మీ వయస్సు కి తగని పని.

    అతన్ని జగన్ పార్టీ గుండా లు రోడ్డు మీద తన్ని బట్టలు చించి గుండు కొట్టించి , తమ చేతుల్లో నీ పోలీసుల చేత అవమానం చేశారు. వైజాగ్ లో ప్రతి ఉక్కరికి తెలిసిన విషయం.

    రంగనాయకమ్మ గారి లాగ మిమ్ములను కూడా డొక్కు ఆటో లో ఒక రాత్రి పూట అరెస్టు చేసి పోలేస్ స్టేషన్ కి తీసుకు వెళితే ఎలా వుంటుంది.

  8. సుధాకర్ నీ వెంటాడి వేధించి చంపేశారు. మీరు ఇంకోసారి అతన్ని చంపారు, మీ రాతలతో.

    వెనకటి రెడ్డి గారు ఇచ్చిన పారితోషకం కోసము మరీ ఇంత భావాదస్యం చెయ్యాల్సిన అవసరం లేదేమో !

  9. మొత్తానికి జగన్ నోట్లో వేలు పెడితే కొరకలేని ఆమాయకుడు, నీతిమంతుడు, శుద్ధ పూస. చిటికెలు.. చిటికెలు…

    1. మీ ఆర్టి*కల్ చూపించి, జ*డ్గి గారిని జగ*న్ మీద వున్న అన్ని కేసు*ల్లో నిర్దో*షి అని తీర్పు చెప్ప*మంటే సరి.

  10. కడపలో 50 ఏళ్లు దాటిన ఎవరినీ అడిగిన కూడా చెప్పే విషయం. తల్లి తండ్రుల మీద చేయి చేసుకునే అలవాటు వుండేది అని.. ఇన్ని పరిచయాలు వున్న మీకు ఈ విషయం మాత్రం ఎవరు చెప్పలేదు అనుకోడం అమాయకత్వం. గ్రేట్ ఆంధ్ర వెంకట్ రెడ్డి గారిని అడిగితే చెబుతారు కదా..

  11. మీరు న్యూట్రల్ అనుకున్న. మరీ ఇంత baised గ ఉంటారని అస్సలు అనుకోలేదు. బాబు ఏమో దుర్మార్గుడు అన్న ఏమో శుద్ధ పూస అన్నట్లు రాసారు.

  12. TDP and Jenasena are safe, because people like you whitewashing Jagan and blaming TDP and its supporters. You are in that mode only. You are not exposing jagan failures, you are blaming everything to TDP. You got age but your brain is not grown up Mr.

  13. అంటే స్వయంకృతాపరాధం కొంతా, చంద్రబాబు కృతాపకరం కొంతా అంటారు. రెండూ సమానమని రాద్దామని అనుకున్నారేమో తెలీదు గానీ రెండోది కొంచెం ఎక్కువ సమానమనే భావమే వచ్చింది ఈ ఎపిసోడ్ లో….

    1. Rosayya’s biggest mistake was blindly following high command, he might have been weak. Chandra babu Naidu was the first to write a letter to divide combined Andhra Pradesh and he was proud about it. Can you elaborate the personal benefit Roayya garu wanted to get?

  14. చంద్రబాబు కోవర్ట్ గాళ్ళు వీడిని ఇలా సోనియా కొమ్ములు విరిచిన వీరుడు, శూరుడు & సింగిల్ సింహం ఆంటూ పంప్ కొట్టి, జిగ్గుల్ గాడిని ఏర్రెదవ ని చేసి.. రెండు సింగిల్స్ కి (11) దిగజార్చారు…

    ఇప్పుడు కూడా ఎవరు ఎలాంటివారో ఈ ఎ ర్రి ఎదవ కి అర్థం కావడం లేదు..

    ఇలా మునగ చెట్టు ఎక్కించి, చేటు చేసి next electons లో రియల్ గా సింగిల్ సీట్ సింహం అనిపించడమే మా ప్రసాదం గాడి టార్గెట్. ఏమంటావ్ రా పెసాదం??

  15. ఇంతోటి దరిద్రం చదవడం కంటే ఆ సాక్షి పేపర్ చదవడం బెటర్. ఎన్నికలు అయిపోగానే కొంతమంది వైసీపీ సైనికులు ‘జనం ఓడిపోయారు’, ‘జనం చేతిలో మోసపోయిన నాయకుడు’ వంటి కామెంట్లు చేసారు. అంతకు పదింతలు చెత్తగా ఉంది మీ విశ్లేషణ. మీవంటి చిడతలు మ్రోగించేవారు ఉండబట్టే ఆయన ఎన్నికలు ముగిసాక కూడా మనం గెలుస్తాం అన్నాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మొత్తం పసుపు అని తెల్సినా చదివేది ఇదిగో ఈ దరిద్రాలు చదవలేక. అసలు మీ వంటి అనుభవం కలిగిన జర్నలిస్టు రాయవల్సినటువంటి వ్యాసమేనా ఇది? ఆ పేపర్ లు జనాభిప్రాయాన్ని ప్రతిబింబించలేదు అన్నారు. మీరు చేసి అఘోరించినదేమిటి? కెసిఆర్ ఓడిపోయాడు. జగన్ చిత్తయిపోయాడు. అయినా వారిని వెనకేసుకొస్తున్నారు. వారు తెలిసి కూడా చేసిన నేరాలు తప్పులు బయటపెడితే ఈ సారి ఆ సీట్ లు కూడా మిగలవు అని. మీరు ఇటవంటి దిక్కుమాలిన విశ్లేషణలు ఎన్ని ప్రచురిస్తే జగన్ పట్ల, ఆయన భజన బృందం పట్ల ఉన్న భావన అంతగా ముదిరి ఛీత్కరింపుగా మారుతుంది.

  16. Parajayaniki karanalu kante manodi premantha jaggadimeeda volakabostunnattu undi. Intha chaduvukuni samskaram ledu, caste is loosely tied group of people.every caste have good and bad people, you should not generalize a caste.

  17. ప్రసాద్ రాతలు తప్పా అంటే కాదనే చెప్పాలి.ఉప్పు తింటున్నప్పుడు వాళ్ళకు న్యాయం చెయ్యాలి కదా.జీతం తీసుకున్నప్పుడు యజమానికే సేవకుడు గా ఉండాలి ఇతరలకు కాదు కదా.

    మేథావి ముసుగులో ఇటువంటి పనులు చేయవచ్చా అంటే , Godfather quote ఒకటి జ్ఞాపకం వస్తుంది.

    “how a man makes his living is none of my concern”.

    అంచేత పాఠకులు ఆయన రాతలు చదివి పెద్దగా హైరానా పడనవసరం లేదు. ఆయన బ్రతుకు తెరువు ఆయన చూసుకున్నాడు అంతే.

  18. మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

    1. “వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు”

      జగ్గులు

      వీసారె

      సజ్జల

      పెద్దిరెడ్డి

      ద్వారంపూడి

      తిక్కవరపు

      జవహర్

      కరుణాకరా

      వగైరా వగైరా వగైరా ఎంతో పద్దతిగా న్యాయబద్దంగా ఇసుక గంజాయి మద్యం కబ్జాల ఇతర మాఫియా ల ద్వారా వందల వేల కోట్లు సంపాదించారు.

      1. గాలి జనార్దన్ రెడ్డి,

        మల్ల రెడ్డి,

        సుధీర్ రెడ్డి,

        పల్రా జేశ్వర్ రెడ్డి,

        మేఘ కృష్ణ రెడ్డి,

        P పిచ్చి రెడ్డి,

        పీవీ partha sarathi reddy,

        రాంకీ గ్రూప్ అల్ల అయోధ్య రెడ్డి లను కన్వీనియెంట్ గా మర్చిపోయేరు

        https://timesofindia.indiatimes.com/city/hyderabad/divis-lab-megha-promoters-top-global-billionaire-list-from-telangana-andhra/articleshow/108803980.cms

  19. కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.

    కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.

    గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని,  నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది

    1. కొమ్మినేని, kodali, PvP, lk పార్వతి, పోసాని, నిమ్మగడ్డ ల్ని కూడా చేర్చు

  20. మొత్తానికి సునీతా విల్లియమ్స్ అంతరికాశం నుండి భూమికి దిగివచ్చే వరకూ గురువుగారు పరాజయ కారణాలు విశ్లేషిస్తూనే ఉంటారు. కానివ్వండి, కానివ్వండి.

