ఎమ్బీయస్‍: టిటిడి డిక్లేర్ చేయవలసిన సంగతులు

ముందుగా జగన్ డిక్లరేషన్ యివ్వాలా? వద్దా అన్నదానిపై నా అభిప్రాయం చెపుతున్నా.

జగన్ తిరుమల గుడికి వెళ్లడానికి ప్రయత్నించి మానుకోవడంపై యీ వ్యాసం. ముందుగా జగన్ డిక్లరేషన్ యివ్వాలా? వద్దా అన్నదానిపై నా అభిప్రాయం చెపుతున్నా. ఎందుకంటే చాలా మంది పాఠకులు యీ ప్రశ్న వేస్తూ నాకు యీమెయిళ్లు రాశారు.

07052014న రాసిన ఆంధ్రలో బలాబలాలు – 4 వ్యాసంలో నేను రాసినదిది ‘…బ్రదర్ అనిల్‌ ద్వారా మతమార్పిళ్లు బాగా చేయించి, క్రైస్తవులను తన ఓటుబ్యాంకుగా వైకాపా చేసుకుంటోందని, ప్రజలు నమ్ముతున్నారు. జగన్‌ తిరుపతి గుడిలో సంతకం పెట్టడానికి తిరస్కరించడం వంటివి దానికి తోడయ్యాయి. ఆయన క్రైస్తవుడని జగానికంతా తెలుసు. అయినా గుడికి వచ్చాడంటే సంతోషమే. అక్కడ సంతకం పెట్టడం నియమం, మర్యాద, ధర్మం. పెట్టనని మొరాయించడం గుడి నియమాల పట్ల నిరాదరణ, హిందువులను బాధించే చర్య…’ అని రాశాను.

230920న రాసిన ‘‘సంతకం పెడతాడా? పెట్టడా?’’ అనే వ్యాసంలో టిడిపి హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన వాదన ‘గతంలో వచ్చినప్పుడు అడగలేదు, యిప్పుడెందుకు అడుగుతున్నారు, తక్కినవారిని అడగలేదు, నన్నే అడిగారు, యిది వివక్షత’ (హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు పట్టుబడిన ప్రతీవాడూ చేసే వాదనే యిది) వంటి విషయాలతో సహా చాలా విషయాలే చర్చించాను.

‘ప్రతిపక్షంలో ఉండగా జగన్ వాదన రాజకీయంగా పనికి వచ్చింది కానీ ధర్మమైనదైతే కాదు. అధికారంలోకి వచ్చాక తిరుపతి దర్శించినపుడూ సంతకం పెట్టకపోవడమూ ధర్మం కాదు. ఇప్పుడు వివాదం వచ్చిన తర్వాతైనా సంతకం పెట్టి, తను నియమాలకు కట్టుబడతానని చూపుకోవాలి. లేకపోతే అది అధర్మమే… ముఖ్యమంత్రి స్థానంలో వుండి నియమాలు ఉల్లంఘించడం క్షమార్హం కాదు. పైగా జగన్ వంటి ముఖ్యమంత్రికి అస్సలు కాదు. ఎందుకంటే నియమాలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడమిది అంటూ రూ. 9 కోట్ల విలువైన ప్రజావేదికను కూల్పించేసిన జగన్ యిప్పుడు నియమాలకు విరుద్ధంగా తనే ప్రవర్తిస్తే ప్రజలకు ఏ రకమైన సందేశం యిచ్చినట్లు? సంతకం పెట్టడం వలన రాజకీయ ప్రతికక్షులకు లొంగినట్లు అని అనుకోకుండా, తనే రిజిస్టర్ అడిగి సంతకం పెట్టడం చేత గతంలో చేసిన పొరపాట్లను సవరించు కున్నట్లవుతుంది.’ అని స్పష్టంగా రాశాను.

‘ఇలాటి నిబంధన జియ్యర్ సంప్రదాయం కాదు, ఎవరో బ్రిటిషు వారు పెట్టినది, వేరే ఏ గుడిలోనూ లేదు.. ’ వంటి వాదనలు అనవసరం. అసలు యీ నియమాలకు, దేవుడి మహిమ, గుడి పవిత్రత లాటి వాటికి సంబంధం లేదు. దక్షిణ తమిళనాడు, కేరళ గుళ్లల్లో మామూలు దర్శనానికి కూడా చొక్కా విప్పి వెళ్లమంటారు. తిరుపతిలో అలాటి నిబంధన లేదు. అంత మాత్రం చేత తిరుపతి గుడి వాటి కంటె తక్కువ పవిత్రమైనది అనగలమా? సంతకం రూలు ఎందుకు పెట్టారో పెట్టారు. ఇప్పుడు తీసేయవచ్చు అనుకుంటే తీసివేయడమే! మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒకప్పుడు హరిజనులను గుళ్లలోకి అనుమతించే వారు కాదు. ఇప్పుడు అనుమతిస్తున్నారు. ఒకప్పుడు వేదాధ్యయనం బ్రాహ్మణకులానికే పరిమితం. ఇప్పుడు అన్ని కులాల వారినీ వేదపాఠశాలల్లో చేర్చుకుంటున్నారు. పివిఆర్‌కె గారి ‘నాహం కర్తా…’ పుస్తకం చదివితే ఆయన హయాంలో గుడి సంప్రదాయాల్లో ఎన్ని మార్పులు తెచ్చారో తెలుస్తుంది. తక్కిన ఈఓల హయాంలో కూడా రకరకాల మార్పులు వచ్చే ఉంటాయి.

అమలులో అసాధ్యమైన యీ డిక్లరేషన్ రూలు విషయంలో కూడా మార్పు రావాలి. కానీ రూలు మార్చేవరకు పాటించక తప్పదు. భక్తుల పాలిట యిది విధాయకం! నియమోల్లంఘన జరకుండా చూడడం గుడి యాజమాన్యం బాధ్యత! ఆ విధిని తను సరిగ్గా నిర్వహిస్తోందా లేదా అన్నది టిటిడి డిక్లేర్ చేయాలి. ఎందుకంటే వాళ్లు ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ప్రవర్తిస్తున్నట్లు కనబడుతోంది. ఒకే వ్యక్తి విషయంలోనే ఒక్కోప్పుడు ఒక్కోలా ప్రవర్తిస్తున్నట్లు కనబడుతోంది. జగన్ విషయమే తీసుకుందాం. టిడిపి హయాంలో ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినపుడు అతని ముందు రిజిస్టర్ పెట్టి సంతకం పెట్టమని అడిగారు. ‘ఇప్పటిదాకా అనేకసార్లు వచ్చాను, మా నాయన కూడా వచ్చాడు. అప్పుడెప్పుడూ అడగనిది, వేరెవరినీ అడగనిది నన్ను మాత్రమే ఎందుకడుగుతున్నారు?’ అని జగన్ అడిగాడు. దానికి టిటిడి వద్ద సమాధానం ఉందా?

