మూడు పాటలు మినహా సినిమా పూర్తి

ఫిదా తరవాత శేఖర్ కమ్ముల వార్తల ఊసేలేదు. ఏ హడావుడి లేకుండా ఆయన చాలా సైలంట్ గా సినిమా తీసుకుంటూ వెళ్తున్నారు. డ్యాన్స్ నేపథ్యంలో ఇద్దరు కొత్త హీరో హీరోయిన్లతో ఆయన ఓ సినిమాను…

ఫిదా తరవాత శేఖర్ కమ్ముల వార్తల ఊసేలేదు. ఏ హడావుడి లేకుండా ఆయన చాలా సైలంట్ గా సినిమా తీసుకుంటూ వెళ్తున్నారు. డ్యాన్స్ నేపథ్యంలో ఇద్దరు కొత్త హీరో హీరోయిన్లతో ఆయన ఓ సినిమాను తయారుచేస్తున్నారు. ఆ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. మూడుపాటల వర్క్ మిగిలివుంది.

అయితే ఈ మూడు పాటలు నృత్య ప్రాధాన్యమైనవి కావడంతో, హీరో హీరోయిన్ల చేత ఫుల్ గా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నారు. సమ్మర్ కావడం వల్ల ఎక్కువగా ప్రాక్టీస్ కుదరడం లేదు. ఈ మూడు పాటల చిత్రీకరణకే నెలరోజులు పడుతుందట. పైగా ఓ పాటలో కొంతభాగం దుబాయ్ లో చిత్రీకరించాల్సి వుంది.

ఇవన్నీ పూర్తయ్యే సరికి ఆగస్టు వచ్చేస్తుందని అంచనా. శేఖర్ కమ్ముల హడావుడి లేకుండా, చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్తారు. అందువల్ల ఈ సినిమా దసరాకు కాస్త ముందుగా వస్తుందని అంచనా. నైజాంలో ఏస్ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు.

ఈ సినిమా హీరో హీరోయిన్లను ఇప్పటివరకు బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు. షూటింగ్ ప్రదేశానికి ఎవరినీ సెల్ ఫోన్ లతో రానివ్వడంలేదు. యూనిట్ కూడా సెల్ పోన్ లు పక్కనపెట్టి పనిచేస్తున్నారు.

శంకర్ సినిమా అంటే.. భారీతనం, డిఫరెంట్ టేకింగ్, స్టైలిష్ మేకింగ్