ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!

వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో బలం పెంచుకోవడానికి జనసేన చూస్తోంది. టీడీపీతో జట్టు కట్టి బీజేపీని కూడా చేర్చి కూటమిగా 2019లో జనసేన 21 సీట్లకు పోటీ చేసి కొన్ని విజయాలు సాధించింది. అయితే, అధికారంలోకి వచ్చాక సొంతంగా బలపడాలన్న ఆలోచన జనసేనలో ఉంది. జనసేన తన విస్తరణకు ఎక్కడ అవకాశం ఉందో చూసుకుంటూ, ఆ దిశగా మెల్లగా అడుగులు వేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మన్యం ప్రజలు, గిరిజనుల మీద మొదటి నుంచి ప్రత్యేక దృష్టి ఉంది. 2018లో ఆయన ప్రజాపోరాట యాత్ర చేసినప్పుడు ఎక్కువగా మన్యం ప్రాంతాలలోనే పర్యటించారు.

మన్యంలో జనసేనకు ఇతర పార్టీలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో మంచి ఓట్లు వచ్చాయి. 2024లో ఏజెన్సీలోని పాలకొండ సీటును పొత్తు భాగంగా తీసుకుని గెలిచి, మన్యం ప్రాంతంలో తొలిసారి జెండా పాతిన జనసేన, ఇప్పుడు అక్కడ మరింత ఎదగాలన్న కాంక్షతో ఉన్నట్లు కనిపిస్తోంది.

అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏజెన్సీ బాట పట్టారు. పట్టుబట్టి వాన కురుస్తున్నా పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. అల్లూరి జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. గిరిజనులతో మమేకం అయ్యి ధింసా నృత్యం చేస్తూ, తాను వారికి అండగా ఉంటానని మాట ఇచ్చారు.

గిరిసీమలకు రోడ్లు వేస్తామని, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని పవన్ భరోసా ఇచ్చారు. తాను ఇక మీదట ప్రతి రెండు నెలలకు ఒకసారి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి, వారి సమస్యలను తెలుసుకుని పూర్తిగా పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. పవన్ ఆలోచనలు చూస్తే, ఆయనకు ఈ ప్రాంతం మీద మక్కువ మాత్రమే కాకుండా వారిని అక్కున చేర్చుకుని, ఆ దిశగా జనసేన జెండాను మరింత చేరువ చేయాలన్న సంకల్పం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏ మాటకు ఆ మాట చెప్పుకుంటే, మన్యం వాసులు ఎవరినైనా ఆదరిస్తారు. వారి కోసం తపన పడే వారిని గుండెల్లో పెట్టుకుంటారు. ఏజెన్సీలో మొదట కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీకి పట్టు ఉంది. ఇప్పుడు ఈ కొత్త ప్రాంతంలోకి వెళ్లి, జనసేనను పటిష్ఠం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఆయన వరుసగా అక్కడ పర్యటనలు చేస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే, గాజు గ్లాస్‌తో గిరిజనులు కనెక్ట్ కావడం విశేషం కాదని అంటున్నారు. ఒక విధంగా చూస్తే, వైసీపీకి బలమైన ప్రాంతాల మీద జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టిందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

26 Replies to “ఏజెన్సీలో ఎదగాలన్నది పవన్ టార్గెట్!”

  1. కోస్తాలో అయన హిందూ sc లను ఆకర్షించే విధంగా కూడా ప్లాన్ చేస్తే వైసీపీ మూత పడటం జనసేన టీడీపీ ప్రధాన పక్షాలుగా ఉంటాయి

    1. ప్రధాన పక్షం దేవుడెరుగు ముందు సొంతగా పోటీ చేసి నాలుగు సీట్స్ గెలవమను మన ఫిడేలు స్టార్ ని, ఎంతసేపు బాబోరికి బాకా ఊదడమే సరిపోతుంది. బాబోరు ఎవరినీ ఎదగనివ్వడు. తాతగారు బుటుక్కుమంటే పచ్చపార్టీ కుక్కలు చించిన విస్తరే, నెమ్మది నెమ్మదిగా గ్లాసు, సైకిల్, కాషాయం లో కలవడమే జమిలి ఎలక్షన్స్ టైం కి. అప్పుడు నీలిపార్టీ మరియు కాషాయం పార్టీఎ ఉంటాయ్ రాష్ట్రంలో.