    1. 1999 తర్వాత 2024 వరకు టిడిపి గెలవలేదుగా. గెలిచే సీటు ఎవరికి యిస్తున్నారనేది చూడండి.

      1. Tdp gave 5 times to non reddy and won 2 times, jagan gave 3times and own 2 times. He changed the seat to bc is not accurate. Further same community voted jagan 2019 which after giving to bc twice. So this logic will not hold the ground.

        1. compare how many times YCP contested with the times TDP contested. కర్నూలు పార్లమెంటు సీటు 1971 నుంచి రెడ్లది (1999-2004 తప్ప). Tell me if my statement is wrong. It does not matter how many contested and lost. Reddy ruled for 28 yrs continuously, there was a break of 5 years and again ruled for 10 more years. Since 2014 they lost it.

  21. This article is one of the worst ever. Your callousness in regards to Dr.Sudhakar’s death and solution on how to handle door delivery of driver’s dead body, is beyond disgusting.

  22. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి జగన్ రెడ్డి దోచుకున్న ఆస్తి తిరిగి ప్రజలకి ఇచ్చి , ఆర్థిక నేరాలు, పరిటాల రవి , బాబాయ్ హత్య ఎలాగూ రుజువైనాయి కాబట్టి లొంగిపోయి శేష జీవితం చర్లపల్లి లో గడపటం ఉత్తమం

        1. తెలియని దాన్ని తెలిసినట్లుగా రాయాలా? అంకెలు దొరికిన చోట రాస్తాం. ఆరోపణలున్న చోట ఆరోపణ వచ్చింది అని రాస్తాం. సత్యాన్వేషణలో మొదటి మెట్టు ఊహ. దాన్ని బట్టి హైపోథిసిస్. ప్రభుత్వం కేసులు పెట్టి ఆధారాలతో కోర్టులో నిరూపించాక అప్పుడు -ట లు ఉండవు.

          1. నేను జర్నలిస్టు అని, యిది జర్నలిజం అని ఎప్పుడు చెప్పాను? Reportedly, as per informed sources, purportedly, it is expected, it is suspected, it is rumoured.. యిలాటి పదాలు మీరు వినలేదా? తెలుగులో పేరు చెప్పడానికి యిష్టపడని ఒకరు.. అంటూ రాసేస్తూ ఉంటారు. అది పత్రికల భాష. నేను రాసేవి కబుర్లు, ఒక పాఠకుడు మరొక పాఠకుడితో పంచుకునే భావాలు. అందుకని నేను మాట్లాడే తీరులో రాస్తాను, ‘నేను అనుకున్నది, ’ ‘నా అభిప్రాయం ప్రకారం..’ అని రాస్తాను. జర్నలిస్టు రిపోర్టులో అలా ఉండదు. థర్డ్ పెర్శన్‌లో రాస్తారు. తేడాలు గుర్తెరగండి

  23. నీలాంటి చంద్రబాబు కోవర్ట్ గాళ్లు, వీణ్ణి ఇలా సోనియా కొమ్ములు విరిచిన వీరుడు, శూరుడు & సింగిల్ సింహం ఆంటూ పంప్ కొట్టి, జిగ్గుల్ గాడిని ఏర్రెదవ ని చేసి.. రెండు సింగిల్స్ కి (11) దిగజార్చారు…

    ఇప్పుడు కూడా ఎవరు ఎలాంటివారో ఈ ఎ ర్రి ఎదవ కి అర్థం కావడం లేదు..

    ఇలా మునగ చెట్టు ఎక్కించి, చేటు చేసి next electons లో రియల్ గా సింగిల్ సీట్ సింహం అనిపించడమే మా ప్రసాదం గాడి టార్గెట్. కదరా ప్రసాద్??

  24. 3 అన్నారు ఇప్పటికీ 7 ఎపిసోడ్స్ అయినాయి. కానీ రాస్తూ వుంటే ఎపిసోడ్స్ పెరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే అన్ని కారణాలు వున్నాయి జగన్ ఓటమికి.

    మీరు వ్రాసే విశ్లేషణ ఎలావుందీ అంటే ఇవే తప్పులు ఇంతకుముందు వాళ్ళు, వీళ్ళు అందరూ చేశారు కానీ జగన్ నీ మాత్రమే శిక్షించారు అని అతని పరాజయ కారణాలు తక్కువ చేసి చెప్పే ప్రయత్నంగా ఉంది అనిపిస్తుంది.

    కేవలం 11 సీట్లు అంటే అది అత్యంత ఘోర తిరస్కారం. అధికారం లో వున్నప్పుడు ఎలాగూ చెప్పరు చెప్పలేరు, కనీసం ఇప్పుడైనా సూటిగా విశ్లేషణ చేయండి. జగన్ మళ్లీ రివైవ్ అవ్వడానికి ఉపయోగపడవచ్చేమో.

    అక్కడ జగన్ ఏమో బాబు తప్పులు చేస్తాడు, 5 ఏళ్లు కళ్ళుమసుకుంటే అధికారం మనదే అనే భ్రమలో వున్నాడు కానీ మళ్ళీ మళ్ళీ తప్పులు చేయటానికి అక్కడ సిఎం గా వున్నాడు జగన్ కాదు చంద్రబాబు.

  25. ముసలోడికి జగన్ గురుంచి ఎవరన్నా చెప్తే అవి అన్నీ అబద్ధాలు

    అదే టీడీపీ గురుంచి ఈడు చెప్తే మనం నమ్మాలి

    చెత్త వే ధ వ

    ముష్టి కోసము పెంట తినే రకం ఈ డు

  26. ఎగ్ పఫ్ ల కోసము కోట్లు

    ఎలుకల కోసము కోట్లు

    ఇంటి కోసము కోట్లు

    సెక్యూరిటీ కోసము కోట్లు

    పరదాల కోసము కోట్లు

    హెలికాప్టర్ కోసం కోట్లు

    చెట్లు నరకటానికి కోట్లు

  27. ఈ ఆర్టికల్స్ వల్ల అందరికన్నా ఎక్కువ నష్టం మన అన్నీయ్యకేనేమో…..చేసిన దుర్మార్గం లో మంచిని వెతకడం అంటే , అంత కన్నా వెన్నుపోటు ఉండదేమో….ముందు ఈ ముసుగు నీతి stories అన్నమయ్య dam ki చెప్పండి….

  28. ఎం.బీ.ఎస్ గారు! నిజమే.. మీరు వ్యాసాల్లో రాసినట్టు.. ఈ రాజకీయ నాయకులు ఎవరూ శుద్ధ పూస కాదు! అందరూ తప్పులు చేసారు.. చేస్తారు!

    నాకు తెలిసి జగన్ గారి పాలనలో కొట్టొచ్చినట్టు కనపడిన ఒరవడి మాత్రం “అతి”!

    “ఉప్పు, కారం, తీపి” తగినంత వాడితే రుచి, ఆరోగ్యం! అతిగా వాడితే అనారోగ్యం! అదే జగన్ గారి పాలనలో చేసిన ప్రధాన తప్పు!

    ప్రత్యర్ధులను విమర్శించడంలో, ఇబ్బందులు పెట్టడంలో, ఒక కులాన్ని బూచిగా చూపడంలో, భాష లో, భావ వ్యక్తీకరణ లో, అధికార మధంలో.. ఇలా ఒక్కటేమిటి అన్నిటిలో “అతి” ప్రదర్శించారు!

    “అతి సర్వత్ర వర్జయేత్” అంటారు కదా! చివరికి ఆ “అతి” వారిని అధః పాతాళానికి తొక్కేసింది! కాదంటారా??

  29. మొత్తానికి సునీతా విల్లియమ్స్ అంతరికాశం నుండి భూమికి దిగివచ్చే వరకూ గురువుగారు పరాజయ కారణాలు విశ్లేషిస్తూనే ఉంటారు. కానివ్వండి, కానివ్వండి.

