నాటి రాజీనామాకు నేడు సంబరాలు

ఈ ఘనత తమ నేతదే అంటూ గంటా వర్గీయులు ఆయన ఇంటి ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామని 2021 జనవరి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి నిరసనగా, ఆ తరువాత విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. దానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ఏ కారణాల వల్లనో ఆమోదించలేదు. మొదట్లో తన రాజీనామాను ఆమోదించడానికి స్పీకర్ ఇంటికి వెళ్లి మరీ ఒత్తిడి తెచ్చిన గంటా, ఆ తరువాత సైలెంట్ అయ్యారని విమర్శలు ఉన్నాయి.

ఆయన 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగానే ఓటు వేశారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన రాజీనామా ఆమోదించారు. అయితే తన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం అసంబద్ధమని గంటా వ్యాఖ్యానించారని ప్రచారంలో ఉన్న మాట.

ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కి భారీ ప్యాకేజీ దక్కింది. దాంతో, ఈ ఘనత తమ నేతదే అంటూ గంటా వర్గీయులు ఆయన ఇంటి ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. గంటా ఆనాడు నిరసన తెలియజేసి రాజీనామా చేయడంవల్లే ఈరోజు స్టీల్ ప్లాంట్ బతికి బట్టకట్టిందని అంటున్నారు.

నిజంగా అదే జరిగి ఉంటే, కేంద్రం నాలుగేళ్ల పాటు ఎందుకు మౌనంగా ఉంది అన్నది కూడా ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. బీజేపీ నేతలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయమని చెప్పకుండా, మంచి భవిష్యత్తు ఇస్తామని ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. ఇప్పుడు వారు దేశంలోనే అతి ముఖ్యమైన స్టీల్ ప్లాంట్ విశాఖలో ఉందని అంటున్నారు. దీనిని చూసిన ప్రజా సంఘాలు, ఉద్యమకారులు అంతా “కాల మహిమ” అనుకోవాల్సి వస్తోందిట.

6 Replies to “నాటి రాజీనామాకు నేడు సంబరాలు”

    1. అవును.. ఆ దరిద్రపు పాదం ఇండియా నుండి వెళ్ళిపోయాక.. ఇక్కడ అంతా శుభమే జరుగుతోంది..

      వచ్చిన వెంటనే.. శవం కోసం వెతుక్కొంటాడు చూడండి ..

      మూడు నెలల్లో సీఎం అయిపోతాను అని అరుస్తూ వచ్చేస్తాడు..

  1. మొన్నటి వరకు జీతాలు లేవు.. పండగ లేదు అని రాశారు కదా..

    ఈ రోజు 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చారు.. అంటే దాదాపు నాలుగేళ్ల నష్టాలు పూడ్చేశారు..

    గత మూడేళ్ళుగా ఉద్యమం చేస్తున్న విశాఖ ఉక్కు కార్మికుల జీవితాలకు భరోసా ఇచ్చారు..

    కనీసం ఒక్క ముక్క కూడా రాయాలని అనిపించలేదా.. న్యూట్రల్ జర్నలిస్టులవారికి..?

    ..

    జగన్ రెడ్డి హయాం లో విశాఖ ఉక్కు ని అమ్మేసి అక్కడ రాజధాని ని నిర్మించాలని అనుకొన్నాడు.. ఆ విషయం అప్పటి చీఫ్ సెక్రటరీ చెప్పాడు.. దాని గురించి జగన్ రెడ్డి ఖండించనే లేదు..

    ..

    కూటమి ప్రభుత్వం వచ్చాక.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కష్టం తోనే ఈ ఉక్కు పరిశ్రమ మళ్ళీ ఊపిరి పోసుకుంది.. ఇక కార్మికుల కష్టమే ఆ ఫ్యాక్టరీ ని నడిపించాలి.. బతికించాలి..

    ..

    7 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏమి సాధించింది అని ఇక్కడ కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి..

    నీ జగన్ రెడ్డి కి 5 ఏళ్ళు కాదు 50 ఏళ్ళు అధికారం ఇచ్చినా.. బెయిల్ కోసం కష్టపడతాడు గాని.. రాష్ట్రానికి రూపాయి కూడా కేంద్ర సహాయం సాధించలేడు ..

    ..

    విశాఖ ప్రజలు తెలివైనవాళ్లు.. అదృష్టవంతులు.. ఎంపీ గా భరత్ ని కాకుండా.. బొత్స ఝాన్సీ ని గెలిపించుకుని ఉంటె.. జీవితాలు నాశనం అయిపోయేవి..

  2. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

  3. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  4. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు దాని నష్టాలను ఇప్పుడు ప్రజలు కట్టిన పన్నులతో పూడుస్తున్నారు దాన్ని అమ్మేసి ఇప్పుడు ఇచ్చిన సొమ్ముతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే కొత్త ఎంప్లాయిమెంట్ జరిగి రాష్ట్రానికి మేలు జరుగును దాన్ని నడపడమంటే తెల్ల ఏనుగును మేపటమే అవసరానికి మించిన ఉద్యోగులు ఎవరి జమానాలో వాళ్ళు ఏ విధమైన అర్హత పరీక్షలు లేకుండా వేసేసుకొని ప్రజల సొమ్ము జీతాల కింద తినేస్తున్నారు పని చేసేవాడికి ఎవరు నిర్వహిస్తే ఏమిటి వీళ్లకు మాత్రం ప్రభుత్వమే నడపాలి ఆదుకు దొబ్బోచ్చు బాధ్యత ఇసుమంతైనా ఉండదు ఇందులో పన్ను కట్టేవాడు సన్నాసి ఇలాగైతే కిరానా షాప్ లు ఆటో రిక్షాల వాళ్లకు కూడా govt జీతాలిచ్చి నడిపించొచ్చు వీళ్ళ పిల్లలు govt స్కూల్ లో చదవరు వైద్యం ప్రైవేట్ హాస్పిటల్ కావాలి వీళ్లకు మాత్రం govt లోనే పనికావాలి

Comments are closed.