Advertisement

Advertisement


Home > Politics - National

మరోసారి ఆసుపత్రి పాలైన సోనియా గాంధీ!

మరోసారి ఆసుపత్రి పాలైన సోనియా గాంధీ!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సోనియాగాంధీ మరోసారి ఆస్ప‌త్రిలో చేరారు. జ్వరం, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్ప‌త్రిలో పొందుతున్నారు. వాస్త‌వానికి గురువార‌మే ఆస్ప‌త్రికి చేరిన‌ప్ప‌టికి ఈ విష‌యం ఆల‌స్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ ఏడాదిలో సోనియాగాంధీ ఆస్ప‌త్రిలో చేర‌డం ఇది రెండోసారి. గ‌త జ‌న‌వ‌రిలో శ్వాస‌కు సంబంధించిన వైర‌ల్ ఇన్పెక్ష‌న్ కార‌ణంగా ఇదే ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించారు.

గతంలోనూ సోనియాకు క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరిగింది. అప్పటి నుంచి సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ పార్టీ 85ప్లీనరీ వేడుకల్లో సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్టు పరోక్షంగా వ్యాఖ్యానించారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?