  30. బాల కృష్ణ కేసు లో వైఎస్ఆర్ హెల్ప్ చేశాడు అంట ఈడు చూసేసాడు

    అదే జగన్ వివేకాను కొట్టాడు అనే మాట పుకారు అంట దానికి సాక్ష్యం కావాలి అంట

    ఎదవకి

    తాగర వెళ్లి జగన్ సూ స్సు

  31. అంత చందివాక నా ఫీలింగ్ ఇంటి అంటే అసలు జగన్ తప్పే లేదు అంతా బాబు కుట్రలు చుట్టూ ఒకలా చేరిన వారు జగన్ మాత్రం అద్భుతమైన లాలన అందించాడు అయిన దయ లెను ప్రజలు అనయ్యంగా ఓడించారు అన్నట్లు ఉంది వ్యాసం. అంతే సార్ మంచు కి రోజుల్లేవ్. మద్యం ధరలు డిస్తిలారీస్ ఎవరు చేతుల్లో ఉన్నాయి ఎందుకు డిజిటల్ payments తీసుకోరు అందరికీ తెల్సు .ఇసుక టర్న్ కీ చేతుల్లో కి ఎలా వెళ్ళింది ఎలా ప్రజలు అధిక ధరలకు కొనేది చోసాం ప్రజలు అంటే చాల తెలివి లేని వాళ్ళు ఆమె భావన ఉంది మీకు.నాలుగు రూపాయిలు తిని పిస్తే ఇక కళ్ళు మూసుకుంటారు అనుకునరు

  32. Rey writer, you’rea twisted fuckwit! Neeku sanmanalentira? Chee, road meeda poye kukka bathukutundi, nuvvu bathukuntunnavu!

    I will not spare a moment again reading any of your articles again!

  33. MBS, if you’re alive by the time I make a trip to India, I’ll ensure to allocate some of my personal time to find where you live and give a solid slap and you may not ever get back up again to write another article like this again.

  34. బాబుగారు జగన్ లో నాయకత్వ లక్షణాలు గ్రహించి భయపడ్డారా?

    ఆ తర్వాత వ్యాసంలో రాసింది అంతా ఆ లక్షణాలు ఏ మాత్రం లేవు ఆని, మరి దేన్నీ చూసి భయపడ్డారు?

    బాబాయ్ ని, తండ్రిని కొట్టాడని, అరాచకవాది ఆని కాంగ్రెస్ లో వైఎస్ కి ఇంకా భజన చేసే చాలామంది చెప్పారు, కేవలం రోశయ్య గారిని నిందించటం సబబా?

    గత 5 ఏళ్ళలో జరిగిన హత్యాకాండ గురించి ఎప్పుడూ రాయలేదు, ఇప్పుడు మాత్రం వీళ్ళు చేస్తున్నారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.

  35. కామెంట్లు ఎందుకు తీసేస్తున్నానని అడిగేవారి కోసం మళ్లీ చెప్తున్నాను – ఆర్టికల్ చెత్తగా ఉందని రాసినా, వ్యాసంలో లాజిక్ తప్పని రాసినా, గణాంకాలు తప్పని రాసినా ఏ యిబ్బందీ లేదు. అవి అలాగే ఉంటాయి. నా గురించి రాసినవి మాత్రం ఉండవు. ఇక్కడ వ్యాసంలో సబ్జక్టు ముఖ్యం, దాన్నే చర్చించాలి. నా వయసు, నా బుద్ధి, నా తెలివితక్కువతనం … యివన్నీ అప్రస్తుతం

    1. మీ బాధేమిటో నాకు అర్థం కావటం లేదు. నాకు పాయింట్లు తడుతున్నాయి, రాస్తున్నాను. చదివేవాళ్లు చదువుతున్నారు. మీకు అక్కరలేదనుకుంటే మానేయండి. ఆర్టికల్స్ సంఖ్య గురించి వర్రీ అయ్యేవాళ్లు, వ్యాఖ్యలు రాసేవాళ్లు తమ సమయాన్ని, యితరుల సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు.

      1. మీరు రాసే విశ్లేషణలలో చాలా మటుకు వాస్తవాలని ప్రతిబింబిస్తున్నాయి…. అది తట్టుకోలేకపోతున్నాడు పైత్యరోగి

      2. నాకు ఆర్టికల్స్ సంఖ్య గురించి వర్రీ లేదు అండి .. మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు రాసుకోండి .. ఎవరికీ నష్టము లేదు .. లాభము లేదు .. .. చెప్పేది గ్యాప్ తీసుకోకుండా చెప్తే మాలాంటి వాళ్లకు ఈజీ గ ఉంటుంది .. క్రితం ఆర్టికల్ లో పాయింట్స్ పూర్తిగా మర్చిపోయే టైం కి కొత్తది వొదులుతున్నారు .. నమస్కారం ..

        1. గ్యాప్ తీసుకోవద్దు అంటే అంతా మీ యిష్టమేనా? నేను సమాచారం పోగు చేసుకోవద్దా? పాయింట్ల ప్రకారం ఎరేంజి చేసుకోవద్దా? ఇంతకు ముందే చెప్పానా అని వెరిఫై చేసుకోవద్దా? ఎక్కడ ఆపాలో చూసుకోవద్దా? నా ఇతర వ్యాపకాల మధ్య దీనికి సమయం కేటాయించవద్దా?

          ఇవేమీ పట్టించుకోకుండా మీరు వ్యాఖ్యానించడం సబబా? మీకు ఈజీగా ఉండాలి కదా రోజుకి రెండు ఏదో ఒకలా ఫటఫటా రాసేయాలా? క్రితం ఆర్టికల్ అర్కయివ్స్‌లో ఉంటుంది. అంతగా రిఫర్ చేయాలనుకుంటే ఒక్క నిమిషం పని. ఏదో ఒకటి వ్యాఖ్యానించాలనే తపన తగ్గించుకుంటే మంచిది

  36. Hitting below the Belt అన్న నానుడి కి ఈ వ్యాసం సరిగ్గా అతుకుతుంది.

    కాకపోతే ఈ రచయిత గారి నుండి ఇలాంటి ఆలోచనలు వెలువడటం వారిని అభిమానించే వారికి సిగ్గు చేటు.

    రోశయ్య , సుధాకర్ గార్ల గురించి మీరు చెప్పిన పాయింట్స్ తో విభేదించి రాసిన పాయింట్స్ ను డిలీట్ చేయడం అహంకారం తో కూడిన చర్య.

    1. మీరు పాయింట్లతో విభేదించి ఏం రాశారు. రోశయ్య చెన్నారెడ్డిని తిట్టితిట్టి కాబినెట్లో చేరలేదు అని వాదించి ఉంటే, రోశయ్య బాబు గురించి ఎన్నో మాట్లాడారు అనేదాన్ని సహేతుకంగా విభేదించి, వాదనలు రాసి ఉంటే ఉంచేవాణ్ని. రోశయ్య, జగన్ల మధ్య వైరం ఎందుకుందో కూడా రాశాను. అందువలన జగన్ పై అతను చేసిన వ్యాఖ్యలను పించ్ ఆఫ్ సాల్ట్ తోనే తీసుకోవాలి.

      ఇక సుధాకర్ ప్రభుత్వోద్యోగిగా ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు బహిరంగంగా చేయడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధం. దళితుడైనంత మాత్రాన మినహాయింపు ఉండదు. ఇక తాగి రోడ్ల మీద ట్రాఫిక్ అడ్డుకోవడమేమిటి? అది తప్పు కాదా? దళితుడనో, జగన్‌ను విమర్శించడానికి పనికి వస్తాడనో సుధాకర్‌ను గొప్పవాణ్ని చేయాలా? మీరు చెప్పండి. అతని ప్రవర్తనలో లాజిక్ ఏమిటో.

      1. నిద్ర పోయినట్టు నటించే వాళ్ళన మేల్కొలపడం అసాధ్యం.

        మీకు నిజ్జంగా నిజ్జం తెలుసుకోవాలి అంటే వైజాగ్ లో మీ సన్నిహిత వర్గాల నీ కనుక్కోండి, సుధాకర్ గారు నిజంగా తాగి రోడ్డు మీద తానే గొడవ చేసాడ లేక అతన్ని అలా చేశాడు అని ప్రచారం చేశారా అని.

        అలాగే రంగనాయకమ్మ గారి జీవనాధారం హోటల్ నీ కూడా లాక్కున్నారు.

        అమర్నాథ్ అనే అబ్బాయిని నిలువునా తగలబెట్టారు.

        వీళ్ళు టీడీపీ కార్యకర్తలు కాదు. మామూలు మనుషులు. కాకపోతే కడుపు మండి నోరు తెరిచాడు.

