టీడీపీ క‌డ‌ప న‌గ‌ర అధ్య‌క్షుడిపై హ‌త్యాయ‌త్నం.. అంత‌ర్గ‌త క‌ల‌హాలతోనే!

క‌డ‌ప టీడీపీలో వ‌ర్గ‌పోరు తీవ్ర‌మైంది. టీడీపీ అధికారంలో ఉండ‌గా, ఆ పార్టీకి న‌గ‌ర అధ్య‌క్షుడు సాన‌పురెడ్డి శివ‌కొండారెడ్డిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. స్థానికులు అడ్డుకోక‌పోయి వుంటే, తాను ఏమై ఉండేవాడినో ఊహించ‌డానికే…

క‌డ‌ప టీడీపీలో వ‌ర్గ‌పోరు తీవ్ర‌మైంది. టీడీపీ అధికారంలో ఉండ‌గా, ఆ పార్టీకి న‌గ‌ర అధ్య‌క్షుడు సాన‌పురెడ్డి శివ‌కొండారెడ్డిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. స్థానికులు అడ్డుకోక‌పోయి వుంటే, తాను ఏమై ఉండేవాడినో ఊహించ‌డానికే భ‌య‌మేస్తోంద‌ని కొండారెడ్డి క‌న్నీటిప‌ర్యంతం కావ‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు రాజ‌కీయంగా ఎవ‌రితోనూ గొడ‌వ‌లు లేవ‌ని ఆయ‌న చెప్పారు. వైసీపీలో త‌న‌కు శ‌త్రువులు లేర‌ని ఆయ‌న పేర్కొన్నారు.

క‌డ‌ప‌లో అధికార పార్టీకి చెందిన ముఖ్య లీడ‌ర్ అరాచ‌కాల‌పై సీఎం చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడైన మంత్రి లోకేశ్‌కు కొంత‌కాలంగా సొంత పార్టీ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో స‌ద‌రు లీడ‌ర్ తీవ్ర అస‌హ‌నంలో ఉన్న‌ట్టు తెలిసింది. దోపిడీలో వైసీపీ నాయ‌కులే బెట‌ర్ అనే స్థాయిలో క‌డ‌ప న‌గ‌రంలో అధికార పార్టీకి చెందిన కీల‌క లీడ‌ర్ నేతృత్వంలో దందాలు సాగిస్తున్న‌ట్టు ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి.

త‌మ‌పై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన వారిలో న‌గ‌ర అధ్య‌క్షుడు శివ‌కొండారెడ్డి ఉన్న‌ట్టు వారు అనుమానిస్తున్నారు. ఇదే హ‌త్యాయ‌త్నానికి దారి తీసి వుంటుంద‌నే చ‌ర్చ క‌డ‌ప న‌గ‌రంలో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. బాధితుడైన కొండారెడ్డిని స్థానిక ప్ర‌జాప్ర‌తినిధి వ్య‌తిరేక వ‌ర్గంగా చెలామ‌ణి అవుతున్న అలంఖాన్‌ప‌ల్లె ల‌క్ష్మిరెడ్డి, గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, హ‌రిప్ర‌సాద్ త‌దిత‌రులు ప‌రామ‌ర్శించారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, అలాగే ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ అధికారంలో ఉన్నప్పుడు రాజ‌కీయంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసినా, ఎప్పుడూ ఇలా భౌతిక‌దాడుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు లేవ‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో క‌డ‌ప‌లో కొత్త సంస్కృతికి తెర‌లేపార‌ని, ఇది ఎంత వ‌ర‌కు దారి తీస్తుందో అర్థం కావ‌డం లేద‌ని వారంతా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టీడీపీ అధికారంలో వుండ‌గా, అదే పార్టీకి చెందిన న‌గ‌ర అధ్య‌క్షుడిపై దాడి జ‌ర‌గ‌డం ఏంట‌ని అదే పార్టీకి చెందిన ల‌క్ష్మిరెడ్డి, గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, హ‌రిప్ర‌సాద్ త‌దిత‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. దాడికి పాల్ప‌డిన వారిని వెంట‌నే ప‌ట్టుకుని, దోషులెవ‌రో స‌మాజం ముందు నిల‌బెట్టాల‌ని టీడీపీ నాయ‌కులు డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

10 Replies to “టీడీపీ క‌డ‌ప న‌గ‌ర అధ్య‌క్షుడిపై హ‌త్యాయ‌త్నం.. అంత‌ర్గ‌త క‌ల‌హాలతోనే!”

Comments are closed.