Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ తెరపైకి ధనుష్-ఐశ్వర్య విడాకుల వ్యవహారం

మళ్లీ తెరపైకి ధనుష్-ఐశ్వర్య విడాకుల వ్యవహారం

రజనీకాంత్ అల్లుడు ధనుష్, కూతురు ఐశ్వర్య విడిపోయిన సంగతి తెలిసిందే. తామిద్దరం ఇకపై వేర్వేరు జీవితాలు గడుపుతామని, తమ వైవాహిక బంధం వీగిపోయినట్టు స్వయంగా ధనుష్ ప్రకటించారు. అలా రెండేళ్లుగా విడివిడిగా ఉంటున్న ఈ జంట, ఇప్పుడు మరోసారి విడాకుల వ్యవహారంతో తెరపైకొచ్చింది.

పరస్పర అంగీకారంతో అధికారికంగా విడాకుల కోసం వీళ్లిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఇది విచారణకు రాబోతోంది.

2022 జనవరి నుంచి తామిద్దరం విడివిడిగా ఉంటున్నామని, పిల్లల్ని ఉమ్మడిగా సంరక్షిస్తున్నామని, తమకు విడాకులు మంజూరు చేయాల్సిందిగా వీళ్లు తమ పిటిషన్ లో అభ్యర్థించారు. చట్టరీత్యా వీళ్లకు త్వరలోనే విడాకులు మంజూరు కాబోతున్నాయి.

2022 జనవరిలో ధనుష్, తన భార్య ఐశ్వర్య నుంచి విడిపోయినట్టు ప్రకటించాడు. అప్పట్నుంచి ఇద్దరూ తమ కెరీర్స్ పై దృష్టిపెట్టారు. ధనుష్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఐశ్వర్య, దర్శకురాలిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

మధ్యలో వీళ్లు తమ పిల్లల కోసం కలుస్తున్నారు. వీళ్లకు ఇద్దరు కొడుకులు. వాళ్ల స్కూల్ ఫంక్షన్స్ లో ధనుష్-ఐశ్వర్య కలిసి పాల్గొంటున్నారు. 18 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని గడిపి, ఉన్నఫలంగా వీళ్లు విడిపోవడం ఇప్పటికీ పెద్ద మిస్టరీనే. కారణాలేంటనేది బయటకు రాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?