        ఇలాంటి అనేక ఘటన లు అన్నీ జగన కి అస్సలు తెలియకుండానే జరిగాయి అని మాత్రం సర్టిఫై చేయండి. మీ పారితోషకం మీకు వచ్చేస్తుంది.

        1. మీ పారితోషకం మీకు వచ్చేస్తుంది. – ఇలాటి రాతల వలననే వ్యాఖ్య డిలీట్ చేయవలసి వస్తుంది. పాయింటు ఉన్నంతవరకు చెప్పారు, దానితో ఆపలేరా?

          సుధాకర్ తాగి రోడ్డుపై గోల చేయడం వీడియో చూశాను. అతనిపై సింపతీ కురిపించిన జడ శ్రవణ్ కూడా పోలీసులు ఆటోలో వేసి తీసుకెళ్లడం తప్పు, యాంబులెన్స్ పిలవాల్సింది అన్నాడు తప్ప సుధాకర్ తాగి అల్లరి చేయలేదని అనలేదు. ప్రభుత్వోద్యోగి బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని సమర్థిస్తారా? అది చెప్పండి. రేపు బాబు ప్రభుత్వంపై కూడా ఎవరైనా విమర్శిస్తే ఏం చేస్తారనుకుంటున్నారు?

          నేను రాసిన విషయాలపై మాత్రమే వివరణ యిస్తున్నాను. తక్కిన వాటి గురించి మీరు రాసుకోండి.

          జగన్‌కు తెలియకుండా జరిగిందని నేను ఎక్కడైనా సర్టిఫై చేశానా? చూపండి.

          1. డా. సుధాకర్ ఏ పరిస్ధితుల్లో ప్రభుత్వాన్ని విమర్శించాడు అనే పాయింట్ మీరు convenient గా వదిలేసారు. కరోనా ఉధృతంగా ఉండి, డాక్టర్లు రాత్రి, పగలు అని లేకుండా కరోనా వార్డుల్లో పని చేసి ఎంతో మానసిక వత్తిడి ఎదుర్కొన్న సమయం అది. మాకు కనీసం మాస్కులు కూడా సప్లై చేయకుండా కరోనా రోగులకి వైద్యం చేయడానికి పంపుతున్నారు, ఇదెక్కడి న్యాయం అని అడిగితే అతని concerns address చేస్తారా లేక ఉద్యోగంలో నుంచి తీసేస్తారా?! అతని మీద అంతక ముందు తాగి విధులకు హజరైన ఆరోపణలు లేవు కదా? జీవనాధారమైన ఉద్యోగం ఉతితి పుణ్యానికి పోయి ఆ frustration లో తాగుబోతు అయితే ఆ తప్పులో ప్రభుత్వానికి భాగం లేదా?!

          2. పబ్లిక్ చేయడం ఉద్యోగ విధులకు వ్యతిరేకం అది తెలుసుకోండి. మీరు ఉద్యోగి అయితే ఆ విషయం తెలిసే ఉండాలి. తాగుబోతు అయినంత మాత్రాన తాగి రోడ్ల మీద అల్లరి చేయాలని లేదు.

          3. Public గా తన employer కి వ్యతిరేకంగా comment చేయడం ఆమోదయోగ్యం కాదు. కానీ unusual circumstances సంగతి ఏమిటి స్వామి?!

          4. సాధారణ పరిస్ధితుల్లో Public గా తన employer కి వ్యతిరేకంగా comment చేయడం ఆమోదయోగ్యం కాదు. కానీ unusual circumstances సంగతి ఏమిటి స్వామి?! – మీ సర్వీసు రూల్సులో సాధారణ పరిస్థితుల్లో ఒక రూలు, అసాధారణ పరిస్థితులకు వేరే రూలు అని ఉన్నాయా? చెప్పండి.

            మా బ్యాంకు ఉద్యోగులకు ఎన్నో ఫిర్యాదులున్నాయి. రూరల్ బ్రాంచ్‌లో మేనేజరుగా చేసేటప్పుడు ఒక్కోసారి తండ్రి చనిపోయినా లీవు యివ్వరు, రిలీవరు రాడు. బ్రాంచ్ వదిలిపెట్టడానికి వీల్లేదు. అలాటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ప్రెస్ ను పిలిచి చెపితే ఉద్యోగం ఊడగొడతారు. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగి కూడా యిలా బహిరంగంగా విమర్శ చేస్తే అదీ తప్పే అంటాను.

            ఇక దీనిపై చర్చ విరమిద్దాం.

          5. మా employer service rules గురించి చెప్పి ముగిస్తాను. నా ప్రాణాలకి ప్రమాదం కలిగే పరిస్ధితుల్లో నన్ను పనిచేయమని మా కంపెనీ బలవంతపెడితే నాకు public domain లో ఆవిషయం చర్చ పెట్టే హక్కు ఉంది, అది whistle blowing కిందకి వస్తుంది. నా ఆరోపణ నిజమైతే పరిస్ధితులని మెరుగుపరచడం తప్ప, నా మీద చర్య తీసుకునే హక్కు మా కంపెనీకి లేదు.

      2. కరోనా సమయంలో మాస్కులు లేవని చెప్పడం ప్రభుత్వానిని విమర్శించడమా,అంచేత ఆయనను అన్ని రకాలుగా వేటాడి హింసించడం సబబా.మీ నైతిక పతనాన్ని మీరే సగర్వంగా ప్రదర్శించుకుంటున్నారు.

  37. Amaravathi farmers velli kalavali annaru kadha .. Appointment isthada ? MLAS ke dikku ledhu … Ayina fake farmers tho meeting conduct chesadu… Don’t u remembered?

    1. అమరావతి ఆందోళనకారులు జగన్ ఎపాయింట్‌మెంట్ అడిగారా? అడిగి ఉంటే యిస్తాడో లేదో తెలిసేది. జగన్ మాకు ముఖ్యమంత్రే కాదన్నట్లు వాళ్లు బిహేవ్ చేశారు.

      మీరన్న ఫేక్ ఫార్మర్స్ చేసిన డిమాండ్స్, దానిలో జగన్ చెప్పిన విషయాలు నాకు తెలియవు. మీకు తెలిస్తే మాతో పంచుకోగోర్తాను

      1. సచివాలయానికి వెళుతుంటే కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించారు గుర్తులేదా సారు, వాళ్ళను చూడటం కూడా ఇష్టం లేక పరదాలు కట్టుకుంది మర్చిపోతే ఎలా మాష్టారూ

        1. సిఎంను దారిలో కలుస్తారా స్వామీ? ఎపాయింట్‌మెంట్ అడిగి వెళతారు. ఇవ్వకపోతే అది వేరే విషయం. అప్పుడు సంబంధింత మంత్రిని కలవడానికి ఎపాయింట్‌మెంట్ అడుగుతారు. వీళ్లు వైసిపి ప్రభుత్వాన్నే గుర్తించలేదు, లక్ష్యపెట్టలేదు. మీడియా కవరేజి ఉంటే చాలనుకున్నారు. అప్పణ్నుంచి యిప్పటిదాకా సమస్య పరిష్కారం కాలేదు. ఎప్పటికవుతుందో, ఎలా అవుతుందో ఊహకు అందటం లేదు.

      2. Ayina capital bill ki madhathu ichaka, decision change chesukunapoudu eeyana kalavali…..farmers tdp ki thothu ayithe lokesh no enduku vodagarraru.. oka sari crda website open chesi chudandi.. manu statistics are there including casts.

  38. మీరు రీసెంట్ గా ఏ సిరీస్ కూడా ఇన్ని పార్ట్ లు రాయలేదు…జీర్ణించుకోలేక ఇన్ని పార్ట్స్ రాస్తున్నారా లేక మీకు మీరే అవలోకనం చేసుకుంటున్నారా

    1. ఇన్ని పార్టులు రాయడానికి కారణమేమిటో మొదటి భాగంలోనే యిండికేట్ చేశాను. ఈ ఘోరపరాజయాన్ని 90శాతం సర్వే సంస్థలు ఊహించలేదు. ఎందుకింతలా ఓడాడో సమాచారాన్ని సేకరించి రాయడానికి పూనుకున్నాను అని. ఒక్కో పాయింటును డీల్ చేస్తూ వస్తున్నాను. ఏ పాయింటైనా రిపీట్ అయి వుంటే ఎత్తి చూపించండి.

