Advertisement

Advertisement


Home > Movies - Movie News

సాఫ్ట్ గా హిట్ కొట్టిన సుమంత్

సాఫ్ట్ గా హిట్ కొట్టిన సుమంత్

సాఫ్ట్ మూవీస్ చేసిన ప్రతిసారి సుమంత్ సక్సెస్ అయ్యాడు. గోదావరి, మళ్లీ రావా సినిమాలు అతడి కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిచాయి. అలాంటి సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కిన తాజా చిత్రం "మళ్లీ మొదలైంది"తో మరోసారి హిట్ కొట్టాడు ఈ హీరో. అవును.. జీ5 లో నేరుగా స్ట్రీమింగ్ కొచ్చిన ఈ సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.

బాక్సాఫీస్ లో విడుదలైన సినిమా హిట్టయిందో లేదో చెప్పడానికి కలెక్షన్లు కొలమానంగా ఉంటాయి. అయితే నేరుగా ఓటీటీలో రిలీజైన సినిమాకు మాత్రం ఇలాంటి లెక్కలు లేవు. ఎంతమంది చూశారు, సబ్ స్క్రైబర్లు ఎంతమంది పెరిగారనేదే కొలమానం. ఈ లెక్కల్ని ఇప్పుడిప్పుడే ఓటీటీ సంస్థలు బయటపెడుతున్నాయి. అలా 'మళ్లీ మొదలైంది' సినిమాను విడుదలైన తొలి రోజు 5 కోట్ల నిమిషాల పాటు నెటిజన్లు చూశారంటూ ప్రకటన విడుదల చేసింది జీ5.

సుమంత్ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చిన రోజు నుంచి చూసుకుంటే.. జీ5కు సబ్ స్క్రైబర్లు తెలుగు మార్కెట్ నుంచి 2 లక్షల మందికి పైగా పెరిగారంట. ఇలా చూసుకున్నా సుమంత్ సినిమా ఓటీటీలో సక్సెస్ అయినట్టే లెక్క.

ఈడీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను అటుఇటుగా 4 కోట్ల 60 లక్షల రూపాయలకు దక్కించుకుంది జీ గ్రూప్ సంస్థ. ఎన్ని గంటల పాటు నెటిజన్లు ఈ సినిమాను చూశారు, ఎంత మంది వినియోగదారులు పెరిగారు అనే లెక్కల్ని చూసుకుంటే.. ఆ ఛానెల్ కు ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?