ఇద్ద‌రు అంద‌గ‌త్తెల‌ను బ‌లిగొన్న రోడ్డు ప్ర‌మాదం

రోడ్డు ప్ర‌మాదం ఇద్ద‌రు అంద‌గ‌త్తెల‌ను బ‌లిగొంది. ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న ఆ యువ‌త‌లు ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర విషాదాన్ని నింపింది. మాజీ మిస్ కేర‌ళ అన్సీ క‌బీర్ (25), ర‌న్న‌ర్‌గా నిలిచిన అంజ‌నా షాజ‌న్…

రోడ్డు ప్ర‌మాదం ఇద్ద‌రు అంద‌గ‌త్తెల‌ను బ‌లిగొంది. ఉజ్వ‌ల భ‌విష్య‌త్ ఉన్న ఆ యువ‌త‌లు ప్రాణాలు కోల్పోవ‌డం తీవ్ర విషాదాన్ని నింపింది. మాజీ మిస్ కేర‌ళ అన్సీ క‌బీర్ (25), ర‌న్న‌ర్‌గా నిలిచిన అంజ‌నా షాజ‌న్ (26)ల‌ను రోడ్డు ప్ర‌మాదంలో రూపంలో మృత్యువు బ‌లి తీసుకుంది. మిస్‌ కేరళ 2019 కాంపిటీషన్‌లో అన్సీ విన్న‌ర్‌గా, అంజ‌నా ర‌న్న‌ర్‌గా నిలిచారు. అప్ప‌టి నుంచి అన్సీ, అంజనా చాలా స‌న్నిహితుల‌య్యారు.

ఎక్క‌డికెళ్లినా ఇద్ద‌రూ క‌లిసి వెళ్లే వారు. ఈ క్ర‌మంలో కేర‌ళ‌లోని ఎర్నాకుళం బైపాస్‌లో సోమ‌వారం తెల్ల‌వారుజామున వాళ్లిద్ద‌రూ కారులో వెళుతుండ‌గా ఎదురుగా ద్విచ‌క్ర వాహ‌నం వ‌చ్చింది. వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి కారు అదుపు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో వాళ్లిద్ద‌రూ ప్ర‌యాణిస్తున్న కారు బాగా దెబ్బ‌తింది. దీంతో ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌మాదానికి కొన్ని నిమిషాల ముందు మాజీ మిస్ కేర‌ళ అన్సీ క‌బీర్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైర‌ల్ అవుతోంది. త‌న ఇన్‌స్టా అకౌంట్‌లో  ‘ఇట్స్ టైమ్ టు గో’అంటూ ఓ ఫొటోను ఆమె షేర్‌ చేసింది. 

ఇప్పుడు శాశ్వ‌తంగా వాళ్లిద్ద‌రూ అంద‌నంత దూరాల‌కు వెళ్లిపోవ‌డంతో ఆ పోస్ట్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇదే ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. వాళ్లిద్ద‌రూ ప్రాణాల‌తో పోరాడుతున్నార‌ని స‌మాచారం.