రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?

విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. ఈ భవనం ఎలా వాడుకోవాలి అన్నది ఇపుడు టీడీపీ కూటమి పెద్దలకు అర్ధం కావడం…

విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. ఈ భవనం ఎలా వాడుకోవాలి అన్నది ఇపుడు టీడీపీ కూటమి పెద్దలకు అర్ధం కావడం లేదు అని అంటున్నారు. దాని కోసం తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.

లేటెస్ట్ గా టూరిజం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ రుషికొండ భవనాల కోసం అయిదు వందల కోట్ల రూపాయలు దుబారా చేశారు అని వ్యాఖ్యానించారు. అది దుబారా ఎలా అవుతుంది ప్రభుత్వం ఆస్తి అని వైసీపీ నేతలు చెబుతున్నారు. దానిని ప్రభుత్వం నిర్వహించలేకపోతే ప్రైవేట్ పార్టీలకు ఇస్తే అద్దె రూపంలో గణనీయంగా ఆదాయం వస్తుందని సూచిస్తున్నారు.

అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు పై దాటినా కూడా రుషికొండ భవనాలను అలాగే ఉంచేశారు. మాట్లాడితే చాలు జగన్ దుర్వినియోగం చేశారు అని జనాల ముందు దానిని చర్చకు పెట్టడానికే ఇలా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.

విశాఖ ఏపీలోనే మెగా సిటీ అని అలాంటి సిటీలో మంచి భవనాలను నిర్మించి ప్రభుత్వ ఆస్తిగా వైసీపీ ప్రభుత్వం ఉంచితే దాని మీద కూడా నిందలు వేస్తూ వైసీపీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు అని అంటున్నారు. రుషికొండ భవనాలను చూపించి వైసీపీని ఎంతకాలం విమర్శించినా టూరిజానికి పైసా ఆదాయం అయితే రాదు అని అంటున్నారు. రుషికొండ భవనాలను వినియోగం దిశగా సర్కార్ ఆలోచనలు చేస్తే విశాఖకు పేరు వస్తుంది, ఆదాయం కూడా సమకూరుతుందని సూచిస్తున్నారు. దీని మీద కూటమి ఎపుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

27 Replies to “రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?”

  1. జగన్ 5 రూ అన్నా కాంటీన్ ఆపి, 500 కోట్లు రూ రుషికొండ మహల్ కట్టాడు. అడ్డమైన అబాండాలు ప్రస్తుతం సర్కార్ మీద బురద చల్లకుండా, ఒక్క గంట ఎటాయించి ప్రెస్ ముందుకు ఒచ్చి ఇందు మూలంగా కట్టాము, ఈ విధముగా వాడుకోవచ్చు అని ఒక్క మాట ఎందుకు చెప్పడు జగన్? ముఖ్య మంత్రిగా 5 సంవత్స్రాలు వెలగ పెట్టాడు, ఆ మాత్రం భాద్యత లేదా జగన్ కు? రన్నింగ్ కాస్ట్స్, మైంటెనెన్సు కాస్ట్స్ ఎంత అవుతుందో తెలిసే రాస్తున్నావా వ్యాసాలు జిఏ? ఒక్క బాత్రూం ఫిట్టింగ్స్ మార్చాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ప్రజల మీద ఎంత భారం పడుతుందో తెలుసా?

      1. కాదు కదా? దోమల మూలంగా కోట్ల ప్రజలకు మలేరియా, చికెన్ గునియా, డెంగ్యూ ఇతరత్రా నుండి విముక్తి. కానీ మహల్ మూలంగా కేవలం ఒక్క కిలాడీ జగన్ దోమ ప్రవేశం చెయ్యాలనుకుంది ప్రజల పన్నుతో. ఇపుడు అది మహల్ కానీ ఇల్లు కానీ హోటల్ కానీ ఎవరికీ అంతు చిక్కని చిదంబర రహస్యం అయిపోయింది ఎలా వాడుకోవాలో.

  2. జగనన్న సాధారణ ప్రయాణికుడి లాగా భార్య తో పాటు విమానం లో ఉన్న ఫోటో ముచ్చట వెబ్సైటు వాళ్ళు ఫేస్బుక్ లో పెట్టారు, అది నిజమైంది యేనా?

