కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ తో ఆతిధ్య సమావేశం

డల్లాస్,  టెక్సాస్:  కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ కు ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్ లో గురువారం నాడు  ఏర్పాటు చేసిన…

డల్లాస్,  టెక్సాస్:  కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ కు ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో ఇర్వింగ్ బావర్చి రెస్టారెంట్ లో గురువారం నాడు  ఏర్పాటు చేసిన ఆతిధ్య సమావేశంలో వివిధ తెలుగు సంఘాల ప్రముఖ నాయకులు – రఘువీర్ బండారు – తెలంగాణా పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్);

డా. శ్రీధర్ కొర్సపాటి – నా ర్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ (నాటా); డా. సంధ్యా రెడ్డి గవ్వ – అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా); లక్ష్మి పాలేటి – తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (టాన్టేక్ష్); మురళి వెన్నం – తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా); శేఖర్ అన్నే- నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్); మహేంద్ర రావు – డల్లాస్ ఏరియా తెలంగాణా అసోసియేషన్ (డాటా) లు పాల్గొని వారు స్థానికంగాను, జాతీయ స్థాయిలోను, మాతృ దేశంలో ను చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను కాన్సల్ జెనరల్ కు వివరించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ తెలుగు సంఘాల ప్రతినిధుల తరపున డా. ప్రసాద్ తోటకూర కాన్సల్ జెనరల్ అఫ్ ఇండియా అసీం మహాజన్ ను శాలువా, జ్ఞాపిక తో ఘనం గా సత్కరించారు. 

తనకు ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన ఈ అభినందనకు కాన్సల్ జెనరల్ మహాజన్  కృతజ్ఞతలు తెలియజేస్తూ – “అమెరికాలో తెలుగు వారి విజ్ఞానం, ఆధిక్యత –  విద్యా, వైద్య, శాస్త్ర,  సాంకేతిక, వ్యాపారం లాంటి అన్ని  రంగాలలోను విశేష ప్రభావం చూపుతోందని ప్రశంసిస్తూ, అవసరమైనప్పుడు వీలైన సహాయం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు.”   

'చావు కబురు చల్లగా'పబ్లిక్ టాక్ 

జోగి బ్రదర్స్ సినిమా రివ్యూ