వైయస్ ముఖ్యమంత్రిగా వచ్చినపుడు అడిగినట్లు టిటిడి వద్ద రికార్డు ఉందా? ఆయనతో బాటు వచ్చిన కుటుంబ సభ్యులను అడిగినట్లు రికార్డు ఉందా? కలాంగారు పెద్దమనిషి కాబట్టి రిజిస్టరు కోసం అడిగి పెట్టి ఉంటాడు. సోనియా గాంధీ వచ్చినపుడు సంతకం పెట్టిందని కొందరంటున్నారు, ‘..పెట్టలేదు, నేను పక్కనే ఉన్నాను.’ అంటాడు కరుణాకర రెడ్డి. ఓసారి పెట్టి, మరోసారి పెట్టలేదని అనుకోవాలా? ఏ విషయం టిటిడి చెప్తే బాగుంటుంది. శ్రీలంక ప్రధానమంత్రులు, అధ్యక్షులు వస్తూ ఉంటారు. వారు బౌద్ధులో, క్రైస్తవులో అయి వుంటారు. వారి దగ్గర తీసుకుంటున్నారా? జైనులు కూడా వస్తూంటారు. వారి వద్ద..? ఈ మధ్య ఒకాయన రాశాడు. ‘నేను తలపాగా పెట్టుకునే శిఖ్కుని. నన్నెవరూ ఆపలేదు, డిక్లరేషన్ గురించి అడగలేదు.’ అని. అలా ఎలా జరిగింది? శిఖ్కుల్లో పురుషులైతే తలపాగ ఉంటుంది కాబట్టి గుర్తించవచ్చు. స్త్రీల విషయంలో ఎలా తెలుస్తుంది?

‘డిక్లరేషన్ ఫార్మ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుమ్మం దగ్గర ఉంటుంది, దాన్ని 17వ ఛాంబర్ వద్ద సబ్మిట్ చేయాలి, అక్కడే ఉన్న రిజిస్టర్లో సంతకం పెట్టాలి’ అని చెప్తున్నారు. సర్వదర్శనం వాళ్లు వైకుంఠం వైపు రారు కదా. మరి ఆ క్యూలో వచ్చిన అన్యమతస్తుల మాటేమిటి? వారిని మీరు ఎలా చెక్ చేస్తున్నారు? ప్రతీ వాళ్ల బర్త్ సర్టిఫికెట్టు చూస్తున్నారా? పుట్టిన తర్వాత మతం మార్చుకున్న వారి సంగతేమిటి? లేటెస్టు సర్టిఫికెట్టు ఏమైనా తెచ్చుకోమంటారా? అన్యమతస్తుల్లో ప్రముఖులైతేనే మనందరికీ వారు ఫలానా అని తెలుస్తుంది. లేకపోతే లిటరల్లీ గుంపులో గోవిందాయే కదా! మరి నియమోల్లంఘన జరుగుతున్నట్లే కదా!

ప్రముఖులు వచ్చినపుడు వారిని వైకుంఠం క్యూ కాంప్లెక్సు, 17వ ఛాంబర్ ద్వారా నడిపించుకుని తీసుకుని వెళ్లరు కదా! మహాద్వారం వద్దే పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతారు కదా! రిజిస్టర్ అక్కడకి తెస్తారా? ఆహ్వానం ఆహ్వానమే, సంతకం సంతకమే అని నిర్మొగమాటంగా చెప్తారా? రతన్ టాటా వంటి వారు వస్తారు. తిరుమలలో గెస్ట్ హౌస్‌లు కట్టడానికి విరాళమిస్తారు. ఆయన పార్శీ, అనగా హైందవేతరుడు అని అందరికీ తెలుసు. ఆయన దర్శనానికి వచ్చినపుడు ఆయన చేత సంతకాలు పెట్టించారా? ఎవిఎం సంస్థ నిర్మాతల్లో ఒకరైన మురుగన్ ఓసారి చెప్పారు ‘హిందీ యాక్టరు మెహమూద్ వీళ్లు తీసిన ‘మై సుందర్ హూఁ’’ (సర్వర్ సుందరం హిందీ రీమేక్) సినిమా హిట్ కావాలని ప్రార్థిస్తూ తిరుమలకు కాలి నడకన వెళ్లి దర్శనం చేసుకున్నాట్ట.

ఆంధ్రజ్యోతి డైలీలో ప్రతి ఆదివారం ఇందిరా ధనరాజ్‌గిర్ కాలమ్ రాస్తున్నారు. ఈ మధ్యే రాశారు, నిజాం కోడలు, టర్కిష్ జాతీయురాలు ఐన ఒకావిడ తిరుమల వెళ్లి దర్శనం చేసుకున్నారట. వీళ్లందరికీ ‘సంతకం పెట్టందే లోపలికి రావడానికి వీల్లేదు. ఠాఠ్’ అని టిటిడి చెప్పిందా? ఎనలిస్టు పురుషోత్తమ రెడ్డి చెప్పారు – ‘జమ్మూ కశ్మీర్ ఎసెంబ్లీలో సిపిఎం ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామీని తను వెంట పెట్టుకుని వెళితే దారిలో ఎవరూ ‘సంతకం పెట్టావా?’ అని అడగనేలేదని. జర్నలిస్టు వైయన్నార్ అన్నారు, తనతో బాటు యిద్దరు ముస్లిము మిత్రులు వచ్చారని, ఎవరూ వారిని ఏమీ అడగలేదని. ఈ మధ్యే ఒక గృహిణి జ్ఞాపకాలు చదివాను.

తమతో పాటు ఒక ముస్లిం కుటుంబం కూడా మొక్కు పెట్టుకుని తిరుమల మెట్లెక్కి స్వామి దర్శనం చేసుకున్నారని! ఇక క్రైస్తవుల విషయంలో ఐతే కనుక్కోడం మరీ కష్టం. చాలామంది కన్వర్టెడ్ క్రిస్టియన్ల విషయంలో వారికే ఆ విషయంలో స్పష్టత ఉండదు. వాళ్లు హిందూ మతాచారాలు, క్రైస్తవ మతాచారాలు రెండూ పాటిస్తూ ఉంటారు. గుడికీ వెళతారు, చర్చికీ వెళతారు. రెండిందాలా లాభాలు పొందడానికి అని యితరులు అనుకోవచ్చు కానీ మానసికంగా కూడా ద్వైధీభావం ఉందని నేను గ్రహించాను.