      జీర్ణించుకోలేక పోవడమేమిటి, నాకు నేను అవలోకనం చేసుకోవడమేమిటి? మీరు కాస్త ఆలోచించి రాస్తే మంచిది. ఏదైనా అనూహ్యమైనది జరిగినప్పుడు దాన్ని కూలంకషంగా పరిశీలిస్తాం. అవలోకనం చేసుకోవలసిన అవసరం నాకేముంది? అది నాయకుల పని.

      1. అనూహ్యమైనది మీకు అనుకుంట .. మెజారిటీ ఓటర్లు కి కాదు .. ఓటర్లు బయట పడలేదు .. 2023 MLC ఎన్నికలో చదువుకునోళ్ళు తెలియ చేశారు .. అప్పుడు మా ఓటర్లు వేరు అని కలు చాపుకుని కూర్చున్నారు ..

        1. అనూహ్యమైనది మీకు అనుకుంట.. నాకే కాదు, అనేక సర్వే సంస్థలకు కూడా. ఆ విషయం మొదటి భాగంలో రాశాను

      2. మీరు రాసేవన్నీ, ఎన్నికల ముందే జరిగాయి. ఈ చిన్న “చిన్న తప్పులు”, జగన్ మంచివాడైనా బయటకి కనిపించే మంచితనం లేకపోవడం వల్ల ప్రజల్లో పెరిగిన అపార్థాలవల్ల ఓడిపోయాడని రాసారు. బావుంది. ఒప్పుకుందాం.

        కానీ,

        గత ఐదేళ్లలో ఒక్క సారైనా, ఒక్కసారైనా, ఈ బుజ్జి బుజ్జి తప్పులని, తప్పు నాన్నా అలా చేయకూడదు, అని మీ ముద్దు ముద్దు మాటలతో మందలించి ఉంటే, మీ, మీ అభిమాన నాయకుడి, విష్వసనీయత మిగిలి ఉండేది.

        1. అసభ్యాంధ్ర వంటి అనేక ఆర్టికల్స్ నేను రాశాను, మీరు చదవకుండా యిప్పుడు వెక్కిరింతకు దిగితే మిమ్మల్ని చూసి జాలిపడడం తప్ప వేరేం చేయగలను?

          నేను చెప్తే మీరు మారతారా? నా ఆర్టికల్స్ చదివి, నా మందలింపులు విని జగన్ కానీ బాబు కానీ మారతారని ఎలా అనుకోగలరు? మనం సామాన్యులం. మన అభిప్రాయాలు వ్యక్తీకరించడం వరకే మనం చేయగలం.

      3. మీరన్న మంత్రుల భాష, వీసారె భాష, జగన్ భాష 2014-19 మధ్యలో కూడా ఇలాగే ఉంది.

        ”బాబు నడిరోడ్డు మీద కాల్చాలి- కర్నూలు లో 2018 లో జగన్”..

        ఇలాంటివి విని విని, ఈ మోతాదులో, ఈ డెసిబెల్అంస్టే లోఅంటే తప్ప ప్రజలకి వినబడటంలేదని, బాబు అదే భాష వాడటం మొదలుపెట్టారు.

        మీరు గమనించినా రాయనిది…బాబు ఈ భాష పబ్లిక్ మీటింగ్ల లో మాత్రమే వాడారు. అసెంబ్లీలో మీరు, గారు అనే అనేవారు.

        వైయెస్, జగన్, మాత్రం, నువ్వు, అతగాడు, నీ… అమ్‌ మ, నిన్నెందుకు కన్నాని బాధపడుుంది, మాధవరెడ్డి ప్రస్తావనలూ, ఇలాంటి దుశ్చర్యలూ, దుష్టపు మాటలూ అసెంబ్లీలోనే అన్నారు.

        ఆవిషయం తమరు రాయరు. కనీసం ప్రస్తావించరు.

        ఎంతసేపూ జగన్ చిన్న తప్పు చేసాడు, లోక కళ్యాణం కోసం,,, కానీ బాబు మాత్రం అదే చిన్నతప్పు అంతకన్నా ఎక్కువ తేసాడు, స్వకళ్యాణం కోసం. అనే నరేటివ్.

        ఆపండి సార్.

        1. నువ్వు, అతను ప్రయోగం తప్పు కాదు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అవి గౌరవ వాచకాలే. మాధవరెడ్డి ప్రస్తావన అంబటి రాంబాబు తెచ్చినది, అతని హత్యోదంతం గురించి.

          అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడి, పబ్లిక్ మీటింగుల్లో చెత్త మాట్లాడవచ్చని రూలు ఏమైనా ఉందా?

          వైయస్ చంద్రబాబు పై చేసిన అమ్మ వ్యాఖ్యకు క్షమాపణ చెప్పాడు. బాబు తను అన్నమాటలకు క్షమాపణ చెప్పాడా?

          మీరు ఆపండి అన్నా నేను ఆగను. మిమ్మల్ని ఆపండి అని నేనన్నా మీరు ఆగరు.

  39. రెండో పేరా లో కథ గురించి చదివితే, ఆంధ్రజ్యోతి లాంటి మీడియా, మీలాంటి వ్యాస కర్తలు, ధృవ్ రాఠీ, తీన్మార్ మల్లన్న లాంటి నాలుగు తరహా ప్రాపగాండ చేసేవాళ్ళు గుర్తుకు వచ్చారు.

  40. రోశయ్య గురించి మీరు వాస్తవాలు రాయలేదు, వరంగల్ దగ్గర జగన్ మీద జరగబోయిన ఎటాక్ రోశయ్య వైఫల్యమా? కాదు అప్పట్లో తెలంగాణా వాదుల ను రెచ్చగొట్టడం ఎందుకని అడ్డు పెట్టేవాళ్ళు కాదు.

    1. ఇక రోశయ్య ని తొలగించి కిరణ్ రెడ్డి ని సీఎం చెయ్యడం జగన్ గురించి కాదు, తెలంగాణా ఇష్యూ వల్ల!

      1. తెలంగాణ యిస్యూకి రోశయ్య అభ్యంతరం చెప్పినదెక్కడ? తనకొక స్టేటుమెంటు చూపించి, మరో స్టేటుమెంటు విడుదల చేసినా కిక్కురు మనలేదు. ఇంకెందుకు తీస్తారు?

        1. ఒక్క రోశయ్య ఏమిటి? ఎవరు అభ్యంతరం చెప్పారు? అందరూ టోకెన్ ప్రొటెస్ట్ గా ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేశారు, తెలంగాణా ఇష్యూ తీవ్రం అయింది, మీడియా కూడా తెలంగాణా అగ్ని గుండం, నివురు గప్పిన నిప్పు లాంటి హెడ్డింగ్ లు, స్క్రోలింగ్ తో ఆజ్యం పోశారు, ఫలితం గా రోశయ్య పదవి కోల్పోయారు.

    2. రోశయ్య వైఫల్యమని ఎవరు చెప్పారు? అధిష్టానం ఆదేశంపై జగన్‌ను ఆపబోయాడు. రచ్చరచ్చ అయింది.

  41. రోశయ్య చెన్నారెడ్డి ని తిట్టినట్లు రాసారు, చెన్నారెడ్డి ఇందిరా కాంగ్రెస్ అయితే రోశయ్య రెడ్డి కాంగ్రెస్ లో ఉండడం వల్ల ఒక ప్రతిపక్ష నాయకుడు గా ఆరోపణలు చేసేవారు, అంతే కాని తిట్లు ఎప్పుడూ తిట్టలేదు.

    1. రోశయ్య చెన్నారెడ్డి పార్టీ లో చేరినందుకు ఏదేదో రాసారు, మరి కాలక్రమం లో జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కాంగ్రెస్ లో చేరలేదా? కాంగ్రెస్, dmk లాంటి విరుద్ధ పార్టీలు పొత్తు పెట్టుకోలేదా?

