రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అని సామెత! అంటే రాజుగారు తలచుకుంటే ఏమైనా చేసేయగలరు.. ఆయనకు అడ్డు చెప్పే వారు ఎవరుంటారు? అలాగే ‘రాజు మెచ్చింది రంభ’ అని కూడా ఒక సామెత ఉంటుంది. అంటే రాజుగారికి నచ్చితే అందగత్తె అని అందరూ ఒప్పుకోవాలి.. ఆయనకు నచ్చకపోతే అందగత్తెను కూడా అనాకారిగా ముద్ర వేయాలి!
ఏపీ కూటమి ప్రభుత్వంలో ఇదే రాజనీతి అమలవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ కాలంలో పోలీసుల వద్ద అనేకానేక కేసులు నమోదై ఉంటాయి. అలాంటి వాటిలో పాలకులకు నచ్చిన కేసులను మాత్రం.. ఎంచక్కా జాగ్రత్తగా బయటకు తీసి వాటిని తిరిగి దర్యాప్తు చేస్తున్నారు. నా జీవితంలో రాజకీయ కక్షలు అనేవి ఉండవు.. అని చంద్రబాబునాయుడు చెబుతుంటారు గానీ.. ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరెస్టు అవుతున్న వైసీపీ నాయకులు, వారి మీద నమోదు అవుతున్న కేసుల పరంపరను గమనించిన ఎవ్వరికైనా సరే వాస్తవాలు అర్థమవుతాయి.
ఇలా పాలకులకు నచ్చిన కేసులను తిరిగి లోతుగా పరిశోధిస్తున్న పోలీసులు, పాలకులకు రుచించని వాటిని.. ‘తప్పుడు కేసులు’ అంటూ ఏకంగా కొట్టి పారేస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయన పీఏ కృష్ణారెడ్డి పెట్టినది తప్పుడు కేసు అని పులివెందుల పోలీసులు తేల్చడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వం కాలంలోనే వైఎస్ వివేకా హత్య జరిగింది. జగన్ ప్రభుత్వం కాలంలో సీబీఐ విచారణ కూడా సాగుతూ వచ్చింది. ఆ సమయంలో వివేకా పీఏ కృష్ణారెడ్డి.. పులివెందుల కోర్టును ఆశ్రయించి.. వారి ఆదేశాల ద్వారా పోలీసుకేసు పెట్టారు. ఈ హత్య కేసులో కొందరు నేతల ప్రమేయం ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పాలని కొందరు సీబీఐ అధికారులు, ప్రత్యేకించి ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నట్టుగా పీఏ కృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే సీబీఐ అధికారులకు అనుగుణంగా ఉండాలంటూ.. సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఒత్తిడి చేసినట్టు ఆయన కేసు పెట్టారు. తాజాగా- ఆ ముగ్గురి మీద పెట్టినది తప్పుడు కేసు అని తేలుస్తూ పులివెందుల పోలీసులు జమ్మలమడుగు కోర్టులో చివరి చార్జిషీట్ దాఖలు చేశారు. 23 మంది సాక్షులను విచారించిన తర్వాత.. ఇది తప్పుడు కేసు అని తేల్చినట్టుగా అందులో పేర్కొన్నారు.
అస్మదీయుల మీద నమోదు అయిన కేసులైతే.. అవి తప్పుడు కేసులు అని.. తస్మదీయులను ఇబ్బంది పెట్టడానికి వీలుగా ఉండేవి అయితే.. అవి మళ్లీ దర్యాప్తు చేయవలసిన అసలు సిసలు కేసులు అని.. ద్వంద్వనీతిని కూటమి ప్రభుత్వం పాటిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే.. ఎన్నికల సమయంలో జగన్ మీద విమర్శలతో విరుచుకుపడుతూ తమకు పరోక్షంగా మేలు చేసిన సునీత అండ్ కో కు ఇలాంటి ఊరట కల్పించారని ప్రజలు అనుకుంటున్నారు.