వీళ్లందరినీ చెక్ చేస్తున్నారా? రోజుకి 60-70 వేల మంది భక్తులు వస్తూ ఉంటే వీళ్లందరినీ చెక్ చేయడం మా తరమా? అంటే పోనీ రాండమ్ చెకింగ్ ఐనా చేస్తున్నారా? చెకింగ్ చేయం, వచ్చినవారే వారంతట వారు బాధ్యతగా ఫీలై డిక్లరేషన్ ఫార్మ్, రిజిస్టర్ అడిగి సంతకాలు పెట్టాలి అంటారా, ఆ మాట మీద ఉండాలి. మరి టిడిపి హయాంలో జగన్ వచ్చినపుడు సంతకం పెట్టండి అంటూ ఎందుకు వెంటపడ్డారు? రోమ్‌లోని వాటికన్‌కి వెళ్లినపుడు అక్కడంతా చూడనిచ్చారు, తిరగనిచ్చారు కానీ ఒక మూలనున్న ప్రార్థనాస్థలానికి కేథలిక్ అయితేనే వెళ్లి కూర్చోవచ్చని చెప్పారు. నేను కేథలిక్కో కాదో వాళ్లు పరీక్షించలేదు. పరీక్షించలేరు కూడా. అందువలన ఆ విచక్షణను నాకే వదిలేశారు. టిటిడి జగన్ విషయంలో కూడా అలాగే వదిలేసి ఉండవచ్చుగా. కానీ సంతకం పెట్టండి అని అడిగారు. తక్కిన వారి విషయంలో కూడా యిలాగే చేస్తున్నారా అనేది వాళ్లు క్లారిఫై చేయాలి.

జగన్ క్రైస్తవుడని అందరికీ తెలుసు కాబట్టి అడిగాం అంటే, అతను ఎప్పుడు వచ్చినా ఆడగాలి. అధికారంలో ఉండగా వస్తే అడగం, ప్రధానితో పాటు వస్తే అడగం, చీఫ్ జస్టిస్‌తో పాటు వస్తే అడగం అంటే పొసుగుతుందా? మా ఆహ్వానం మీద వచ్చారు కాబట్టి, అడగకూడదని మానేశాం అని చెప్పగలరా? కొన్ని షాపులు బయట కుర్రాణ్ని పెట్టి దారిన పోతున్న వాళ్లని రారమ్మనమని ఆహ్వానిస్తాయి. అయినా లోపలకి వచ్చేటప్పుడు చెప్పులిప్పి రమ్మంటారు. ఇంటికి భోజనానికి పిలిచినా, అతిథులను షూ విప్పేసి యింట్లోకి రమ్మనమంటాం. ఆహ్వానంపై వచ్చినా పద్ధతి పద్ధతే అంటాం. ఆ మాత్రం యింగితం టిటిడికి లేదా? అధికారం చేజిక్కినంత మాత్రాన జగన్ మతం మారిపోతుందా?

జగన్ 2009లో సంతకం పెట్టాడని ఎల్వీ సుబ్రహ్మణ్యం, జర్నలిస్టు కృష్ణంరాజు చెప్పారు. దేవుడిపై నమ్మకం ఉందని రాతపూర్వకంగా ఒకసారి యిచ్చిన తర్వాత పదేపదే చెప్పవలసిన అవసరం ఉందా? దీనిపై టిటిడి ఒక స్టాండ్ తీసుకోవాలి. జగన్ సంతకం పెట్టి ఉంటే ఆ డాక్యుమెంటు టిటిడి బయట పెట్టాలి. ఒకసారి పెట్టాక మళ్లీ పెట్టాల్సిన అవసరం ఏముంది? అని టిటిడిని, ఒకసారి పెట్టాక మళ్లీ పెట్టడానికి ఏమిటి అభ్యంతరం? అని జగన్‌ను ఏకకాలంలో అడగాలి. జగన్ బాధంతా ఏమిటంటే తన ఒక్కడి గురించే యింత రగడ ఎందుకు చేస్తున్నారని! ‘నమ్మకం లేకపోతే అక్కడిదాకా కష్టపడి రాడు కదా. పాదయాత్ర తర్వాత కాలినడకన ఎక్కి రాడు కదా! ఎవరైనా ఫారినర్ హిందూమతం తీసుకుంటే ఎగిరి గంతేస్తూ ఉంటాం, క్రైస్తవుడైన జగన్ హిందూ దేవుడికి మొక్కుతూ ఉంటే సంతోషించి ఊరుకోకుండా యింత యాగీ ఎందుకు?’ అని సామాన్యుడు అనుకునే స్థితి వచ్చింది.

ముఖ్యంగా యీ దఫా టిడిపి, బిజెపి చేసిన హంగామా అతనిలో ఆ ఫీలింగుని మరింత పెంచింది. లడ్డూలో కల్తీ నేతి వివాదాన్ని లేవనెత్తి టిడిపి, జనసేన వైసిపి హయాంలో అపచారం జరిగిపోయిందని ప్రచారం మొదలు పెట్టి జగన్‌ను దోషిగా నిలబెట్టడంతో జగన్ తన వాదనను వినిపిస్తూనే, వైసిపి నాయకుల చేత రాష్ట్రమంతా గుళ్లలో పూజలు చేయిస్తూ, తను తిరుమలక వెళతానన్నాడు. అంతే, వెళితే డిక్లరేషన్‌పై సంతకం పెడతాడా లేదాన్న చర్చ మొదలు పెట్టారు. సంతకం పెడతాను, లేక పెట్టను అని జగన్ ఏమీ అనలేదు. ప్రభుత్వం అతనికి లేఖ రాసి, పెడతావా లేదా అని అడగనే లేదు. కానీ గతానుభవాల దృష్ట్యా ‘పెట్టడు’ అని తీర్మానించుకుని టిడిపి, జనసేన, బిజెపి నాయకులు యాగీ చేయసాగారు. పార్టీల వరకు అది ఓకే, కానీ ప్రభుత్వపరంగా వారు ఒక ప్రొసీజర్ పాటిస్తూ, ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలి.

జగన్‌ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నాం అంటూ వైసిపి నాయకులకు లేఖలు పంపిన ప్రభుత్వం తమాషాగా మీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తున్నాం అని జగన్‌కు నోటీసు యివ్వలేదు, లేఖ రాయలేదు. నువ్వు అక్కడకు వెళ్లడం నిషిద్ధం అని ఆర్డరు జారీ చేయలేదు. ఇది అతి ఫన్నీగా ఉంది. జగన్ వస్తే అలిపిరి వద్దే అడ్డుకుంటాం అంటూ బిజెపి వారు రెచ్చిపోయి ప్రకటనలు చేశారు. అలిపిరి వద్ద ఎందుకు అడ్డుకోవాలి? అడ్డుకుంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గేటు దగ్గర డిక్లరేషన్ ఫార్మ్ తీసుకోకుండా లోపలకి పోబోతే అప్పుడు అడ్డుకోవాలి. అలిపిరి దగ్గర అడ్డుకునే హక్కు వాళ్లకేముంది? అయినా యిప్పుడే అడ్డుకోవడమేమిటి? ఏ ఏడాదీ డిక్లరేషన్ యివ్వకుండా ఐదేళ్లపాటు బ్రహ్మోత్సవాల్లో వస్త్రాలు సమర్పించినప్పుడే అడ్డుకోలేదేం?

