రూటు మార్చిన భారీ బడ్జెట్ నిర్మాతలు

యూవీ క్రియేషన్స్ పేరు చెప్పగానే భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. సాహో సినిమా వీళ్లు నిర్మించిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాతలదే. అయితే ఈ సినిమా తర్వాత…

యూవీ క్రియేషన్స్ పేరు చెప్పగానే భారీ బడ్జెట్ సినిమాలు గుర్తొస్తాయి. సాహో సినిమా వీళ్లు నిర్మించిందే. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రాధేశ్యామ్ కూడా యూవీ క్రియేషన్స్ నిర్మాతలదే. అయితే ఈ సినిమా తర్వాత ఈ నిర్మాతలు పూర్తిగా రూటు మార్చే ఆలోచనలో ఉన్నారు. కొన్నాళ్ల పాటు భారీ బడ్జెట్ సినిమాలు ఆపేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం యూవీ చేతిలో ఉన్న లైనప్ చూస్తుంటే.. మరో రెండేళ్ల పాటు వీళ్ల నుంచి భారీ బడ్జెట్ సినిమా వచ్చే అవకాశమే లేదు. త్వరలోనే అనుష్కతో ఓ సినిమా ప్లాన్ చేశారు యూవీ నిర్మాతలు. నవీన్ పొలిశెట్టి, అనుష్క కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఓ మీడియం రేంజ్ బడ్జెట్ మూవీ.

ఈ సినిమాతో పాటు ప్రస్తుతం గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్-2తో కలిసి నిర్మిస్తున్న పక్కా కమర్షియల్ అనే సినిమా కూడా మీడియం రేంజ్ బడ్జెట్ సినిమానే. దీంతో పాటు త్వరలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి రాబోతున్న ఏక్ మినీ కథ అనే సినిమా అయితే లో-బడ్జెట్ మూవీ. సంతోష్ శోభన్ ఇందులో హీరో.

ఈ సినిమాలతో పాటు నితిన్, కార్తికేయతో 2 సినిమాలు ప్లాన్ చేస్తోంది యూవీ సంస్థ. ఇవన్నీ ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే. ఇలా రాధేశ్యామ్ తర్వాత, కొన్నాళ్ల పాటు భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు ఈ నిర్మాతలు. 

'మోస‌గాళ్లు' మేకింగ్ వీడియో

నా రగ్డ్‌ లుక్‌ కోసం రెండు నెలలు కష్టపడ్డాను