మిర్చి బజ్జీ.. మసాలా టీ.. మహేష్ బాబు

ఈ రోజంతా టాలీవుడ్ లో మహేష్ బాబు మేనియా నడిచింది. ఉదయం సర్కారు వారి పాట టైటిల్ లోగో రిలీజ్ చేశాడు. సాయంత్రం అభిమానులతో ఛాటింగ్ పెట్టాడు. ఈ సందర్భంగా తనకు సంబంధించి కొన్ని…

ఈ రోజంతా టాలీవుడ్ లో మహేష్ బాబు మేనియా నడిచింది. ఉదయం సర్కారు వారి పాట టైటిల్ లోగో రిలీజ్ చేశాడు. సాయంత్రం అభిమానులతో ఛాటింగ్ పెట్టాడు. ఈ సందర్భంగా తనకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు మహేష్.

ఓవైపు వర్షం కురుస్తోంది..మరోవైపు ఫ్యాన్స్ తో ఛాటింగ్ నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో తనకు మిర్చిబజ్జీ, అల్లం టీ ఉంటే చాలా బాగుంటుందంటూ రియాక్ట్ అయ్యాడు మహేష్. ఇక తన ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ మునక్కాయ-మటన్ గురించి ఎవరో ప్రస్తావించగా.. దయచేసి ఇప్పుడు గుర్తుచేయొద్దు నోరూరిపోతోందంటూ స్పందించాడు.

లాక్ డౌన్ లైఫ్ పై స్పందిస్తూ.. ఇది తనకు లైఫ్ టైమ్ ఎక్స్ పీరియన్స్ గా చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లూ చేయలేకపోయిన ఎన్నో పనుల్ని కుటుంబంతో కలిసి చేశానని ఆనందంగా చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా కొడుకు గౌతమ్ తో ఆన్ లైన్లో టెన్నిస్, గోల్ఫ్, బేస్ బాల్ ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశానని అంటున్నాడు.

తన ఫస్ట్ క్రష్ పై కూడా ఫన్నీగా స్పందించాడు మహేష్. 26 ఏళ్ల వయసులో తొలిసారిగా ప్రేమలో పడ్డానని, ఆ తర్వాత ఆమెనే పెళ్లి చేసుకున్నానని అన్నాడు. ఇక హీరోయిన్లపై స్పందిస్తూ.. సమంత, రష్మికలో ఎవరు ఇష్టమో చెప్పడం చాలా కష్టం అన్నాడు. ఇద్దరూ తనకు ఇష్టమే అన్నాడు. పూరి జగన్నాధ్ తో సినిమా చేయడానికి తను ఎప్పుడూ సిద్ధమేనని, అతడే తనకు కథ చెప్పడంలేదన్న మహేష్.. రాజమౌళితో సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు ప్రకటించాడు.

ఇక తన కొత్త సినిమా సర్కారు వారి పాటపై స్పందిస్తూ.. పరిస్థితులు చక్కబడి, సెట్స్ పైకి వెళ్లేంతవరకు సినిమా రిలీజ్ ఎప్పుడనేది అప్పుడే చెప్పలేమన్నాడు. సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా తనకు క్లారిటీ లేదంటున్నాడు మహేష్. 

పేద‌ల‌కు మంచి జ‌ర‌గ‌డం చంద్ర‌బాబుకు ఇష్టం లేదా?