      1. ఔను వీళ్లంతా ఒకే బాపతు. అలాటి వాళ్లు చెప్పినది వేదవాక్కు అని అనుకోనక్కరలేదని నా భావం

        1. అసలు కారణాలు ఏమి రాసినట్టు లేరు ….అధికార మదం చూపించడం చెట్లు నరికించాడాలు బారికేడ్లు పెట్టడం పరదాలు చున్నీలు తీయించడం ప్రజలని టేక్ ఇట్ గ్రాంటెడ్ గ తీసుకోవడం అసలు evarini ఐతే manchollu అని ఎలేవేషన్స్ ichharo వాళ్ళు మరీ vivadaspadam గ pravartinchadam ….తన చుట్టూ ఉంచుకోవాల్సిన వాళ్ళని ఉంచుకోకపోవడం…..రెడ్ కార్పెట్ లు మీద నడవడం దేవాలయాల సెట్ లు వేయించుకోవడం … మరీ దారుణం గ హత్య అభియోగాలు ఉన్న వాళ్ళ మీద ఆక్షన్ తీసుకోకపోతే తీసుకోకపోయే వాళ్ళని వెంటేసుకుని యాత్రలు కి తిప్పడం తిరగడం ….కనీస0 చిన్న ప్రసంగాలు ఇంటర్వ్యూ లు ఇంగితం వాడకుండా పేపర్ స్క్రిప్ట్ మీద డిపెండ్ avvadam (తాను ఎలా సక్సెస్ ayyado cheppani adigite musi musi navvulu chindinchadam …sandarbaniki సంబంధం లేని samadanlu ఇవ్వడం )

        2. అసలు కారణాలు ఏమి రాసినట్టు లేరు ….అధికార మదం చూపించడం చెట్లు నరికించాడాలు బారికేడ్లు పెట్టడం పరదాలు చున్నీలు తీయించడం ప్రజలని టేక్ ఇట్ గ్రాంటెడ్ గ తీసుకోవడం అసలు evarini ఐతే manchollu అని ఎలేవేషన్స్ ichharo వాళ్ళు మరీ vivadaspadam గ pravartinchadam ….తన చుట్టూ ఉంచుకోవాల్సిన వాళ్ళని ఉంచుకోకపోవడం…..రెడ్ కార్పెట్ లు మీద నడవడం దేవాలయాల సెట్ లు వేయించుకోవడం …

        3. అభియోగాలు ఉన్న వాళ్ళ మీద ఆక్షన్ తీసుకోకపోతే తీసుకోకపోయే వాళ్ళని వెంటేసుకుని యాత్రలు కి తిప్పడం తిరగడం ….కనీస0 చిన్న ప్రసంగాలు ఇంటర్వ్యూ లు ఇంగితం వాడకుండా పేపర్ స్క్రిప్ట్ మీద డిపెండ్ avvadam (తాను ఎలా సక్సెస్ ayyado cheppani adigite musi musi navvulu chindinchadam …sandarbaniki సంబంధం లేని samadanlu ఇవ్వడం )

        4. కనీస0 చిన్న ప్రసంగాలు ఇంటర్వ్యూ లు ఇంగితం వాడకుండా పేపర్ స్క్రిప్ట్ మీద డిపెండ్ avvadam (తాను ఎలా సక్సెస్ ayyado cheppani adigite musi musi navvulu chindinchadam …sandarbaniki సంబంధం లేని samadanlu ఇవ్వడం )

    2. ఎంత దారుణమైనా ఆరోపణలు చేశారో మీరు మర్చిపోయారేమో, నాకు గుర్తుంది. రాజకీయంగా తిట్లు అంటే అవే, అన్నీ తిట్టి మళ్లీ ఆయన పంచనే చేరాడు, మంత్రి పదవి ఎఱ చూపగానే, అదీ రోశయ్య కారెక్టరు

      1. జగన్ character గురించి కూడా చెప్పండి, రిలయన్స్ వాళ్ళను తన తండ్రి చావులో నిందించి చివరికి వాళ్లు చెప్పిన వారికే రాజ్యసభ సీటు ఇచ్చాడు కదా, డిటిపి లో ఉంది అమ్మనా బూతులు తిట్టినా అనేక మందిని తమతో కలుపుకుంది మర్చిపోతే ఎలా సార్, బొత్స వంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంతెందుకు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర ముందు రామోజీ నీ కలిసింది గుర్తులేదా సారూ, ఇవన్నీ జగన్ పెద్ద మనసుకు నిదర్శనాలు కదా

      2. ఈ తరం పొలిటికల్ లీడర్స్ తిట్లు ఈ లెవెల్ ( ఏ లెవెలో మీకు తెలుసు ) లో ఉంటే…నెక్ట్ జనరేషన్ ఏ లెవెల్ తిట్లు వినాల్సి ఉంటుంది???

        ఇలాంటి బూతులు మాట్లాడకుండా… న్యాయ వ్యవస్థ కాని… ఇంకొ వ్యవస్థ కాని రూల్ పాస్ చేయలేదా??

      3. తనని తిట్టినా కూడా మంత్రి పదవి ఎరవేసిన అతని సంగతి ఏమిటి .. అంత వరకు ఎందుకు బొత్స పీసీసీ ప్రెసిడెంట్ గ ఉండి జగన్ విమర్శించే వారు .. ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నది .. ?? మీరు కన్వీనియెంట్ గ మర్చిపోకండి ..

  42. వైస్సార్ కి జగన్ తో పోలిస్తే చాలా పాజిటివ్ ఇమేజ్ ఉంది, 2009 లో వైస్సార్ వల్ల నే రాష్ట్రం లో కాంగ్రెస్ గెలవాలి అని ఆశించిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను.

    1. అలాంటి వైస్సార్ కొత్త సంక్షేమ పథకాలతో అత్తెసరు సీట్ల తో 2009 లో గెలిచారు, ఇక నెగటివ్ ఇమేజ్ ఉన్న జగన్ ఎలా గెలుస్తారు అని ఎన్నికల ముందు చాలా సార్లు రాసాను.

  43. తన పార్టీ ఎంఎల్ఏ చేత బూతులు తిట్టిస్తు వుంటే రసోద్దీపం చెందే వాడ్ని క్లినికల్ సైకో అని కాక ఏమి అంటారు,

  44. సజ్జల ఫేస్ గురించి రాసారు, జగన్ ఫేస్ లో మాత్రం ఏమైనా రకరకాల భావాలు కనిపించేవా? వైస్సార్ ముఖ కవళిక లలో (భావాలు ఎక్ష్ప్రెస్స్ చెయ్యడం) పదో శాతం కూడా జగన్ కి లేవు.

    1. ముఖ్యంగా చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఐకి*లిస్తూ న*వ్వడం పుండు మీద కారం రాసినట్లు వుంటుంది.

    2. జగన్ గురించి మొహంపై అతికించిన నవ్వు అని ఎప్పుడో రాశాను. ఇప్పుడు ఫోకస్ సజ్జల మీద, అతనే అన్ని విషయాల మీద మాట్లాడడం మీద…

      1. ఆవును కదా అప్పుడే జగన్ చేసిన అసమర్దపు పరిపాలనను సజ్జల మీదికి మళ్లించి అన్ని మారిపించవచ్చు. జగన్ ను సమర్డించటానికి చాలా ప్రయత్నిస్తున్నారు, కానివ్వండి

  45. టీడీపీ ప్రాపగండా టీమ్ ఎంత పటిష్టం అంటే అన్ని సోషల్ మీడియా వేదిక లలో వారే కనిపిస్తారు. 2023 తెలంగాణా ఎన్నికల సందర్బంగా యూట్యూబ్ లో ఒక్కో నియోజకవర్గం లో ఎవరు గెలుస్తారు అని పోల్ ఉండేది, దాంట్లో పాత బస్తీ నియోజకవర్గాలలో సైతం కాంగ్రెస్ గెలుస్తుంది అని పోల్ రిజల్ట్ చూపించేవారు!

  46. మొత్తానికి సునీతా విల్లియమ్స్ అంతరికాశం నుండి భూమికి దిగివచ్చే వరకూ గురువుగారు పరాజయ కారణాలు విశ్లేషిస్తూనే ఉంటారు. కానివ్వండి, కానివ్వండి.

  47. Expected a honest review but you have subtly shown your pro-Jagan instance as if he did everything good but failed in managing things. He was one of the worst ever CM’s. He failed to justify the amazing mandate he received. You judge CBN for everything but give benefit of doubt regarding every misdeed of Jagan. I think writers like you are enough to ensure jagan never learns from his mistakes and the end of his political career. He literally harassed everyone in AP and no one were spared.