మొదటి ఏడాది ‘ఇస్తాడేమోలే’ అనుకుని వదిలేసినా, తర్వాత ఏడాది నుంచి అడ్డుకునే ప్రయత్నం చేసి ఉండాల్సింది. అప్పుడంతా ఊరుకుని, యిప్పుడు మాత్రం ప్రదర్శనలు చేస్తామంటున్నారంటే అర్థం ఏమిటి? అధికారంలో ఉంటేనే యీ హిందూ ధర్మపరిరక్షణ అవీ గుర్తుకు వస్తాయి. ప్రతిపక్షంలో ఉంటే ‘హిందూ ధర్మం తననే తానే రక్షించుకోవాలి’ అనుకుంటూ ఎలకల్లా కలుగుల్లో దూరతారు. దీన్ని బట్టే మతం పట్ల, రేదర్ గుడి నియమపాలన పట్ల వాళ్ల కమిట్‌మెంట్ తెలుస్తోంది. బిజెపి వాళ్లు కనీసం మోదీతో చెప్పయినా, తోడుగా వచ్చిన జగన్ చేత సంతకం పెట్టించి ఉండాల్సింది. అప్పుడేమీ చేయకుండా యిప్పుడు జగన్ ‘డౌన్ అండ్ ఔట్’ పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రతాపం చూపిస్తున్నారు. కోపం తెచ్చుకోవాలో, జాలి పడాలో తెలియని పరిస్థితి.

తిరుపతికి వచ్చి అడ్డుకుంటామని రంకెలు వేస్తున్నవారికి ప్రభుత్వం ఏ నోటీసులూ పంపలేదు. జగన్ వెళతాడో లేదో, వెళ్లినా సంతకం పెడతాడో లేదో తెలియని సందిగ్ధం ఉండగానే వైసిపి నాయకులకు మాత్రం నోటీసులు పంపింది. అక్కడే డూప్లిసిటీ బయటపడింది. శనివారం నాడు తిరుపతి రణరంగం అవుతుందా అని భయపడుతూ ఉంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్లటం లేదని ప్రకటించి ‘హమ్మయ్య’ అనిపించాడు. ఇలా తగ్గడం పరువు తక్కువ పని, ఫైట్ చేయాలని ఎవరైనా సలహా చెప్తే విని, పంతానికి పోయి క్రైసిస్ కొని తెస్తాడేమో అని ప్రజలు ఉగ్గబట్టుకుని చూస్తూండగా ‘వెళ్లటం లేదు’ అని ప్రకటించి, శాంతిభద్రతల సమస్య రాకుండా చేశాడు. తన మతం గురించి, విశ్వాసాల గురించి, యితర మతాల పట్ల గౌరవం గురించి – అందరికీ తెలిసినదే – స్పష్టంగా ప్రకటించాడు.

జగన్ అలా వెనక్కి తగ్గడంతో కూటమి పక్షాలకు దీన్ని విజయంగా భావించి సెలబ్రేట్ చేసుకోవాలో లేదో తెలియకుండా పోయింది. టివి5 ‘తనను తాను హిందువుగా చెప్పుకోలేక పోయిన జగన్’ అంటూ స్క్రోలింగ్ యిచ్చి సంతోషపడింది. అది చూసి నాకు నవ్వు వచ్చింది. చెప్పుకోవలసిన అవసరం ఏముందతనికి? అతను క్రైస్తవుడని తెలిసే జనాలు ఓట్లేస్తున్నారు. ఎవరో కొందరికి తప్ప ముఖ్యమంత్రి మతం ఏమిటని, కులం ఏమిటనే పట్టింపు వుండదు. పట్టింపు వున్నవాళ్లు ఏమీ చేయలేరు కూడా. మెజారిటీ ప్రజలు ఎలా ఫీలవుతే అదే జరుగుతుంది. ఇప్పుడు గోల చేసి, జగన్‌ను తిరుమలకు రానీయకుండా చేసి, సాధించిన దేమిటో కూటమి పార్టీలకే తెలియాలి. పగబట్టి ఒక్క జగన్ మీద మాత్రమే ఫోకస్ పెట్టడం ఎందుకు అని ప్రజలకు అనిపించిందంటే నెగెటివిటీ తెచ్చుకున్నట్లే కదా! ఎందుకంటే జగన్ వస్తున్నాడంటే టిటిడి అర్జంటుగా గుడి చుట్టూ డిక్లరేషన్ గురించిన బోర్డులు పెట్టేసింది (ఫోటో చూడండి). రావటం లేదు అని తెలియగానే బోర్డులు తీసేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

జగన్ పట్ల అయ్యోపాపం అనే జాలి కలిగిందంటే కూటమికి నష్టం కూడా! ఎంతో మంది అన్యమతస్తులు తిరుమలకు వస్తున్నారని అందరికీ తెలుసు. టిటిడి అందరికీ ఒకే రీతిగా నియమాలు పాటించటం లేదని తెలుసు. వంగలపూడి అనిత తను క్రిస్టియన్ అని చెప్పుకున్న వీడియో బయటకు వచ్చింది. బైబిల్ చదువుతాను అంటే అభ్యంతరమేమీ ఉండదు. కానీ క్రిస్టియన్ అనే చెప్పుకుందావిడ. ఆవిణ్ని టిటిడి బోర్డు మెంబరుగా వేసినప్పుడు అభ్యంతరాలు కూడా వచ్చాయి. ఇప్పుడావిడ మంత్రి అయ్యాక తిరుమల వెళ్లి సంతకం పెట్టకుండా దర్శనం చేసుకుని వచ్చింది. దీనిపై టిటిడి వివరణ ఏమిటి? ఇకపై ప్రతీ వారినీ యిలా భూతద్దంలో వేసి చూస్తూ యిదే పెద్ద ప్రజాసమస్యగా మారుస్తారేమో!