        1. Avunu thammudu manam edhaina cheptam, fidel star ki rod thigutundi, ontariga poti chesi nalugu seats gelavalante. eenno sarlu cheppadu C M C M antaru… vote veyyaru pant thadustundi ani. thammudu konda erri P***K ithe ilane untundi.

      1. కొంచమైనా అలోచించి పోస్ట్ పెట్టాలి సర్ టీడీపీ లేకపోతె ఆ ప్లేస్ లోనికి బీజేపీ వస్తే జరిగేది వెంటనే మనోడి ని జైల్లో పారేస్తారు బహుశా బాబాయ్ కేసు లో ముందర వేసేస్తారు తర్వాత అవినీతి కేసులు చెప్పుకింద తేలు లాగా ఉంటే బయట ఉండనిస్తారు సీఎం జీఎం అంటే లోపలేసేస్తారు చంద్రబాబు కాదు వదిలేయడానికి మోడీ రాముడు దెబ్బ ఎలాగుంటదో మారీచుడుకు తెలుసు మోడీ దెబ్బ ఏంటో మనోడుకు తెలుసు మీరు ఎన్నైనా చెపుతారు

      2. Chusi kuda chadavadam rani natti pakodi… Muddi kinda 30 case lu unna Maha nijayithi parudu 11 seats to kuda party run Chesinappudu … 30 years nundi build ina cadre una TDP 21/21 win ina JSP enduku merge chestharra nisani

    2. వీడిని వదిలింది ఆ ప్రాంతాల తవ్వకాలకి క్కడాలు అడ్డుపడకుండా వెన్నపూస కబుర్లు చెప్పడానికేమో..

  2. చదువుకున్న మందలని బురిడీ కొట్టించేండు.. సమస్యలన్నీ అలానే ఉన్నాయి..ఈ గిరిజన ప్రాంతాల అమాయకులని కూడా బోల్తా కొట్టించి పాలకులకు మేలుచేసే ఎత్తే..

  3. అయ్యా గ్యాస్ ఆంధ్ర

    తమరికి మతిమరుపు జబ్బు కూడా ఉందా ? అందుకే మిమ్ములను బుర్ర తక్కువ బాడీ ఎక్కువ అనేది

    2019లో ఎన్ని సీట్లకు పోటీ చేసినా గెలిచింది మాత్రం ఒక్క సిటీ. అది రాపాక వరప్రసాద్ గెలిచింది

    తమరేమో కొన్ని సీట్లు గెలిచిందని రాస్తున్నారు ఇక 2014లో పోటీ చేసింది 21 గెలిచింది 21. బహుశా తమరు పోస్ట్ పెట్టేటప్పుడు కళ్ళు మూసుకొని పోస్ట్ పెడతారేమో. కళ్ళు తెరిచి పోస్టు పెట్టాలనుకుంటాను. ఇక మీరు చెప్పినట్టుగా ఎవరు ఎవరికి టార్గెట్ చేయక్కర్లేదు . మనం చేసే పనులు మంచివి అయితే నలుగురు మన దగ్గరికి వస్తారు.. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత ఉండనే ఉంది .

    కాదు కూడదు అంతా నా ఇష్టం అంటారా పంగనామా లో ఒక్క నామ అమ్మో గతి అవుతుంది.

  4. తొక్కేమ్ కాదు ..శీతాకాలం లో అరకు పాడేరు తదితర ఏజెన్సీ ప్రాంతలు చాలా అందంగా ఉంటాయి.వాటిని చూడటానికి వెళ్ళాడు వీడు.

    చంద్రబాబు బానిసే వీడు ఎప్పుడు

  5. వీడు ఎప్పుడు చంద్రబాబు గాడి బానిసే…పార్టీ లేదు తొక్క లేదు ఏజన్సీఅందాలు చూడటానికి వెళ్లి ఉంటాడు

  6. దానికన్నా మందు గిరి పుత్రుల డాలీ మోతలు నిర్మూలించనే సదుద్దేశం వుంది, అది నీకు కనపడదు. వాళ్ళ బ్రతుకుల్లో ఇసుమంత వెలుగు నింపాలనే తపన వుంది.

Comments are closed.