అటు రీ-రిలీజ్.. ఇటు రీఎంట్రీ

ఒకప్పటి హీరోయిన్లే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. ఇంద్రజ, భూమిక, మీనా, రమ్యకృష్ణ.. ఇలా చాలామంది హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా మారారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది.…

ఒకప్పటి హీరోయిన్లే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతున్నారు. ఇంద్రజ, భూమిక, మీనా, రమ్యకృష్ణ.. ఇలా చాలామంది హీరోయిన్లు ఇప్పుడు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా మారారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో హీరోయిన్ చేరింది. ఆమె పేరు అనిత.

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు-నేను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది అనిత. తొలి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించింది. అట్నుంచి అటు బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. తన ఫ్రెండ్ ఏక్తా కపూర్ నిర్మించిన పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించింది.

పెళ్లి తర్వాత బాలీవుడ్ కు కూడా దూరమైన ఈ భామ, ఇప్పుడు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. సుహాస్ హీరోగా రాబోతున్న ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో అనిత మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే ఇదేదో అక్క, వదిన టైపు పాత్ర కాదంటోంది అనిత.

హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అనిత వస్తుందంట. ఇందులో తనది చిన్న పాత్రే అయినప్పటికీ చాలా పవర్ ఫుల్ రోల్ అని చెబుతోంది. కొన్ని కథలు విని, ఫైనల్ గా ఈ సినిమాను తన రీఎంట్రీ మూవీగా అంగీకరించానని చెబుతోంది.

2013లో బిజినెస్ మేన్ రోహిత్ రెడ్డిని పెళ్లాడింది అనిత. 2021లో బిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన కొన్నాళ్లకే సినిమాల్లోకి రావాలనుకుంది. కానీ కరోనా వల్ల ఆమె ప్లాన్స్ వర్కవుట్ కాలేదు. ఇన్నేళ్లకు 42 ఏళ్ల వయసులో అనిత మళ్లీ టాలీవుడ్ లో అడుగుపెట్టింది. రీసెంట్ గా ఆమె నటించిన నువ్వు-నేను రీ-రిలీజ్ అవ్వడం, ఇటు అనిత టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇవ్వడం ఒకే ఏడాదిలో జరిగాయి.