క్రిస్మస్ కు కలుద్దాం.. ప్రకటించిన దిల్ రాజు

గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు.. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా ఇటు దిల్ రాజు, అటు రామ్ చరణ్.. అదంతా శంకర్ చేతుల్లోనే ఉందంటూ తప్పించుకునేవాళ్లు. తాజాగా శంకర్…

గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడు.. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఎదురైనప్పుడల్లా ఇటు దిల్ రాజు, అటు రామ్ చరణ్.. అదంతా శంకర్ చేతుల్లోనే ఉందంటూ తప్పించుకునేవాళ్లు. తాజాగా శంకర్ ను అడిగితే, అంతా కలిసి నిర్ణయం తీసుకుంటామంటూ తప్పించుకున్నాడు.

ఎట్టకేలకు గేమ్ చేంజర్ విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న పుకార్లు నిజమయ్యాయి. గేమ్ ఛేంజర్ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయబోతున్నట్టు కొద్ది సేపటి కిందట దిల్ రాజు ప్రకటించారు. “క్రిస్మస్ కు కలుద్దాం” అంటూ విస్పష్ట ప్రకటన చేశారు.

శంకర్-రామ్ చరణ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్ సినిమా. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అటు చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ తర్వాత ఏరికోరి ఈ సినిమాను సెలక్ట్ చేసుకున్నాడు.

అయితే శంకర్ తో వ్యవహారం మామూలుగా ఉండదు కదా, పైగా మరోవైపు భారతీయుడు-2 కూడా ఉంది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు ఆలస్యమౌతూనే ఉంది. ఈమధ్యనే రామ్ చరణ్ తన పోర్షన్ పూర్తిచేశాడు. అటు భారతీయుడు-2 కూడా రిలీజై’పోయింది’.

దీంతో ఏ క్షణానైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ బయటకొస్తుందని అంతా ఎదురుచూశారు. ఈరోజు దిల్ రాజు స్వయంగా క్రిస్మస్ రిలీజ్ అని ప్రకటించారు.

3 Replies to “క్రిస్మస్ కు కలుద్దాం.. ప్రకటించిన దిల్ రాజు”

Comments are closed.