ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేరా?

ఏపీలో మాత్రం కూటమికి తిరుగులేదు జగన్ ప్రతిపక్షంలోనే ఉంటాడని భారీ డైలాగులు వదులుతున్నారు తప్పించి మేము ఏదో నాటికి ఏపీలో అధికారంలోకి వస్తామని నిబ్బరంగా ఎందుకు చెప్పడం లేదు

దేశంలో ఎక్కడ బీజేపీ గెలిచినా ఆ పార్టీ నేతలు అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకుంటారు. బీజేపీ బాగా ఎదుగుతోందని సంతోషిస్తూ స్వీట్లు పంచుకుంటారు. బీజేపీకి ఎదురు లేదు, తిరుగు లేదు అని కూడా ధీమాగా చెబుతారు.

బీజేపీదే రాజ్యమని, బీజేపీ తప్ప దేశంలో మరో పార్టీకి అవకాశమే లేదని అంటారు. ఇన్ని చెప్పిన వారు ఏపీలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పలేకపోతున్నారు అన్నదే అంతా తర్కించుకుంటున్నారు. బీజేపీ దేశమంతా విస్తరిస్తోంది.

మారు మూల రాష్ట్రాలలో కమల వికాసం జరుగుతోంది. ఎన్నడూ ప్రవేశించని ప్రాంతాలలో కూడా చొచ్చుకుని పోతోంది. ఏపీలో ఏమి పాపం చేసింది అని అనిపించడం లేదా అని కూడా అంటున్నారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని నేతలు చెబుతూ ఢిల్లీ విజయాన్ని అనందంగా చేసుకున్నారు.

ఏపీలో మాత్రం కూటమికి తిరుగులేదు జగన్ ప్రతిపక్షంలోనే ఉంటాడని భారీ డైలాగులు వదులుతున్నారు తప్పించి మేము ఏదో నాటికి ఏపీలో అధికారంలోకి వస్తామని నిబ్బరంగా ఎందుకు చెప్పడం లేదు అంటే ఇందులో రాజకీయ లౌక్యమే ఉందని అంటున్నారు.

కూటమిగా పోటీ చేస్తే ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఒక మంత్రి పదవి దక్కాయి. అదే విడిగా పోటీ చేస్తే బీజేపీ రాజకీయ దశగా ఎలా ఉంటుందో అన్న బెంగ ఉంటుంది. కానీ ఇలా ఎన్నాళ్ళు, ఒకరి మీద ఆధారపడి బీజేపీని ఉన్నామనిపించుకుంటూ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ఎన్నాళ్ళు అని కార్యకర్తల నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

నాయకులు గట్టిగా తలచుకోవాలి. పార్టీని అధికారంలోకి తీసుకుని రావాలని భావించాలి. అంతే తప్ప పొత్తులతో కొన్ని సీట్లు తీసుకుని తాము అధికారంలోకి వస్తే చాలు అని భావించినన్నాళ్ళూ ఏపీలో బీజేపీ కధ ఇలాగే ఉంటుందని అంటున్నారు. అందుకే ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తామన్న మాట కూడా బలంగా అనలేకపోతోంది అని విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే మారాల్సింది బీజేపీ నాయకత్వంలోని భావజాలం తప్ప మరేమీ కాదని అంటున్నారు.

16 Replies to “ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పలేరా?”

  1. అది కాదండీ..

    10 సీట్లలో పోటీ చేసి.. 8 సీట్లు గెలుచుకున్నారు..

    వాళ్ళు రియాలిటీ లో ఉన్నారు.. ఏది జరగగలదో అది మాత్రమే చెప్పుకొంటున్నారు..

    ..

    మరి జగన్ రెడ్డి 175 కి పోటీ చేసి.. జస్ట్ 11 గెలిచాడు..

    ఈ తింగరోడు 30 ఏళ్ళు అధికారం అంటుంటే.. వాడికి నిజం చూపించాల్సింది పోయి.. వాడి భజన చేస్తూ బతుకుతున్నావు.. సిగ్గు లేదా..?

    ..

    ఇంకా నయం .. జగన్ రెడ్డి ని చూసి బీజేపీ భయపడిపోతోంది అని రాసుకో..

    1. ఢీల్లీలో బిజెపి గెలుపు ఏపిలో టిడిపి కి షాక్ అని వదిలారు గా..

      రేపు ఢిల్లీలో బిజెపి గెలుపు ఏపి లో వైసిపి కి టానిక్ అని వదులుతారు..

  2. బీజేపీ 2019 లో 175 సీట్లలో పోటీ చేసి గెలిచింది 0

    అదేపార్టీ 2024 లో

    టీడీపీ భలంతో 10 సీట్లలో పోటీ చేసి 8 గెలిచింది

    ఇప్పుడు చెప్పు?? ఒంటరిగా అధికారం లోకి వస్తుందా రాదా??

  3. కూటమి విడిపోతే మాత్రమే అన్నియ్యకు ఏమన్నా అవకాశం అని బాగా ఫిక్స్ అయిపోయారు. వైసీపీ గెలుపుకు ఇలా ఎంత కాలం ఎదుటి పార్టీల మీద ఆధారపడతారు?

  4. ఇక్కడ నర నరాల్లో ,తర తరాలుగా ఎల్లో బ్లడ్ ప్రవహిస్తున్న సైనుకలం….నందమూరి, నారా వారసులం..తెలుగు ప్రజ ల కోసం ఎందాకైనా వెళతాం.. ఎన్ని కష్ట నష్టాల నైనా ఓర్చుకుంటాం..పడినా తిరిగి నిలబడతాం..జనాలు పార్టీ ని నీలబెడుతూ నే వుంటారు…మమ్మల్ని దాటుకుని రావటం అంటే👍

  5. Reasonable thought process- there’s an opportunity for BJP to grow in Andhra. YCP vote share (39.8%) is up for grabs in next election, as the elected MLAs from the party are not interested to fight for the people who voted them. This is good chance for BJP to claim that vote share. They are supporting AP, funding all major projects- they can showcase that they care for AP and fill the void! 🙂

Comments are closed.