  48. మొత్తానికి సునీతా విల్లియమ్స్ అంతరికాశం నుండి భూమికి దిగివచ్చే వరకూ గురువుగారు పరాజయ కారణాలు విశ్లేషిస్తూనే ఉంటారు. కానివ్వండి, కానివ్వండి.

  49. వరసపెట్టి వదలకుండా 8 ఆర్టికల్స్ రాసిన కూడా ఇంకా తగ్గకుండా అన్ని అవలక్షణాలు వున్న ఒకే ఒకడు జగన్.

  50. రోశయ్య గారిని సిఎం పదవి తీసుకోమని సోనియా చెప్పినప్పుడు,

    లేదు ఆ పదవి నాకి కాకుండా మా నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన కి వారసత్వం గా ఇవ్వండి అని అనకుండా, తానే ఆ సిఎం పదవి తీసుకుని తనకి సిఎం పదవి రాకుండా అడ్డు పడ్డాడు అని రోశయ్య గారి మీద జగన్ కి కోపం.

  51. “కానీ 20వ శతాబ్దంలో వచ్చిన గోబెల్స్ పేరే అందరూ చెప్తారు…చంద్రబాబు వారి దగ్గర్నుంచి కొంత నేర్చుకోకుండా ఉంటారా?”

    who spread fake propaganda? Naidu or Jagan? like Kia came to andhra due to YSR etc.. my god…this writer..

  52. “కానీ 20వ శతాబ్దంలో వచ్చిన గోబెల్స్ పేరే అందరూ చెప్తారు…చంద్రబాబు వారి దగ్గర్నుంచి కొంత నేర్చుకోకుండా ఉంటారా?”

    wow..speechless

  53. వైయస్ ఉండగా తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని వ్యాపారాల్లో ఎదుగుతున్నాడు అని ప్రచారం చేసింది – అది కేవలం ప్రచారమేనా? ఎంతోకొంత నిజం ఉండి ఉంటుందా అనే దానిపై మీ అభిప్రాయం తెలుపగలరు.

    1. ఉందనే నా అభిప్రాయం. కానీ అతను వ్యాపారంలో పైకి రావడానికి అదొక్కటే అర్హత కాదని కూడా నా అభిప్రాయం. అతని కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారిపై కేసులు పెట్టి వేధించడమూ తప్పే అని కూడా నా అభిప్రాయం. క్విడ్ ప్రో కో నిరూపించడం సాధ్యమయ్యే పని కాదు, ముఖ్యంగా పెట్టుబడి పెట్టినవారు ఫిర్యాదు చేయనంత వరకు!

  54. పరిటాల చాలా హై ప్రొఫైల్ వ్యక్తి. అతని మీద అటెంప్ట్ ప్లానింగ్ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా హత్య కేసులో అరెస్ట్ అయిన ఐదుగురిలో నలుగురు పులివెందులకి చెందినవారు, జగన్ కు, మంగలి కృష్ణకు సన్నిహితులు. జగన్ మీద అనుమానాలు వ్యక్తం అవడంలో ఆశ్చర్యం లేదు.

  55. పింక్ డైమండ్, కమ్మ డీఎస్పీ లు , నారాసుర రక్త చరిత్ర వంటి గోబెల్స్ ప్రచారాల గురించి కూడా rayand 
  56. మొత్తానికి సునీతా విల్లియమ్స్ అంతరికాశం నుండి భూమికి దిగివచ్చే వరకూ గురువుగారు పరాజయ కారణాలు విశ్లేషిస్తూనే ఉంటారు. కానివ్వండి, కానివ్వండి.

    1. ఇదో పేద్ధ చమత్కారం!!!

      దీన్ని యిప్పటిదాకా 20 సార్లు పెట్టి ఉంటారు, నేను 19 సార్లు తీసేసి ఉంటాను. నాకైతే వాకిలి తుడుచుకోక తప్పదు. మీకెంత ఫ్రీ టైము ఉందా అని ఆశ్చర్యపడుతున్నాను. తర్వాతి వ్యాసంతో ముగిస్తున్నాను అని దీనిలో రాశాను. ఇవాళే ఆఖరి వ్యాసం పోస్టు చేయబోతున్నాను కూడా.

      ఈ లోపున మీకు సునీతా విలియమ్స్ పునరాగమనం దొరికింది, నాపై వాడేద్దామని తెగ తాపత్రయ పడుతున్నారు. సంసార బాదరబందీలు లేవని, తీరిక పుష్కలంగా ఉందని చాటుకోవడానికి పెట్టుకున్న మారుపేరును సార్థకం చేసుకున్నారు!

      వేలాది పాఠకులు చదువుతున్నారు కాబట్టి నేను విశ్లేషిస్తూ పోతున్నాను. మధ్యలో మీకేమి బాధో నాకు తెలియదు. బోరు కొడితే యిటువైపు రాకూడదు. కానివ్వండి, కానివ్వండి అని పైకి అంటూనే ఆర్టికల్స్ సంఖ్యను చాలా తీవ్రంగా పట్టించుకుంటున్నారు. చెప్పిన పాయింటు మళ్లీ చెపుతూంటే ఎత్తి చూపి, సాగదీస్తున్నారనవచ్చు. అది మీకు చేతకాదు. ఏదో వెక్కిరించాం కదాన్న తృప్తి.

      మీలా కానివ్వండి, కానివ్వండి అనను నేను. ప్రతీ అరగంటకు సైట్‌కి వచ్చి అదే వ్యాఖ్యను మళ్లీమళ్లీ పోస్టు చేసే కార్యక్రమం పెట్టుకుని విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకండి, యీ సమయాన్ని వేరే విషయాన్ని తెలుసుకోవడానికి వెచ్చించండి అని సలహా చెప్తాను.

      1. తమ వ్యాసరచనకు మైమరచిపోయి, పూరి విప్పిన నెమలిలా నాట్యమాడే కోట్లాది పాఠక ప్రియులలో ఒక్క ప్రియుడూ నా comment కి సమాధానం ఇవ్వలేదు. తమరేమో 19 మార్లు తొలగించి 20 వ సారి చాంతాడంత పేనారు. అంటే తమ పాఠకులకు సమయం విలువ తెలిసినంత దానిలో ఆవగింజంత కూడా తమకు తెలియదా?

        1. నాకు తెలుసు కాబట్టే 19 సార్లు తీసేశాను. సమాధానం యివ్వడం వేస్టని! మళ్లీ మళ్లీ పెడుతూ పోతే పోనీ కదాని, మీకు కొంత సమయం కేటాయించి, సుద్దులు చెప్పబోయాను. సలహా తీసుకుంటే తీసుకోండి, లేదూ నేనిలాగే నా సమయాన్ని దీనిపైనే వెచ్చిస్తాను అంటే మీ చిత్తం, కానీయండి.

          మీ కామెంటు సమాధానం తెచ్చుకునే స్థాయిలోనైనా లేదేమో అని కూడా ఆలోచించి చూడండి.

          పాఠకులకు.. అని అందర్నీ కలుపుకోకండి. మీ అంత పట్టు వదలని విక్రమార్కులు నాకెవరూ తగల్లేదు. వాళ్లంతా లౌకిక జంజాటాలున్న సంసారుల్లా ఉన్నారు. ఒకటి రెండు సార్లు రాసి, తమ పనీపాటా చూసుకోవడానికి ముందుకు సాగిపోతారు.

        2. ఆర్టికిల్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి (నేను కూడా అదే చేసాను) కానీ వెటకరాలు ఆడటం ఎందుకు? మీ కామెంట్‌కి ఎవరూ రిప్లై ఇవ్వలేదంటే మీ కామెంట్ అస్సలు బాగోలేదని అర్థం

        3. ఆ..ర్టి.కి..ల్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి (నేను కూడా అదే చేసాను) కానీ వెటకరాలు ఆడటం ఎందుకు? మీ కామెంట్‌కి ఎవరూ రిప్లై ఇవ్వలేదంటే మీ కామెంట్ అస్సలు బాగోలేదని అర్థం

  57. ఓటమికి కారణాలు:

    1. అజ్ఞానం
    2. అవివేకం
    3. అహంకారం
    4. అవినీతి
    5. బంధు/వర్గ ప్రీతి
    6. నిరంకుశత్వం
    7. నిర్లిప్తత
  58. పద్యము:

    పద్యము:

    ఆత్మశుద్ధి లేని యాచారమదియేల?

