తండ్రికి నోటీసులు.. హక్కులకు భంగం కాదా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ద్వారా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడింది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ ద్వారా అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆ అవినీతి గురించి బాగా ప్రచారం చేసి వారు ఎన్నికల్లో నెగ్గారు. అంతగా ప్రచారం చేసిన తర్వాత దాన్ని నిరూపించడం వారికి అవసరం గనుక.. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం నియమించారు.

ఎన్నికల సమయంలో పార్టీ వారు ప్రచారం చేసిన అవినీతి గణాంకాలకు, సిట్ తేల్చిన మూడువేల కోట్లకు చాలా వ్యత్యాసం ఉంది. అదంతా పక్కన పెడితే.. గత ప్రభుత్వ కాలంలో ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ప్రధాన పాత్రధారిగా సిట్ తేల్చింది. అది వారి ఇష్టం.. వారికి ఉన్న సమాచారాన్ని బట్టి ఒక అభిప్రాయానికి వస్తారు.. విచారణ చేసిన తర్వాత తదనుగుణంగా ముందుకు సాగుతారు.. అందులో అభ్యంతరం లేదు.

అయితే, రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇవ్వడం పోలీసులకు వల్ల కావడం లేదు గనుక, ఆయన వారికి దొరకడం లేదు గనుక.. ఆయన ఆచూకీ కనుక్కోలేకపోతున్నారు గనుక.. ఆయన అసలు దేశం దాటి వెళ్లారో లేదో కూడా నిర్ధరించుకోలేకపోతున్నారు గనుక.. ఆయన తండ్రిని విచారణకు రమ్మని పిలవడం ఏ రకంగా సబబు అనిపించుకుంటుందో అర్థం కావడం లేదు.

కొడుకు రాజశేఖర రెడ్డి ఎక్కడకు వెళ్లాడనేది ఎన్నిసార్లు అడిగినా వివరాలు చెప్పలేదు గనుక విచారణకు విజయవాడ రమ్మని నోటీసులు ఇచ్చినట్టుగా సిట్ అధికారులు ప్రకటించారు. ఉపేందర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి పసివాడు కాదు. తండ్రి అనుమతి తీసుకుని వెళ్లడానికి. పైగా తన మీద కేసు పెట్టిన తర్వాత అజ్ఞాతంలోకి వెళుతూ.. తాను దాక్కోడానికి వెళుతున్నానని వృద్ధుడైన తండ్రికి చెప్పి ఆయనను టెన్షన్ పెట్టే పనిచేస్తాడా? ఎక్కడ దాక్కోబోతున్నానో చెప్పివెళ్తాడా? అనేది సామాన్యుల సందేహం.

రాజశేఖర రెడ్డి తండ్రికి తెలియకపోతే తెలియదనే చెప్తారు.. ఇంటికెళ్లి అడిగినా అదే చెప్తారు.. విచారణ పేరుతో నోటీసులిచ్చి విజయవాడకు పిలిచినా అదే చెప్తారు. అసలు నిందితుడు కనిపించలేదని తండ్రికి లేదా తల్లికి లేదా భార్యకు నోటీసులు ఇచ్చి విచారించడం చట్ట సమ్మతమేనా? ఇవన్నీ కూడా ప్రశ్నలే.

వైసీపీ పరిపాలన కాలంలో కూడా తెలుగుదేశానికి చెందిన చాలా మంది అవినీతి పరులు పరారయ్యారు. కొన్ని అవినీతి స్కాముల్లో ఇరుక్కుని ఉన్నవారు.. వైసీపీ పదవీకాలం మొత్తం దేశంలో లేకుండాపోయారు. ఆయా స్కాముల్లో నారాలోకేష్, చంద్రబాబులకు కూడా సంబంధాలు ఉన్నట్టు వైసీపీ వారు ఆరోపించారు కూడా. కానీ ఎవ్వరిని విచారిస్తే వివరాలు దొరుకుతాయో వారు మాత్రం అడ్రసు లేకుండాపోయారు. మరి వారి తండ్రులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన దాఖలాలు మాత్రం లేవు.

కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పు చేసి ఉండవచ్చు గాక.. పోలీసులు ఆయనను పట్టుకుని తమ సమర్థతను నిరూపించుకోవాలి.. తమకు కావాల్సినట్టుగా విచారణ చేసుకోవాలే తప్ప.. వృద్ధుడైన తండ్రిని విచారణకు పిలవడం ధర్మం కాదని తెలుసుకోవాలి.

10 Replies to “తండ్రికి నోటీసులు.. హక్కులకు భంగం కాదా?”

    1. Ante cbn maaji secretary ki pappesh leka blue fox cbn ade chesavaa.. vaadu kuda case la bayam tho 5 years address ledu..

      cbn gaaniki ee vayasulo ademipani

      1. ayyo neeli kj , eppudu aina ma netha cheyaledu ani cheppaleni kj lk batch meedi

        emi ante cbn adi edi antavu

        ante kj lk 11 … annamata nijamu ani oppukunavu

  1. 60 అడుగుల ఫెన్సింగ్ ప్యాలె*స్ లో వెతికితే అందరూ దొం*గలు, రేపి*స్ట్ లు, గుండా*లు, మా*ఫియా వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ ము*ద్ద చీక*డం లో ప్యాలెస్ పులకేశి కి బాగా ఎంజాయ్ చేస్తాడు.

  2. అసలు సి*గ్గు అనేది ఉందా *GA . వాళ్ళ నాన్నని విచారణకు రమ్మని మాత్రమే గా అన్నారు. అరెస్ట్ చేయటం లేదు కదా!

    అన్నియ్య కు ప్రభుత్వ సలహాదారునిగా ఉన్న వ్యక్తి,, ప్రభుత్వం మీద లి క్క ర్ *స్కాం జరిగింది, దానికి ఆ సలహాదారుడు ప్రధాన సూత్రధారి అని అభియోగం వస్తే, ఆ సలహాదారుడు విచారణకు రాకుండా పరారీ లో ఉన్నాడు.

    అలంటి వాళ్ళు అన్నియ్య సలహాదారులు. వాళ్ళని నువ్వు వెనకేసుకు రావటం.

  3. అంటే గతంలో ఇంటి కి వెళ్లి పిల్లలకు నోటిసులు ఇచ్చి రావడం తప్పు అంటారు అంతే నా

Comments are closed.