రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతలా బద్నాం చేయాలో అంతలా బద్నాం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పరంగా, తన సొంత మీడియా పరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన పత్రికలో పేజీలకు పేజీల కథనాలు రాసిపడేస్తోంది. బీఆర్ఎస్ ప్రతిపక్షం కదా. సహజంగానే తన చేతిలోని ఆయుధాన్ని ఉపయోగించుకుంటోంది.
ఈ క్రమంలోనే తెలుగు సినిమా పరిశ్రమకు పూర్తిగా మద్దతుగా నిలిచింది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు మద్దతుగానే ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్తో సినీ పరిశ్రమకు మంచి సంబంధాలు ఉన్నాయి. తరచుగా సినిమా ఫంక్షన్లకు అటెండ్ అవుతూ ఉండేవాడు. సినిమా సెలబ్రీటీలతో సరదాగా మాట్లాడేవాడు.
కాని కాంగ్రెసు ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డికి సినిమా పరిశ్రమతో పడటంలేదనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. హీరోలుగాని, సినిమా పరిశ్రమలోని ఇతర రంగాల్లోని ప్రముఖులు కూడా రేవంత్ రెడ్డితో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈ నేపధ్యంలోనే ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమను టార్గెట్ చేసిందని, టాలీవుడ్ తన భవిష్యత్తుపై తీవ్రంగా భయపడుతోందని పెద్ద కథనం రాసింది.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలుగు సినిమా పరిశ్రమను వేధిస్తోందని రాసింది. బీఆర్ఎస్ పాలనలోనే తెలుగు సినిమా పరిశ్రమ బాగుందనేది ఆ కథనం సారాంశం. ఆ కథనం సారంశం ఏమిటంటే…హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చవేసి ప్రభుత్వం సినిమా పరిశ్రమకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. జగన్తో నాగార్జునకు ఉన్న సాన్నిహిత్యం కారణంగానే చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు.
నాగచైతన్య, సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం నాగార్జునకు అండగా నిలిచింది. సినిమా పరిశ్రమ ఐక్యత రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారింది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను వేధించడానికి, అరెస్టు చేయడానికి కారణం సినిమాకు సంబంధించిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమే.
అసలు తొక్కిసలాట జరిగి మహిళ చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఏమీ లేదు. ఇలాంటి ఘటనల్లో సినిమా హీరోను అరెస్టు చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. ఆ తరువాత సినిమా పరిశ్రమతో రేవంత్ రెడ్డికి సెటిల్మెంట్ కుదరడంతో సంధ్య థియేటర్ ఘటన సమసిపోయింది. సంధ్య థియేటర్ ఘటన తరువాత ప్రభుత్వం సినిమా రంగం మీద ఆంక్షలు విధించింది. బెనిఫిట్ షోలకు అనుమతులు రద్దు చేసింది. ఇలాంటిది గతంలో ఎన్నడూ లేదు.
ప్రభుత్వ వైఖరి సినిమా పరిశ్రమకు ఇబ్బందిగా మారింది. పాటల్లో అసభ్య డ్యాన్స్ స్టెప్పులపై మహిళా కమిషన్ తాజా హెచ్చరికను కూడా కథనం ప్రస్తావించింది. ఈ విషయంలో మహిళా కమిషన్కు సంబంధం లేదని, అలాంటి విషయాలు సెన్సార్ బోర్డు చూసుకుంటుందని పేర్కొంది. మహిళా కమిషన్ సినిమా పరిశ్రమకు వార్నింగ్ ఇవ్వడం ఇది తొలిసారని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేదని పేర్కొంది. సినిమా పరిశ్రమను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని, కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని బీఆర్ఎస్ మీడియా స్పష్టం చేసింది.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
vedhava panulu chesina vaalu cinema vaallu aithe vadileyalaa? idekkadi VP argument raa baabo00
అవునా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ జీవితాలు నాశనం చేయడం మన పార్టీ నే కదా