ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌… ద‌శాబ్దంలో అతిపెద్ద జోక్స్‌!

కాకినాడ జిల్లా పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై నెటిజ‌న్స్ సృజ‌నాత్మ‌క సెటైర్స్ విసురుతున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ సామాజిక వర్గానికి చెందిన యువ‌త ఆయ‌న కామెంట్స్‌ను ఈ ద‌శాబ్దంలోనే అతిపెద్ద జోక్స్‌గా అభివర్ణించ‌డం గ‌మనార్హం. Advertisement…

కాకినాడ జిల్లా పిఠాపురంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కామెంట్స్‌పై నెటిజ‌న్స్ సృజ‌నాత్మ‌క సెటైర్స్ విసురుతున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ సామాజిక వర్గానికి చెందిన యువ‌త ఆయ‌న కామెంట్స్‌ను ఈ ద‌శాబ్దంలోనే అతిపెద్ద జోక్స్‌గా అభివర్ణించ‌డం గ‌మనార్హం.

ఆకుల జ‌య‌క‌ల్యాణి అనే మాజీ జ‌న‌సేన వీర‌మ‌హిళా నాయ‌కురాలు ఇవాళ చేసిన ట్వీట్ ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ నుంచి పిఠాపురాన్ని ర‌క్షించుకోవాల‌ని కూడా ఆమె పిలుపు ఇవ్వ‌డం విశేషం. ఒక‌సారి ఆమె ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.

“తన పార్టీని నడపలేక వేరొక పార్టీకి రెంట్‌కి ఇచ్చి, తన గెలుపు వేరొక పార్టీ వాళ్ల‌ చేతిలో పెట్టి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమి చేసేద్దామని బయలుదేరారో ఈ సారు?? బూత్ స్థాయి కమిటీలు లేని పార్టీ వాళ్లు వచ్చే ఎన్నికలకు ప్రతీ గ్రామంలో పెన్షన్ అందేలా చేస్తాం అని అనడం ఏదైతే ఉందో .. నభూతో నభవిష్యతి! గాడిద పని గాడిద చేయాలి.. గుర్రం పని గుర్రమే చేయాలి అనే సామెత గుర్తొస్తోంది” అని ఆమె ట్వీట్‌తో చిత‌క్కొట్టారు.

అలాగే ఈ ట్వీట్‌కు “Save #Pithapuram from #PawanKalyan “Joke of the decade @PawanKalyan” అనే నినాదాన్ని జ‌త చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాను ఏం మాట్లాడినా ముఖ్యంగా కాపు యువ‌త న‌మ్మి త‌న వెంట న‌డుస్తార‌నే భ్ర‌మ‌లో ఉన్న ప‌వ‌న్‌కు.. జ‌య‌క‌ల్యాణి ట్వీట్ చెంప పెట్టు లాంటిద‌ని చెప్పొచ్చు. బూత్‌స్థాయి క‌మిటీల‌కే దిక్కు లేని జ‌న‌సేన‌, జ‌నాన్ని ఉద్ద‌రిస్తానంటే న‌మ్మేదెలా అనే ప్ర‌శ్న యువ మ‌హిళా నాయ‌కురాలి నుంచి రావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

పవ‌న్‌క‌ల్యాణ్‌పై కాపు యువ‌త‌లో భ్ర‌మ‌లు తొల‌గిపోయాయ‌నేందుకు ఆయ‌న కామెంట్స్‌పై వెల్లువెత్తుతున్న సెటైర్స్ నిద‌ర్శ‌నం. అంతేకాదు, ప‌వ‌న్ నుంచి పిఠాపురాన్ని ర‌క్షించుకోవాల‌నే క్యాంపెయిన్ మొద‌లు కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.