లోకేశ్‌కు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు

మంత్రిగా నారా లోకేశ్ బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయ‌న ప్ర‌జాదర్బార్ నిర్వ‌హిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో లేక‌పోతే త‌ప్ప‌, నిత్యం ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి…

మంత్రిగా నారా లోకేశ్ బాధ్య‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయ‌న ప్ర‌జాదర్బార్ నిర్వ‌హిస్తున్నారు. విజ‌య‌వాడ‌లో లేక‌పోతే త‌ప్ప‌, నిత్యం ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో వుంటున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి వివిధ స‌మ‌స్య‌ల‌పై లోకేశ్‌ను క‌లుస్తున్నారు. వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఆయ‌న దృష్టికి వెళుతున్న‌ట్టు తెలిసింది.

తాజాగా అప్పుగా ఇచ్చిన డ‌బ్బును ఇప్పించాలంటూ లోకేశ్‌కు ఫిర్యాదు చేయడం గ‌మ‌నార్హం. అనంత‌పురం నుంచి వెళ్లిన బాధితురాలు మ‌రియ‌మ్మ శుక్ర‌వారం ప్ర‌జాద‌ర్బార్‌లో లోకేశ్‌ను క‌లిశారు. అనంత‌పురం ఏఎస్పీ తియోపిల్లాస్‌కు 14 ఏళ్ల క్రితం రూ.22 ల‌క్ష‌లు ఇచ్చామ‌ని, అప్ప‌టి నుంచి ఎంత‌గా అడుగుతున్నా ఆయ‌న ఇవ్వ‌డం లేద‌ని లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. త‌న‌కు ఏఎస్పీ బంధువు కూడా అవుతాడ‌న్నారు.

ఎలాగైనా త‌న‌కు రావాల్సిన డ‌బ్బును ఇప్పించాలంటూ లోకేశ్ ఎదుట ఆమె క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు. ఇందుకు లోకేశ్ సానుకూలంగా స్పందించారు.

అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ త‌న వెనుక మాజీ ముఖ్య‌మంత్రి జగన్ ఉన్నాడ‌ని ఏఎస్పీ బెదిరిస్తున్నాడ‌న్నారు. త‌న‌ను ఏమీ చేయ‌లేరంటున్నాడ‌ని ఆమె చెప్పారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా త‌న‌కు న్యాయం చేస్తామ‌ని లోకేశ్ హామీ ఇచ్చిన‌ట్టు మ‌రియ‌మ్మ తెలిపారు.

7 Replies to “లోకేశ్‌కు వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు”

Comments are closed.