ఏపీలో ప‌వ‌ర్ ఎవ‌రి చేత‌ల్లో…తేల్చే ప‌రీక్ష‌!

త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతోనే య‌న‌మ‌ల ర‌గిలిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ప‌ద‌విని రెన్యువ‌ల్ చేయ‌క‌పోతే మాత్రం….

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి అధికారంలో వుంది. అయినంత మాత్రాన… కూట‌మి నేత‌లంద‌రి చేతల్లో అధికారం వుంద‌ని అనుకోవ‌డం భ్ర‌మే. సీఎం చంద్ర‌బాబు కంటే కూట‌మిలో ఆయ‌న కుమారుడైన మంత్రి నారా లోకేశ్ ప‌వ‌ర్‌ఫుల్ అని విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు కేబినెట్‌లో కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌డం చూస్తే, లోకేశే శ‌క్తిమంతుడ‌ని ఎవ‌రైనా చెప్పేమాట‌.

అయితే చంద్ర‌బాబు, లోకేశ్‌ల‌లో ఎవ‌రు ప‌వ‌ర్‌ఫుల్ అని తేల్చ‌డానికి ఎమ్మెల్సీ ఎంపిక ప‌రీక్ష పెడుతోంది. ఏపీలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ఐదుగురు ఎమ్మెల్సీల స్థానాల్లో కొత్త‌వాళ్ల‌ను ఎన్నుకోవాల్సి వుంది. ఈ ఐదు సీట్లు కూట‌మికే ద‌క్క‌నున్నాయి. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కూడా రిటైర్ అయ్యేవాళ్ల‌లో ఉన్నారు.

ఇక్క‌డే చంద్ర‌బాబుకు అస‌లు ప‌రీక్ష ఎదురుకానుంది. య‌న‌మ‌లకు మ‌రోసారి ఎమ్మెల్సీ ప‌ద‌విని రెన్యువ‌ల్ చేస్తే చంద్ర‌బాబు మాట చెల్లుబాటు అవుతుంద‌ని అనుకోవాల్సి వుంటుంది. ఒక‌వేళ య‌న‌మ‌లకు రెన్యువ‌ల్ కాక‌పోతే మాత్రం… లోకేశ్ మాట చెల్లుబాటు అవుతుంద‌ని అనుకోవాల్సి వుంటుంద‌ని కూట‌మిలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల కాలంలో య‌న‌మ‌ల తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌నే మాట టీడీపీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.

ఆ మ‌ధ్య పోర్టు వ్య‌వ‌హారంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన పారిశ్రామిక‌వేత్త పేరు పెట్టి మ‌రీ సీఎం చంద్ర‌బాబుకు లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. య‌న‌మ‌ల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యే. అలాగే అల్లుడు ఏలూరు ఎంపీ. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంతోనే య‌న‌మ‌ల ర‌గిలిపోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ప‌ద‌విని రెన్యువ‌ల్ చేయ‌క‌పోతే మాత్రం…. ఆయ‌న రియాక్ష‌న్ ఎలా వుంటుందో అనే ఆందోళ‌న లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో య‌న‌మ‌ల‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి రెన్యువ‌ల్ అనేది చంద్ర‌బాబు, లోకేశ్ ప‌వ‌ర్‌కు ప‌రీక్ష లాంటిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దంటున్నారు టీడీపీ నేత‌లు.

14 Replies to “ఏపీలో ప‌వ‌ర్ ఎవ‌రి చేత‌ల్లో…తేల్చే ప‌రీక్ష‌!”

  1. నీకు ఇందాకే చెప్పాను వాళ్ళది వాళ్ళు కడుక్కుంటారు. ముందు మనవాళ్ళు సంగతి చూడమను

  2. ఈయన 2009 తరువాత యాక్టివ్ పాలిటిక్స్ లొ లెరు! అయినా 2014 నుండి 2019 వరకూ మంత్రిగా పనిచెసారు! ఈయన కుటుంబంలొ కూడా ఈయన కొరినట్టు కొత్త తరానికి టిక్కెట్లు ఇచ్చారు!

    .

    ఇక కొత్త వారికి అవకాశం కల్పించాలి!

  3. ఈయన గారిని చిక్కాల గారిని దూరం పెట్టడమే పార్టీకి మంచిది వీళ్ళు ఇద్దరు కార్యకర్తలను ప్రత్యర్థులతో కుమ్మకై నాశనం చేసారు చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చినప్పుడు మాత్రం స్టేజి మీద కూర్చొని షో చేస్తారు

  4. మీ అందరికీ ఒక్కటే చెపుతున్నా.. వైస్సార్సీపీ వాళ్లకి డైరెక్ట్ గ , ఇండైరెక్ట్ ఏ పనులు కూడా చేసే పరిస్థితి ఉండకూడదు.. బాబోరు..

    .

    సూపర్ సర్ మీరు… అలా ఉండాలి… అదే జగన్ చూడండి, కులం చూడం మతం చూడం అని అందరినీ సమానం గా చూస్తాం అని చెప్పి, చేస్తే, చాచి మొహాన కొట్టి, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించారు…

    .