    1. అప్పట్లో పక్కనే 2 కిలోమీటరు దూరానికి కూడా ప్రభుత్వ హెలికాప్టర్ వాడేవాడు, ప్యాలస్ పులకేశి.

  3. ఒరే బోకు వెదవ, ఇంకా నీకు,మీ జగన్ రెడ్డి కి జనాలు మూలన కూర్చో పెట్టిన సిగ్గు లేకుండ ఇంకా పనికి మాలిన ఆర్టికల్స్ వ్రాస్తున్నారు.

  4. YCP వాళ్ళు ముందు చెప్పాల్సింది రుషికొండ ప్యాలెస్ కట్టింది రాష్ట్రపతి/ ప్రధాని విడిది కోసమా లేక టూరిజం ద్వారా ఆదాయం సంపాదించడానికా?

    విడిది కోసం కట్టి వుంటే ఆదాయం కోల్పోవడం అనే మాట మాట్లాడకూడదు లేక టూరిజం కోసం కట్టి వుంటే ఆ భవనం ఆ డిజైన్ లో వుండకూడదు.

    మొదటి దేని కోసం కట్టి వుంటారో తేల్చుకొని మాట్లాడండి.

  5. మీరు కట్టించిన విధానానికి వాటిని ఏ విధంగా వాడుకోవాలో అర్థం కావడం లేదు. ఎలా వాడుకోవాలో మీరు చెప్పండి.

  6. డెస్టినేషన్ వెడ్డింగ్ హాల్ కింద మారిస్తే, ప్రభుత్వానికి కాస్త డబ్బులు వస్తాయి.

    ప్రభుత్వ అఫస్ కి పనికి రాదు.

    గెస్ట్ హౌస్ కింద వృధా అవుతుంది.

    హాస్పిటల్ గా పనికి రాదు.

    జగన్ గారు వారి యొక్క ఇద్దరు కుమార్తెల వివాహం ఇక్కడే జరిపించి , ఆ రూపంలో అయిన , ప్రజల డబ్బు కాస్త అయిన తిరిగి చెల్లించాలి.

    1. problem emiti ante jagan anna danni raja mahal laaga kattadu, so cbn gaaru kani any politician cant withstand the thought of giving that as hotel/marriage hall to general public. alaagani danni CBN gaare enjoy cheddam ante, monnati daaka – vandala kotlu deeni meeda tagaleshadu ani oka vaipu cheptu – inko vaipu dantlo ventane doorataniki moha maatam addam vastundi 🙂 . as all politicians are for praja seva – supreme court shall put a rule saying that – politicians in rule should not be given a paisa or any benefits from public money… appudu ee godavalu vundavu…

      1. inko vishayam emitante – prajala sommu dochukovatam lo evaru takkuva kaadu. if i remember when CBN gaaru became CM in 2014 – papam vaariki hyderabad lo pani cheyataniki sarinaa office leka – kontha kaalam 5 start hotel nunchi pani chestu ( governments funds paid) – oka 10-20 crores tho valla own house ni remodel cheyinchukunnaru anukonta. Jagan gaaru danni inko level ki teesuku vellaru anthe – by spending 50 times more money on buildings – for CM stay… all these politicians enjoy a different level of benefits. Government lo pani chese politicians ki paisa ivvam and they also shall travel in normal traffic ( i.e. without stopping all general public and give way to politicians convoy) , and if they go to tours and stay – they shall spend their own money ani konni rules pedithe chaalu – praja sevakee jeevitham ani sollu cheppe vallu antha politicis nunchi paari potharu – manaku pattina daridram vadulutundi.

  7. సరే నీవు గాని, జగన్ అభిమానులు గాని అద్దెకు తీసుకొని 500 కోట్లకు సంవత్సరానికి ఎంత వడ్డీ వస్తుందో అంత అద్దె చెల్లించండి. లేదంటే మీ నాయకుడు అత్యంత మోజు పడి కట్టుకున్నాడు కనుక ఆయన గాని, అప్పటి టూరిజం మినిస్టర్ గాని అద్దెకు తీసుకొని అద్దె చెల్లించిన సరే. అలా రాస్తే రాష్ట్రానికి మేలు చేసినవాడివి అవుతావు

Comments are closed.