వైఎస్ జగన్ కు హ్యాట్సాఫ్: నారాయణ మూర్తి

ఫిరాయింపు రాజకీయాలకు నో చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్.. అన్నారు ఆర్. నారాయణ మూర్తి. తన తాజా సినిమాను ఫిరాయింపు రాజకీయాల మీదే రూపొందిస్తున్నారు. 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' అనే…

ఫిరాయింపు రాజకీయాలకు నో చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హ్యాట్సాఫ్.. అన్నారు ఆర్. నారాయణ మూర్తి. తన తాజా సినిమాను ఫిరాయింపు రాజకీయాల మీదే రూపొందిస్తున్నారు. 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' అనే టైటిల్ తో ఫిరాయింపు రాజకీయాల మీద ఆయన సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై ఈ రెబల్ స్టార్ స్పందించారు.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఇది ఏమాత్రం స్వాగతించే అంశం కాదని నారాయణ మూర్తి అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు అంటే ప్రజాస్వామ్యం మార్కెట్లోకి వచ్చినట్టే అని ఆయన పేర్కొన్నారు.

ఇలాంటి ఫిరాయింపులు ఉండవని, ఎమ్మెల్యేల కొనుగోలుకు నో అని చెబుతున్న జగన్ మోహన్ రెడ్డిని నారాయణమూర్తి అభినందించారు. ఫిరాయింపులకు జగన్ ప్రోత్సహం ఇవ్వకపోవడం మంచి పరిణామం అని ఆయన అన్నారు.

దొరసాని మనసెరిగిన దొర.. ఏమి చెప్పాడో తెలుసా?