తన స్టాండ్ వివరిస్తూనే జగన్ రాజకీయంగా లబ్ధి పొందుదామని చూశాడు. ‘మాజీ ముఖ్యమంత్రిని నన్నే రానీయకపోతే (సంతకం పెడితే తప్ప రానివ్వమన్నారు, జగన్ కావాలని పూర్వార్థాన్ని ఎగరగొట్టాడు) యిక దళితుల గతేమిటి?’ అన్నాడు. మధ్యలో దళితులు ఎక్కణ్నుంచి వచ్చారు? ఏ సంతకమూ లేకుండా వారికి ప్రవేశం ఎలాగూ ఉంది. క్రైస్తవ దళితుల నుద్దేశించి జగన్ అన్నాడా? వాళ్లూ డిక్లరేషన్ యిస్తే సరిపోతుందిగా! జగన్‌లా పంతానికి పోకుండా ఉంటే ఎవరికీ చిక్కు లేదు. జగన్ కాకుండా సాక్షాత్తూ పోప్ వచ్చినా ఏ సంతకమూ అడక్కుండా పూర్ణకుంభంతో ఆహ్వానించేట్లా ఉంది టిటిడి తీరు! తన బాధను దళితుల బాధగా జగన్ చిత్రీకరించబోవడం తప్పు.

తిరిగి డిక్లరేషన్ విషయానికి వస్తే, టిటిడి యిప్పటిదాకా మేన్‌టేన్ చేసిన రికార్డులను బహిర్గతం చేయాలి. ఇది ఆచరణసాధ్యం కాని రూలని అనిపిస్తే ఆ విషయం స్పష్టంగా చాటి, దాన్ని ఎత్తేయాలి, ‘ట్రెస్‌పాసర్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్’ అనే బోర్డులా ‘ఇఫ్ యూ క్రాస్ దిస్ పాయింట్ యూ ఆర్ డీమ్డ్ టు హేవ్ బిలీఫ్ యిన్ దిస్ గాడ్’ అని బోర్డు పెట్టేయాలి. ఆహార్యం విషయం బయటకు తెలుస్తుంది కానీ విశ్వాసమనేది స్కానింగ్ చేసినా కనబడేది కాదు. వచ్చినవాడు నాస్తికుడై వుండవచ్చు, ఆస్తికుడే అయినా వెంకటేశ్వరుడి గురించి తెలిసి వుండకపోవచ్చు, ఏదో దేవుడట, చూద్దాం (మనం ఉత్తరభారతం వెళ్లినపుడు అలాటి గుళ్లకు చాలా వెళతాం) అని వచ్చి వుండవచ్చు, నమ్మకం యింకా కుదిరి వుండకపోవచ్చు, గతంలో పెట్టుకున్న మొక్కులు తీరక నమ్మకం సడలి వుండవచ్చు, శిల్పాలేమైనా వున్నాయేమో చూదామనే కుతూహలంతో వచ్చి వుండవచ్చు, తనకు ఆసక్తి లేకపోయినా వృద్ధ మాతాపితరులను తీసుకుని వచ్చి వుండవచ్చు, భార్య పోరు పడలేక తోడుగా వచ్చి వుండవచ్చు. ఎలా వచ్చినా, గుడి నిబంధనలు లోబడి ఉంటాడు కాబట్టి ఏ చిక్కూ లేదు.

ఎమ్బీయస్ ప్రసాద్

127 Replies to “ఎమ్బీయస్‍: టిటిడి డిక్లేర్ చేయవలసిన సంగతులు”

    1. ధర్మో రక్షితి రక్షతః – కరక్టుగా రాయాలంటే ధర్మో రక్షతి (రక్షిస్తుంది) రక్షితః (రక్షింపబడిన) – ఒక ఆర్డరులో రాయాలంటే రక్షింపబడిన ధర్మం (లోకాన్ని) రక్షిస్తుంది

  1. ప్రసాద్ గారు నాకో సందేహం రామాయణం లో కానీ భాగవతం లో కానీ ఎక్కడ అయినా only కొంత మంది మాత్రమే గుడిలోకి ప్రవేశించకూడదు అని రాసి ఉందా? ఎక్కడ అయినా?

    అసలు ఈ rule ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు ?

    1. ఒంటె బిడ్డలు, గొర్రె బిడ్డలు మత మార్పిడి ప్రయత్నాల్లో వచ్చి అపవిత్రం చేస్తారు ఏమో అని పెట్టారు ఏమో!

      గొర్రె బిడ్డలు హిండువుల ఇళ్ళకి మొదట ఫ్రెండ్ అనే పేరుతో వచ్చి మెల్లగా మత ప్రచారం మొదలు పెడతారు.

      ఒంటె బిడ్డలు ప్రజలు తినే వాటి మీద అల్లా పేరుతో వుమ్మి పూసి ఇస్తారు.

    2. ఇవేమీ పురాణాల్లో ఉండవండి. తెల్ల లుంగీతోనే గుడిలోకి వెళ్లాలని, చొక్కా విప్పి వేయాలని, సంతకాలు పెట్టాలనీ ఏ దేవుడూ వచ్చి చెప్పడు. గుడి యాజమాన్యమే యిలాటివి పెడుతుంది. కాలానుగుణంగా మారుస్తుంది కూడా. శబరిమల గుడి వివాదం వ్యాసాల్లో ఒక వయసులో ఉన్న మహిళలు రాకూడదన్న రూలు ఒకప్పుడు లేదని, తర్వాతి రోజుల్లో వచ్చిందని కూడా రాశాను చూడండి.

      1. Christians హిందూ ప్రసాదం లో ఒక్క మెతుకు కూడా తినరు, ఇక ఇస్లాం లో ఉన్న దారుణమైన నియమాలు కోసం ఎవరూ మాట్లాడరు , రైటర్ గారు and రెడ్డి గారు మీరు ఎప్పుడు హిందూ మతం పైనే వి

        ఏడుస్తారు మిగతా వాటి ని కోసం కూడా చెప్పండి

      2. అయ్యప్ప సినిమాలో సాక్షాత్తు అయ్యప్పే వచ్చి చెప్పాడుకదా ? ఆ సినిమా పురాణాలలో, ఇతిహాసములలో , ఉపనిషత్తులలో ఉన్నది క్రోడీకరించి చెప్పారు

        1. భేష్, సినిమాల ఆధారంగా మీరు అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారా? కన్యాకుమారి గుళ్లో ‘పాంటు మీద లుంగీ కట్టుకుని వెళ్లకపోతే గుడిలోకి రానీయరు. మా దగ్గర లుంగీ అద్దెకి తీసుకోండి.’ అని గుమ్మం దగ్గర వ్యాపారం చేసే వాళ్ల గురించి ఏ సినిమాలో ఏ దేవుడు చెప్పాడు?