Oka amayukudu meeda case pedithe adi kakshe kani vallandaru criminal s tappu ledu well done cbn
Evaru aa prajalu? Ide website lo inkoka article lo raasinattu, YCP agnaanula????
Who are those people? Are they same ‘agnaanulu’ mentioned in another article in this same website?
బాబాయ్ హత్య దోషులకు శిక్ష పడాలని ప్రజలు కోరుకోవడం లేదా..?
ఏంటో ఈ ప్రజలు .. ఎప్పుడూ జగన్ రెడ్డి కోసమే ఆలోచిస్తుంటారు.. జగన్ రెడ్డి కోసమే బతుకుతుంటారు..
ఓట్లు మాత్రం టీడీపీ కి వేస్తారు..
..
జగన్ రెడ్డి హయం లో కృష్ణారెడ్డి సునీత పైన పోలీసుకేసు వేస్తే.. అస్మదీయులను కాపాడటం కోసం.. తస్మదీయులను ఇబ్బంది పెట్టడం కోసం అని నీకు అనిపించలేదు చూసారా.. దాన్నే న్యూట్రల్ జ ర్నలిజం అంటారు.. కదా..
‘Bulls eye’ shot, sir. Exposing the correct nature of this website
I am following this GA just because of EJAY’s counter comments, very sensible.
True. His comments are sensible and at the same time very satirical. Really enjoy his comments
Correct
Mari 5 years emi heekaru ? Central officer tasmadeeyulaki enduku support chestadu ??? Medalu vancham kabatti manam asmadeeyulame kadha central dhaggara ..
Excellent GA….సొంత BABAI ని అతి కిరాతకంగా నరికి చంపిన కూడా….సిగ్గులేకుండా ఇలా SUPPORT చేస్తున్నారు అంటే…..

మీరు అసలు మనుషులు కాదు GA
there are che ddis
yemi pareldu .. charge sheet ni savalu chestoo high court lo appeal ki vellamanu.. AP lo nammakam ledu ani TG high court lo vicharana avvali ani cheppu.. manam maatram mangalavaralu chesukuntoo.. kodi katti case lo kooda vangmoolam ivvaddu
yemi pareldu .. charge sheet ni savalu chestoo high c’ourt lo appeal ki vellamanu.. AP lo nammakam ledu ani TG high c’ourt lo vicharana avvali ani cheppu.. manam maatram m’angalavaralu chesukuntoo.. k’odi k’atti c’ase lo kooda vangmoolam ivvaddu
yemi pareldu .. charg’e shee’t ni savalu chestoo h’igh c’ourt lo appea’l ki vellamanu.. A.P lo nammakam ledu ani TG high c’ourt lo vicharana avvali ani cheppu.. manam maatram m’angalavaralu ches’ukuntoo.. k’odi k’atti c’ase lo k’ooda v’angmoolam ivvaddu
ye’mi p’areldu .. charg’e shee’t ni s’avalu ch’estoo h’igh c’ourt lo a’ppea’l ki vellamanu.. A.P lo na’mmakam l’edu ani T.G h’igh c’ourt lo vicharana avvali ani cheppu.. manam maatram m’angalavaralu ches’ukuntoo.. k’odi k’atti c’ase lo k’ooda v’angmoolam ivvaddu
“జగన్ ప్రభుత్వం కాలంలో సీబీఐ విచారణ కూడా సాగుతూ వచ్చింది.”…lol…everyone in andhra knows what happened between 2019-24….wait for consequences…there will not be any sympathy from andhra people
APKING & కో ఇప్పుడు “ట్రాన్స్ ఫర్ టు ఇన్విజిబుల్ మోడ్” చేసుకున్నారా?
మొన్నటి వరకూ “జగన్ అన్నా 30 ఏళ్లు మస్త్ గ్యారెంటీ!” అని బిగ్గరగా కేకలు వేసిన వాళ్లు, ఇప్పుడు “మౌనం విరామ సమయం” తీసుకున్నట్టున్నారు!