పాడుతా…తీయగా.. వివాదం ముదరగా!

ఊహించని విధంగా పాడుతా..తీయగా కార్యక్రమం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ పద్ధతిగా సాగిన ఈ కార్యక్రమం వెనక ఎంత రచ్చ నడుస్తుందో, సవివరంగా బయటపెట్టింది ప్రవస్తి అనే గాయని. Advertisement ఇప్పుడా గాయనిపై వరుసగా…

ఊహించని విధంగా పాడుతా..తీయగా కార్యక్రమం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ పద్ధతిగా సాగిన ఈ కార్యక్రమం వెనక ఎంత రచ్చ నడుస్తుందో, సవివరంగా బయటపెట్టింది ప్రవస్తి అనే గాయని.

ఇప్పుడా గాయనిపై వరుసగా కౌంటర్లు మొదలయ్యాయి. గాయని సునీత ముందుగా ప్రవస్తి కామెంట్స్ పై ప్రతిస్పందించారు. తనపై నేరుగా ఆరోపణలు చేసింది కాబట్టి, తను కూడా నేరుగా వీడియో పెడుతున్నానంటూ కెమెరా ముందుకొచ్చిన సునీత.. చిన్నప్పుడు ముద్దుగా పాడిన ప్రవస్తి, పాటలు పాడడంలో అదే నిలకడ కొనసాగించి ఉంటే బాగుండేదని అన్నారు.

ప్రవస్తిని మాత్రమే టార్గెట్ చేయాలనే విషయం తనకు, కీరవాణికి, చంద్రబోస్ కు లేదని అన్నారు సునీత. ఎవరో ఎలిమినేట్ అయితే లేదా ఎవరో జీవితంలో ఓడిపోతే చూసి ఆనందించేంత నీచమైన క్యారెక్టర్ తనది కాదన్నారు సునీత్. ప్రవస్తి ఆవేశంలో ఏదో మాట్లాడిందని, రికార్డింగ్ వీడియోస్ రిలీజ్ చేయడం లేదని అన్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు ప్రతిది రికార్డ్ అయిందని, సంస్థ దగ్గర ఆ వీడియోలు ఉన్నాయని అన్నారు.

సునీత వివరణ ఇచ్చిన వెంటనే జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ స్పందించింది. పాడుతా తీయగా కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నది ఈ కంపెనీనే. ఈ సంస్థ నిర్మాత ప్రవీణ దీనిపై స్పందించారు. మరీ ముఖ్యంగా చీరను బొడ్డు కిందకు కట్టుకోమన్నారంటూ ప్రవస్తి చేసిన ఆరోపణపై ప్రవీణ స్పందించారు.

ప్రతి పాటకు తగ్గట్టు దుస్తుల్ని తనే ఎంపిక చేస్తానని, అలా ఎంపిక చేసిన డిజైన్లను డిజైనర్ కు పంపిస్తే, వాళ్లు సింగర్స్ కొలతల ఆధారంగా దుస్తులు డిజైన్ చేసి ఇస్తారని అంటోంది ప్రవీణ. పాటకు తగ్గట్టుగానే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తాము తప్ప, మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ దుస్తులు డిజైన్ చేయలేదంటున్నారు.

ప్రవస్తి చేసిన బాడీ షేమింగ్ ఆరోపణల్ని కూడా ఆమె తిప్పికొట్టారు. అలాంటి అవమానం జరిగితే ఆ రోజే చెప్పి ఉండాల్సిందని, ఎలిమినేట్ అయిన తర్వాత చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు. ఈరోజు ప్రవస్తికి వ్యతిరేకంగా లిప్సిక, హారిక నారాయణ్ కూడా స్పందించారు.

11 Replies to “పాడుతా…తీయగా.. వివాదం ముదరగా!”

  1. ee ammayi pravasthi evaro kooda teleedu. Kaakapote aa ammayi chesina aaropanalu maatram komchem ekkuva gaa anipistunnayi. Ayina boddu kinda ku cheera kattatam, body shaming ivanni nenu nammalenu. Naaku maatram teesesaaranna badha to cheptunnattu adi kooda komchem ati telivi to cheptunnattu vundi. 

  2. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

    1. సొంత మామ పైకి చెప్పులు వేయించి తరువాత దండలు వేసి దండం పెట్టె  ఘనుడు మన బాబు గారే గొప్పోరు

Comments are closed.