    అందుకే మీరు సూపర్… ఇన్నాళ్లు రాజకీయాలు చేశారు..

    1. వీలైతే టాక్స్ లు కూడా.. ఒహ్హ్ సారీ, ఆల్రెడీ చేస్తున్నారు కదా.. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు టాక్స్ లు కట్టడం లేదు.. అందుకే రావాల్సిన gst , మైన్స్ మీద వచ్చే ఇన్కమ్, లిక్కర్ ఇన్కమ్ ఇంకా.. చాలా తగ్గిపోయాయి కదా.. సారీ, నేను మర్చిపోయా..

  5. అసలు ja*** మగాడా లేక మాడా అనే చర్చ కి సమాధానం MLC ఎలక్షన్ results తో ఒక కంక్లూషన్ కి వస్తుందని ప్రజల్లో విసృతంగా సర్కులేట్ అవుతుంది!!

  6. ఈయన పేరు లిస్ట్ లో టాప్ 50 లో కూడా ఉండదు..

    ఈయనకి ఇచ్చే బదులు.. జీవి రెడ్డి ని పిలిపించుకుని. అతనికి ఇవ్వడం బెటర్..

    పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది.. క్యాడర్ హ్యాపీ అవుతారు.. భవిష్యత్తు బాగుంటుంది..

    1. నెక్స్ట్ 5 ఇయర్స్ కష్టపడు. జనం కోసం తిరుగు. జనాల్లో బతుకు . పోరాడితే పోయేదేముంది ఇంకొన్ని రోజులు జైల్లోకి తప్ప. వస్తే అధికారం . అసెంబ్లీ కి రా. తప్పులు చేసావ్ . అవి కప్పి పూడ్చుకోడానికి ఇంకా చేస్తున్నావ్ . ఇంకా చాలు . దర్జా గా తిరుగు . నిజాయితీ గా ఉండు. అసెంబ్లీ లో ఆ దొంగ మొహం తో అందరికీ దొరికేశావ్. చోటా మోటా మీడియా కి కూడా కామెడీ పీస్ అయిపోయావ్. ఎందుకిలా? నీ కోసం రాష్ట్రం లో 40%. ప్రజలు వెయిటింగ్. అలా వస్తావు ఇలా వెళ్లిపోతావ్. దయచేసి నిజాయితీ గా ఉండు. ఇంకా చేతులు పిసిక్కుంటూ కూర్చుంటే కుదరదు . ముందు ఆ పిసుక్కోవడం ఆపెయ్యి . చివరికి నా దగ్గర కూడా చెప్పించుకునే పరిస్థితికి దాపురించావు.

  7. నెక్స్ట్ 5 ఇయర్స్ కష్టపడు. జనం కోసం తిరుగు. జనాల్లో బతుకు . పోరాడితే పోయేదేముంది ఇంకొన్ని రోజులు జైల్లోకి తప్ప. వస్తే అధికారం . అసెంబ్లీ కి రా. తప్పులు చేసావ్ . అవి కప్పి పూడ్చుకోడానికి ఇంకా చేస్తున్నావ్ . ఇంకా చాలు . దర్జా గా తిరుగు . నిజాయితీ గా ఉండు. అసెంబ్లీ లో ఆ దొంగ మొహం తో అందరికీ దొరికేశావ్. చోటా మోటా మీడియా కి కూడా కామెడీ పీస్ అయిపోయావ్. ఎందుకిలా? నీ కోసం రాష్ట్రం లో 40%. ప్రజలు వెయిటింగ్. అలా వస్తావు ఇలా వెళ్లిపోతావ్. దయచేసి నిజాయితీ గా ఉండు. ఇంకా చేతులు పిసిక్కుంటూ కూర్చుంటే కుదరదు . ముందు ఆ పిసుక్కోవడం ఆపెయ్యి . చివరికి నా దగ్గర కూడా చెప్పించుకునే పరిస్థితికి దాపురించావు.

  8. నీతిగా నిజాయితీగా ఈ 4 ఇయర్స్ ప్రజల కోసం తిరుగు, పోరాడు, ప్రజలతోనే బతుకు. పోరాడితే పోయేదేముంది ఇంకొన్ని రోజులు లోపలికి తప్ప. తర్వాత అధికారం నీదే . వింటున్నావా? అసెంబ్లీ కి రా దొర లాగా . దొంగ లా కాదు . రిజిస్టర్ వెతికి మరీ సైన్ పెట్టేసి వెళ్లిపోయావ్. నేను చేసుకునేటప్పుడు కనీసం 2 అవర్స్ క్లాస్ లో ఉండేవాడిని అటెండన్స్ కోసం

  9. ఒక వైపు అన్న చెప్పిన పదవి ఇవ్వలేని దిక్కుమాలిన స్థితి లో ఉన్నాం..ఇంకా వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఎందుకు

  10. ఈయన కి ఇచ్చిన అవకాశాలు …తరవాత తరానికి ఇచ్చిన అవకాశాలకు తోడు ఈయన అసంతృప్తి గా ఉన్నారు అంటే..మన అన్న తో హిమాలయాలు వెళ్లిపోవడం బెటర్

Comments are closed.