          1. ఎక్కడో కన్యాకుమారి దాకా ఎందుకు మన తిరుమల తిరుపతి గుళ్లోనే నెయ్యి కల్తీ జరిగింది అని ప్రఖ్యాత ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయ్ కదా

    3. Christians హిందూ ప్రసాదం లో ఒక్క మెతుకు కూడా తినరు, ఇక ఇస్లాం లో ఉన్న దారుణమైన నియమాలు కోసం ఎవరూ మాట్లాడరు , రైటర్ గారు and రెడ్డి గారు మీరు ఎప్పుడు హిందూ మతం పైనే వి

      ఏడుస్తారు మిగతా వాటి ని కోసం కూడా చెప్పండి

    4. ఇదే ప్రశ్న వేరే మతం వారి యొక్క ప్రవేశం కొన్ని ప్రత్యేక ప్రార్థన ప్రాంతాల్లో నిషిద్ధం చేసిన వాటికన్ కాథలిక్ చర్చ్, మక్కా మసీదు వారిని కూడా అడుగుతూ బైబుల్, ఖురాన్ లో నిబంధన ప్రూఫ్ చూపించమని అడిగే మనస్సు వుందా? హిందూ దేముడు కంటే జగన్ ఎక్కవ అయ్యాడా తమకి? నిజంగా అసలు సిసలు హిందువెన తమరు, లేక క్రైస్తవ మతం లోకి మారి ఇంకా హిందువుగా నటిస్తునారా?

      1. నేను చర్చి కి వెళ్ల లేదు మసీది కి వెళ్ళా లేదు.. నాకు ఆ అవసరం రా లేదు..

        సతీ సహగమనం బాల్య వివాహాలు ఇలా చాలా ఎత్తేసం.. ఉందో లేదో తెలుసుకోవడం లో తప్పు లేదు కద

  2. బాబు/టీడీపీ నీ సుత్తితో కొట్టి, జగన్/వైసిపి నీ మెత్తతో కొట్టి చివరికి మా జగన్ బాబు మంచోడే అని ముగించారు

  3. మీరు-మీరేనా లేక-మీ-కలాన్ని-రేటు-కట్టి @ఎంకటి(Mr. లెవెన్స)-కి-ఇచ్చేశారా

    1. దేవుడు డిక్లరేషన్ యివ్వాలనలేదు స్వామీ! దేవుడి పేరు మీద గుడిని మేన్‌టేన్ చేస్తున్న టిటిడి యివ్వాలంటున్నాను. అది రూల్సు అందరికీ ఒకేలా అమలు చేయటం లేదు కాబట్టి! పక్షపాతం చూపిస్తోంది కాబట్టి!

      1. టిటిడి డిక్లరేషన్ ఇమ్మనటం కాదు స్వామి , చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. ఇతర మతస్తులకు ప్రవేశం లేని సాంప్రదాయం అక్కడ కొన్ని శతాబ్దాలుగా ఉంది . మన్రో గంగాళం తిరుపతికి బహుమతిగా ఇచ్చిన సర్ థామస్ మన్రో లాంటి వాళ్ళు కూడా అలంటి రూల్స్ కి గౌరవం ఇచ్చి తిరుమల కి వెళ్ళలేదు. సామాన్య ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వట్లేదు కనుక అక్కడ ఉన్న సాంప్రదాయం తీసెయ్యాలనటం డొల్ల వాదన. క్రిస్టియన్ వస్తే సంతోషమే , ఆయన రాజకీయం చేయడం కోసం వస్తే ఎవరు ఒప్పురు. సానుభూతి వస్తుంది అని మీరు చేసిన వాదనకి ప్రతివాదన ఉంటుంది.

        చాలా సాంప్రదాయాలు నాశనం చేసి పీవీఆర్కే ప్రసాద్ చేసింది ఏమిటి? ఒకప్పుడు మిరాశీ వ్యవస్థ ఉన్నప్పుడు ప్రసాదాన్నీ మిరాసిలు చేసినప్పుడు ఉన్న టేస్ట్ ఇప్పుడు ఉందా ? ఒకప్పుడు పెద్ద కళ్యాణం చేసినప్పటి తృప్తి ఇప్పుడు ఉందా? తిరునామం తగ్గిద్దామని చూసిన పీవీఆర్కే కి ఏమైంది ?

      2. క్రిస్టియన్స్ అయిన బ్రిటిష్ వాళ్ళు పెట్టిన డిక్లరేషన్ రూల్ ఇంకో క్రిస్టియన్ అయిన జగన్ రెడ్డి పాటించక పోవటం ఎంతవరకు న్యాయం ?

  4. Celebretilu లేక విదేశీ రాజకీయా నాయకులూ వాళ్ళ ఇష్టం తో తిరుమల వస్తారా లేక టీటీడీ ఆహ్వానం పంపిస్తోందా ? దేవుడు సవర్గానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడా ? ఒక వేళ జగన్ ముందు డిక్లరేషన్ ఇచ్చి ఉంటే అది చెప్పవచ్చు కదా? గుడికి వచ్చేవాళ్ళు పద్దతి తెలిసిన తరువాత తప్పు చేస్తే సరిచేసుకోవచ్చు అది సామాన్యుల విషయం లో . మరి చదువుకొని అడుగుతున్నపుడు ఇవ్వడానికి ఏమిటి ఇబ్బంది. తిరుమల గుడి సెట్టింగ్ వేసినప్పుడు అపహాస్యం చేసియున్నాను అనిపించలేదా ? తిరుమల దేవుడు మీద నమ్మకం లేదు అని కాదు అర్ధం ? ప్రజలు ఎన్నుకోలేదు కాబట్టి రేపు సొంత అసెంబ్లీ పెట్టుకొంటారా ? గవర్నమెంట్ గుడులని ఆదాయం బట్టి అధీనం లో తెచుకున్నప్పుడు గుడి లో కి ఎవరు రావాలి అని నిర్ధారించవలసినది ఎవరు ? ముఖ్యమంత్రి గా చైర్మన్ బోర్డు ఎంపిక ని చేసినప్పుడు లేని భాద్యత ఎవరు గుడిలోకి వస్తారు వాళ్ళ మతం ఎమి? వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా చూడవలిసినది ఎవరు ? గుడి కి వచ్చే ఆదాయం ని ఎలా వినియోగించాలి అని డిసైడ్ చేసేవాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో తప్పులకి భాద్యత ఉండాలి కదా ? చాల మంది వస్తున్నారు కాబట్టి నన్ను అడగకూడదు అంటే ఎలాగా ?