    భాండశుద్ధి లేని పాకమేల?

    చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?

    విశ్వదాభిరామ వినురవేమ.

    అర్థము:

    ఆత్మ, మనసు మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు?

    వంట చేసేటపుడు పాత్ర శుభ్రంగా లేకపోతే వంట చేయడమెందుకు?

    చిత్తం అనగా మనసు లోని ఆలోచనలు, బుద్ధి నిర్మలంగా లేకపోతే శివ పూజ చేయడం ఎందుకు?

    చక్కగా, నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము. అని వేమన భావం .

  59. పద్యము:

    ఆత్మశుద్ధి లేని యాచారమదియేల?

    భాండశుద్ధి లేని పాకమేల?

    చిత్త శుద్ధి లేని శివపూజలేలరా?

    విశ్వదాభిరామ వినురవేమ.

  60. పద్యము:

    ఆత్మశుద్ధి లే.-.ని యాచారమదియేల?

    భాండశుద్ధి లే.-.ని పాకమేల?

    చిత్త శుద్ధి లే.-.ని శివపూజలేలరా?

    విశ్వదాభిరామ వినురవేమ.

    అర్థము:

    ఆత్మ, మనసు మంచి ఆలోచనలతో లేకుండా ఆచారాలు పాటించడం ఎందుకు?

    వంట చేసేటపుడు పాత్ర శుభ్రంగా లేకపోతే వంట చేయడమెందుకు?

    చిత్తం అనగా మనసు లోని ఆలోచనలు, బుద్ధి నిర్మలంగా లేకపోతే శివ పూజ చేయడం ఎందుకు?

    చక్కగా, నిజాయితీగా చేయని ఏ పని వల్ల కూడా సత్ఫలితం పొందలేము.

    అని వేమన భావం .

    1. ఇన్ని చదివాక కూడా జగన్ సుద్దపూస అని నేను రాసినట్లుగా మీకు తోస్తే మీ నేత్రశుద్ధిని మీరు పరీక్షింప చేసుకోవాలి.

      1. Direct గా సుద్దపూస అని రాయనవసరం లెదు. చంద్రబాబు దొం.-.గ ప్రచారం చెసి వొడించాడు అని రాస్తె సరిపొదా?

  61. కేవలం రాజధాని, ఇసుక మూలంగా వొదిపోయారని 
    ఒక్క పేజ్ లో రాస్తే సరిపోయేదని ఈ సోది ఏంటో మరి
    1. ఆ రెండూ తప్ప తక్కినవన్నీ అద్భుతంగా ఉన్నాయని మీరు ఫీలవుతున్నారేమో కానీ నేను ఫీలవలేదు. అందుకే యిన్ని పాయింట్లు రాస్తున్నాను. సోది అనిపిస్తే చదవడం మానేయవచ్చు, నిక్షేపంలా. ఇదేమీ మీ సిలబస్‌లో లేదు.

      1. ఆ రెండిటి తోనే అంతా అయిపోయింది..”అద్భుతం” అనే మాటే లేకుండా చేసుకున్నరు. మీరు కొంచెం విపులం గా అర్ధం చేసుకుంటే ఇసుక మూలంగా ఎంత అనర్థం జరిగిందో తెలుస్తుంది..కార్మికుడు సర్వనాశనం అయ్యాడు..రోడ్డున పడ్డాడు క్యాంటీన్ లు తీసి వల్ల పొట్ట కొట్టారు

  62. అక్కడికి ఏదో డాక్టర్ సుధాకర్ విషయంలో పాపం మీ జగ్లక్ తప్పేమీ లేదు ఆయనదే తప్పు అన్నట్లు రాసుకొచ్చారు

    మరి ఒక అబ్బాయి మద్యం మత్తులో ఏవో నాలుగు బూతులు తిడితే తెల్లారేపాటికి శవమైపోయాడు అంటే ఈ రౌడీ రాజ్యం ఎంతగా ఎంత క్రూరంగా ప్రజ్వరిల్లిందో ఒకసారి రాయలేకపోయారా

  63. అక్కడికి ఏదో డాక్టర్ సుధాకర్ విషయంలో పాపం మీ జ గ్ల క్ తప్పేమీ లేదు ఆయనదే తప్పు అన్నట్లు రాసుకొచ్చారు

    మరి ఒక అబ్బాయి మద్యం మత్తులో ఏవో నాలుగు బూతులు తిడితే తెల్లారేపాటికి శవమైపోయాడు అంటే ఈ రౌ డీ రాజ్యం ఎంతగా ఎంత క్రూరంగా ప్రజ్వరిల్లిందో ఒకసారి రాయలేకపోయారా

  64. అక్కడికి ఏదో డాక్టర్ సుధాకర్ విషయంలో పాపం మీ జ గ్ల క్ తప్పేమీ లేదు ఆయనదే తప్పు అన్నట్లు రాసుకొచ్చారు

    మరి ఒక అబ్బాయి మ ద్యం మత్తులో ఏవో నాలుగు బూ తు లు తి డి తే తెల్లారేపాటికి శవమైపోయాడు అంటే ఈ రౌ డీ రాజ్యం ఎంతగా ఎంత క్రూరంగా ప్రజ్వరిల్లిందో ఒకసారి రాయలేకపోయారా

  65. అక్కడికి ఏదో డాక్టర్ సుధాకర్ విషయంలో పాపం మీ జ గ్ల క్ తప్పేమీ లేదు ఆయనదే తప్పు అన్నట్లు రాసుకొచ్చారు

    మరి ఒక అబ్బాయి మ ద్యం మ త్తులో ఏవో నాలుగు బూ తు లు తి డి తే తెల్లారేపాటికి శ వ మై పోయాడు అంటే ఈ రౌ డీ రాజ్యం ఎంతగా ఎంత క్రూ రంగా ప్రజ్వరిల్లిందో ఒకసారి రాయలేకపోయారా

  66. అక్కడికి ఏదో డా క్ట ర్ సుధాకర్ విషయంలో పా పం మీ జ గ్ల క్ తప్పేమీ లేదు ఆయనదే త ప్పు అన్నట్లు రాసుకొచ్చారు

    మరి ఒక అబ్బాయి మ ద్యం మ త్తులో ఏవో నాలుగు బూ తు లు తి డి తే తెల్లారేపాటికి శ వ మై పోయాడు అంటే ఈ రౌ డీ రాజ్యం ఎంతగా ఎంత క్రూ రంగా ప్రజ్వరిల్లిందో ఒకసారి రాయలేకపోయారా

  67. చంద్ర బాబుని ఎవరన్నా తిడితే అవన్నీ నిజాలు

    జగన్ నీ ఎవరన్నా తిడితే అవన్నీ దురుద్దేశంతోనో అక్కసుతోనో కుళ్లుతోనో చెప్పిన అబద్దాలు

    అంతే కదా ఎంబిఎస్ గారు?

    ఎందుకీ ఆత్మవంచన ?

  68. అనంత బాబు అమాయకుడు అని స్పెషల్ ఆర్టికల్ రాయండి సారూ , తరిస్తాం చదివి మీ స్తోత్రాలు చదివి

  69. Jagan Vodipovataniki karanalu ani title petti..Chandrababu em chesadu, Media em chesindi ani sollu covering enduku Prasad garu..ee articles motham lo nijam ga Jagan chesina thappulu emi ledu kevalam media valle jagan vodipoyadu annatlu vundi

  70. “… లోని నాయకత్వ లక్షణాలను పసిగట్టి…” ఈ ఒక్క వాక్యం చదివితే, చాలు, ఇక చాలు బాబోయ్!

  71. “వైయస్ జీవించి ఉండగానే జగన్‌లోని నాయకత్వ లక్షణాలను బాబు పసిగట్టి ఉంటారు. ఇతను ఎప్పటికైనా నా వారసుడు లోకేశ్‌కు ప్రత్యర్థి అవుతాడు, మొగ్గలోనే తుంచాలి, లేదా జనం దృష్టిలో ఓ చెడు ముద్ర వేసి ఎదగకుండా చేయాలి అనుకుని ఉంటారు.”

    ఈ మధ్యకాలంలో ప్రసాదుగారి కలం నుండీ ఇంతటి హాస్యం జాలువారలేదు.

Comments are closed.