ఉగాది నాడు ఉచిత ప్రయాణం ఎలా మరిచిపోయారబ్బా?

ఎలాంటి పితలాటకాలు శషబిషలు లేకుండా ఆ పథకం రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి వీలుగా అమలవుతోంది.

సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లాలంటే కూటమి ప్రభుత్వం వణికిపోతున్నట్లుగా కనిపిస్తున్నది. హామీలను అమలు చేయడానికి వారికి ప్రజలు ఐదేళ్ల పరిపాలన అవకాశం ఇచ్చారన్న మాట నిజమే. కానీ దాని అర్థం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నింటిని- ఐదవ సంవత్సరం నెరవేర్చాలని కాదు. ఆ విషయం చంద్రబాబు నాయుడుకు కూడా బాగా తెలుసు. అందుకే ఒకటి రెండు హామీలను వెంటనే అమలు చేసి మిగిలిన వాటికి గడువు తేదీలను ప్రకటిస్తూ వచ్చారు.

అయితే చెప్పిన గడువు ప్రకారం హామీని అమలులోకి తేకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అపకీర్తిని మూట కట్టుకుంటూ ఉంది. ఉగాది నాటి నుంచి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు ప్రనకటించారు. ఆయన స్వయంగా ప్రకటించిన ఉగాది గడువు దాటిపోయిన తర్వాత కూడా అమలులోకి రాకపోవడం గమనించాల్సిన సంగతి.

చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు పంటసాయం, నిరుద్యోగ భ‌ృతి, ప్రతి మహిళకు రూ.1500 వంటివన్నీ పెండింగులోనే ఉన్నాయి. అన్నీ ఒకేసారి అమలు చేసేయాలని అనడం కాదు గానీ.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం విషయంలో కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడినట్టుగా వారి పరిస్థితి ఉంది.

ఎందుకంటే.. ఈ విధానం ఎలా అమలు చేస్తున్నారో స్టడీ చేయడానికి మంత్రుల, అధికారుల బృందం బెంగుళూరు వెళ్లి కొన్నిరోజులు గడిపి వచ్చారు. ఇది జరిగి చాలా కాలమే అయింది. ఉగాది నాటినుంచి ఉచిత ప్రయాణం ఉంటుందని చంద్రబాబు స్పష్టంగా ప్రకటించారు. కానీ.. ఉగాది గడిచిపోయిందిగానీ.. హామీ మాత్రం అమలుకాలేదు.

ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో సీనియర్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడుకు ఎందుకు చేతకావడం లేదు అనేది ప్రజల సందేహం. నిజానికి ఆయన మహిళలకు తమ తమ సొంత జిల్లాల్లో మాత్రమే ఉచిత ప్రయాణం ప్రకటించారు. అది కూడా అమలు చేయడం లేదు. పొరుగున తెలంగాణలో ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎంగా అధికారంలోకి వచ్చిన రెండో రోజునుంచి మహిళలకు ఉచిత బస్సుప్రయాణం కల్పించారు. పైగా అక్కడ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించవచ్చు కూడా.

ఇప్పటిదాకా ఏడాదికిపైగా గడిచిపోయినా.. ఎలాంటి పితలాటకాలు శషబిషలు లేకుండా ఆ పథకం రాష్ట్రమంతా ఉచిత ప్రయాణానికి వీలుగా అమలవుతోంది. తన శిష్యుడికి చిటికెలో చేతనైన హామీ.. చంద్రబాబుకు ఇంతకాలంగా ఎందుకు చేతకావడం లేదనేది ప్రజల ప్రశ్న. మరి చంద్రబాబు ఈ హామీ అమలుకు కొత్త గడువు తేదీని ఎన్నటికి ప్రకటిస్తారో వేచిచూడాలి.

12 Replies to “ఉగాది నాడు ఉచిత ప్రయాణం ఎలా మరిచిపోయారబ్బా?”

  1. ప్రజలు వేస్తున్న అసలైన ప్రశ్న ఏమిటంటే, తెలంగాణా లో వాళ్ళు ఎన్నుకున్న ఎంఎల్ఏ అసెంబ్లీ కి వెళ్లి వాళ్ళు సమస్య లు చర్చిస్తున్నారు, మరి ఆంధ్ర లో 11 ఎందుకు వెళ్ళడం లేదు అని

      1. ప్రతిపక్షం వత్తిడి చెయ్యలిగా ఇవ్వాలి అని…చేస్తే ఇస్తారేమో!!! లేదు మేము గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చుంటాం అధికారం వస్తే బయటకు వస్తాం అంటే కుదరదు

  2. యథా ప్రజా.. తథా రాజా.. ప్రజలు ఏరిపూకులు అయితే కొండ ఎర్రిపూకును రాజు గా ఎన్నుకుంటారు.

    1. అవును 2019 లో అదే జరిగింది…అందుకే తప్పు తెలుసుకొని ఈ సారి ప్రతిపక్ష నేత హోదా అడుక్కునే స్థాయికి తెచ్చారు. అసెంబ్లీ లో అడుగుపెట్టాలంటే గజగజ వణికే పోసిషన్ లో పెట్టారు

  3. నమ్మి ఓట్లు వేసిన ప్రజలకి అన్యాయం జరుగుతోంది అంటావ్. మరి వెళ్ళండి అసెంబ్లీ కి, ప్రశ్నించండి. జీతం మింగుతున్నారు కదా

  4. ఒరేయ్ గ్యాస్ ఆంధ్ర

    అధికారానికి రాకుండా మందు మీ అన్న లక్ష హామీలు ఇచ్చాడు అందులో ఎన్ని నెరవేర్చాడు రా?

    2000 పెన్షన్ 3000 చేయడానికి ఏళ్లు పట్టింది.

    అధికారంలోకి వచ్చిన వెంటనే 2000 నుంచి 3000 పెన్షన్ చేస్తానన్నాడు మరి ఎందుకు చేయలేదు .?

    ఐదు ఏళ్ళు ఎందుకు పట్టింది ? మీ వారు చేస్తేనేమో సంసారం అదే ఇతరులు చేస్తేనేమో వ్యభిచారం ?

    ఒరేయ్ కడుపుకు అన్నం తినేవాడు ఇలాంటి కారు కూతల కుయ్యడ్రా . మాట తప్పడం మడమ తిప్పడం

    ఏమంటే అవగాహన లేకుండా చెప్పాము అనడం .

    వారం రోజుల పిఆర్సి చేస్తానన్నాడు పెద్దమనిషి ఐదేళ్లైనా చేయలేకపోయాడు దిగిపోయాడు . మరి ఎందుకు చేయలేదు అని అడగొచ్చు కదరా గాడిద .

    ఇలా చెబుతూ పోతే చేంతాడో లిస్ట్ అవుతుందో లేరా గ్యాస్ ఆంధ్ర . నువ్వు చదివి భరించలేవులే. గాడిదల కుయ్యడం నీకు పరిపాటే కదా. ఎప్పుడూ గాడిదల కూస్తూ ఉండని జగన్ నీకు చెప్పినట్టున్నాడు అందుకే ఎప్పుడూ గాడిదల కూస్తూనే ఉన్నావు అలాగే కోస్తూ ఉండు. ఎందుకంటే నీకు పని పాట ఏం లేదు కదా .

Comments are closed.