  5. Celebretilu లేక విదేశీ రాజకీయా నాయకులూ వాళ్ళ ఇష్టం తో తిరుమల వస్తారా లేక టీటీడీ ఆహ్వానం పంపిస్తోందా ? దేవుడు సవర్గానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడా ? ఒక వేళ జగన్ ముందు డిక్లరేషన్ ఇచ్చి ఉంటే అది చెప్పవచ్చు కదా? గుడికి వచ్చేవాళ్ళు పద్దతి తెలిసిన తరువాత తప్పు చేస్తే సరిచేసుకోవచ్చు అది సామాన్యుల విషయం లో . మరి చదువుకొని అడుగుతున్నపుడు ఇవ్వడానికి ఏమిటి ఇబ్బంది. తిరుమల గుడి సెట్టింగ్ వేసినప్పుడు అపహాస్యం చేసియున్నాను అనిపించలేదా ? తిరుమల దేవుడు మీద నమ్మకం లేదు అని కాదు అర్ధం ? ప్రజలు ఎన్నుకోలేదు కాబట్టి రేపు సొంత అసెంబ్లీ పెట్టుకొంటారా ? గవర్నమెంట్ గుడులని ఆదాయం బట్టి అధీనం లో తెచుకున్నప్పుడు గుడి లో కి ఎవరు రావాలి అని నిర్ధారించవలసినది ఎవరు ? ముఖ్యమంత్రి గా చైర్మన్ బోర్డు ఎంపిక ని చేసినప్పుడు లేని భాద్యత ఎవరు గుడిలోకి వస్తారు వాళ్ళ మతం ఎమి? వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా చూడవలిసినది ఎవరు ? గుడి కి వచ్చే ఆదాయం ని ఎలా వినియోగించాలి అని డిసైడ్ చేసేవాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో తప్పులకి భాద్యత ఉండాలి కదా ? చాల మంది వస్తున్నారు కాబట్టి నన్ను అడగకూడదు అంటే ఎలాగా ?

  6. దేవుడు సవర్గానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడా ? ఒక వేళ జగన్ ముందు డిక్లరేషన్ ఇచ్చి ఉంటే అది చెప్పవచ్చు కదా? గుడికి వచ్చేవాళ్ళు పద్దతి తెలిసిన తరువాత తప్పు చేస్తే సరిచేసుకోవచ్చు అది సామాన్యుల విషయం లో . తిరుమల గుడి సెట్టింగ్ వేసినప్పుడు అపహాస్యం చేసియున్నాను అనిపించలేదా ? తిరుమల దేవుడు మీద నమ్మకం లేదు అని కాదు అర్ధం ? ప్రజలు ఎన్నుకోలేదు కాబట్టి రేపు సొంత అసెంబ్లీ పెట్టుకొంటారా ? గవర్నమెంట్ గుడులని ఆదాయం బట్టి అధీనం లో తెచుకున్నప్పుడు గుడి లో కి ఎవరు రావాలి అని నిర్ధారించవలసినది ఎవరు ? ముఖ్యమంత్రి గా చైర్మన్ బోర్డు ఎంపిక ని చేసినప్పుడు లేని భాద్యత ఎవరు గుడిలోకి వస్తారు వాళ్ళ మతం ఎమి? వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారా చూడవలిసినది ఎవరు ? గుడి కి వచ్చే ఆదాయం ని ఎలా వినియోగించాలి అని డిసైడ్ చేసేవాళ్ళకి మిగతా అన్ని విషయాల్లో తప్పులకి భాద్యత ఉండాలి కదా ? చాల మంది డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తున్నారు కాబట్టి నన్ను అడగకూడదు అంటే ఎలాగా ?

  7. హిందూ ఆలయ విషయాల్లో

    రాజకీయాలకి మించి,

    వ్యక్తుల కి మించి,

    అధికారం పదవులకి మించి

    గుడి లో పద్ధతులకు గట్టిగా వుండలిసిన అవసరం దీని వలన తెలుస్తుంది.

    హిందూ ఆలయ పాలనా విషయాల్లో రాజకీయా , అధికార ప్రమేయం నీ పూర్తిగా తొలగించాలి.

    ముందు వేరే మతం వారి ప్రభావాన్ని తీసివేయాలి.

    చర్చ్ పాలన లో ముస్లిం, హిందువులు వుండరు.

    మసీదు పాలన లో క్రైస్తవ, హిందూ లు వుండరు.

    కేవలం హిందూ గుళ్ళ లోనే ముస్లిం, క్రైస్తవులు వుంటారు.

    1. తిరుపతి గుడి విషయంలో ఉద్యోగుల్లో కొందరు యితర మతస్తులున్నా రనుకున్నా, 99శాతం మంది హిందువులే కదా! మరి వారంతా రూల్సు సరిగ్గా పాటించకుండా ఏం చేస్తున్నారు? కేరళలో, తమిళనాడులో పక్కాగా అమలు చేస్తున్నారుగా! ఇక్కడేం వచ్చింది?

      1. టీటీడీ ని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రభుత్వమే గా ? జగన్ ప్రమేయం లేకుండా టీటీడీ బోర్డు లో నియామకాలు జరిగాయా వైసీపీ ప్రభుత్వ హయం లో. అప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అని మార్పులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎందుకు సడలింపులు ఇవ్వాలి? అది డిక్లరేషన్ ఇవ్వను అని మొండి కేసు వ్యక్తి విషయం లో? నియమాలని ఉల్లంఘించడం ఎందుకు ? మళ్ళి అడిగితె ఎత్తివేయాలి అని డిమాండ్ ఎందుకు? వున్నా నియమాలని అమలు చేయటం రాణి వాళ్ళు అధికారం పోగానే నియమాలు ఎత్తివేయాలి అని డిమాండ్ చేయటం ఏమిటి?

      2. బహుశా పాలన వ్యవస్థ లో అధికార పార్టీ ప్రాబల్యం వలన కావచ్చు.

        జీతాలు ఇచ్చే అధికార వ్యవస్థ రాజకీయ పార్టీల వ్యక్తుల చేతిలలో వున్నప్పుడు , నోరు తెరిచి మాట్లాడే ధైర్యం ఆ మిగతా 90 శాతం మందిలో కోల్పోయి వుంటారు.

        అందుకే హిందూ ఆలయాల పాలన వ్యవస్థ ఎండోమెంట్ లో ప్రభుత్వ ఫ్రభల్యము పూర్తిగా తొలగించాలి. జె దీపక్ లాంటి సుప్రీం కోర్టు న్యాయవాదులు ఈ విషయంగా జాగృత పరుస్తూ వున్నారు.

        1. ప్రయివేటు ఆధ్వర్యంలో నడిచే గుళ్ల సంగతి ఏ మాత్రం బెటర్‌గా లేదు. ధర్మకర్తలందరూ హిందువులే అయినా, గుడి మాన్యాలు మెక్కడంలో ఏమీ తక్కువ తినలేదు. దేవాలయ ఆస్తులను తామే లీజుకి తీసుకుని, అతి తక్కువ ఐవేజు చెల్లిస్తూ ఉండేవారు. అనేక భూములను కైంగర్యం చేశారు. ఇవన్నీ చూసి ప్రజలు హాహాకారాలు చేయడంతోనే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికీ మఠాలు, పీఠాలు ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. అక్కడ వ్యవహారాలపై గొడవలు వస్తూనే ఉన్నాయి. కంచి కామకోటి పీఠంలో అక్రమాలపై గళమెత్తిన ఎక్కౌంటెంటు హత్యకు గురైన విషయం గుర్తుకు తెచ్చుకోండి.

          హిందూ దేవాలయాలు, మఠాలు మాత్రమే కాదు ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో కూడా యిదే తీరు. చర్చి ఆస్తుల్లో అవినీతిపై అనేక వార్తలున్నాయి. హత్యలూ జరిగాయి.

  8. After all, you still could not write that Jagan at least should have signed or stated that he has faith in god (perhaps it is your editorial policy to ensure he is justified from any possible stand).

    However, your idea that “If you cross this threshold, it is understood that you have faith in Lord Venkateswara” sounds good and practical. TTD should seriously think about this.

    1. అక్కడ సంతకం పెట్టడం నియమం, మర్యాద, ధర్మం. పెట్టనని మొరాయించడం గుడి నియమాల పట్ల నిరాదరణ, హిందువులను బాధించే చర్య…’ అని రాశాను. అని మొదటి పేరాలోనే రాస్తే you still could not write that Jagan at least should have signed or stated that he has faith in god  అని మీరు రాయడమేమిటి? మీరు ఆ పేరా స్కిప్ చేశారని అనుకున్నా, రెండో పేరాలో నొక్కి వక్కాణించాను కదా. ముఖ్యమంత్రిగా ఉంటూ తనే నియమాలు అతిక్రమించ కూడదంటూ…!

      వ్యాఖ్యానించే ముందు వ్యాసం సరిగ్గా చదవండి స్వామీ

        1. మీరూ వ్యాసం సరిగ్గా చదవని బాపతే అని అర్థమైంది. ‘అమలులో అసాధ్యమైన యీ డిక్లరేషన్ రూలు విషయంలో కూడా మార్పు రావాలి. కానీ రూలు మార్చేవరకు పాటించక తప్పదు.’ అని స్పష్టంగా రాశాను.

          1. Why do you want to discuss on that rule so strogly. When there is a rule, just follow it and show that you have respect on it. Whjat is the problem to sign?

      1. జగన్ కి అనుకూలంగా నొక్కి వొదిలేయటం తో వ్యాసం యొక్క ఆత్మ , స్ఫూర్తి దారుణంగా దెబ్బతిన్నాయి , దళితులని మోసం చేయటం వల్ల ఉపయోగమేమిటి

  9. విశ్వసించకుండా ఎవరన్నా వెళతారా? అసలు డిక్లరేషన్ వేరమతాల్లో ఉందా?

    డిక్లరేషన్ ఇవ్వకపోతే రావద్దు అనేవాడు దేవుడేనా? అసలు వాడి దైవత్వం మీద వాడికి నమ్మకముందా?,అసలు అలంటి దేవుడికి వాడి శక్తిమీద నమ్మక ఉందా? ఉంటె డిక్లరేషన్ తో పనేంటి దేవుడికి ఎవ్వరైనా రండి నశక్తిని చూడంటి అంటాడుకదా? లేదు నూన్యతాభావం తో ఉన్నాడా విష్ణువు ఇతరదేవుళ్ళ కంటే, ఎందుకు ఎవ్వరైనా చర్చికి వెళ్లొచ్చు, బౌద్దుల గుడికి, సిక్కుల గుడికి ఎలాంటి సమస్యలులేవు!! మరి వీడేమో ముస్లిం అమ్మాయిని తెచ్చుకున్నాడు కదా ?

    ఇంకా, డిక్లరేషన్ లేకుండా రావద్దు అంటే నేను అందరి దేవుణ్ణికాదు కాదు అని ఒప్పుకున్నట్లేకదా?

    ఇలానే దళితుల్ని, సూద్రులని ఏడిపించుకు చంపారు ఇప్పుడు ఇలా!!

    హిందూ మతమే అంత!! దరిద్రపు మతం. పురిలోకూడా దళితుల్ని రానియ్యరు, ఇంకా చాలా ప్రాంతాల్లో, జేసుదాసుకి కుడా ఇలాంటి అవమానాలు ఎన్నో!! బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా ఇలానే ఏడిపించుకు చంపారు ఏ దరిద్రపు హిందూవులు. పూలే గారు ఏడ్చి ఏడ్చి పోయాడు ఏ లేకి మతం వల్ల.

    అసలు మీకు సిగ్గులేదు వద్దు అని దళితుల గురించి, సూద్రుల గురించి నీచంగా రాసిన దాన్ని పట్టుకొని వేలాడటానికి!!

    1. ఒరే యాకోబు .. మా ఇంట్లో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం .. నీలాగా మనుషులను బానిసలు గా చేసి తరతరాలుగా ఆస్తులుగా అసలు మనుషులుగానే గుర్యించని మతాన్ని మొ డ కుడవం ..

      ఎన్నో ఖండాల్లో మూలవాసులను సమూలంగా నిర్మూలించి వారిని దారుణ అత్యాచారాలకి గురిచేసిన మతం వాడి మోచేతినీళ్లు తాగం …

      మన దేశంతో సహా ఎన్నో దేశాలను ఆక్రమించి సంపాదించిన ధనంలో కెంత నీలాంటి కు క్క లకు బిస్కెట్ లు వేసి దేశంలో అశాంతి చేసె వాడి ముందు తోక వూపుకు తిరగం…

      వాడి ముష్టికి ఆశపడి సొంత ఇంటి తలుపులుతెరిచి వాడి దోపిడీకి సహకరించము

    2. ఒరే యాకోబు .. మా ఇంట్లో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం .. నీలాగా మనుషులను బానిసలు గా చేసి తరతరాలుగా ఆస్తులుగా అసలు మనుషులుగానే గుర్యించని మతాన్ని మొ డ కుడవం

    3. ఒ రే యాకోబు .. మా ఇంట్లో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం .. నీలాగా మనుషులను బానిసలు గా చేసి తరతరాలుగా ఆస్తులుగా అసలు మనుషులుగానే గుర్యించని .. వారి స్త్రీలను చెరిచి…. వారికి పుట్టిన బిడ్డల్ని అంగట్లో సరుకులాగ అమ్మేసిన మతాన్ని కుడవం ..

    4. ఎన్నో ఖండాల్లో మూలవాసులను సమూలంగా నిర్మూలించి వారిని దారుణ అత్యాచారాలకి గురిచేసిన మతం వాడి మోచేతినీళ్లు తాగం …

      మన దేశంతో సహా ఎన్నో దేశాలను ఆక్రమించి సంపాదించిన ధనంలో కెంత నీలాంటి కు క్క లకు బిస్కెట్ లు వేసి దేశంలో అశాంతి చేసె వాడి ముందు తోక వూపుకు తిరగం…

      వాడి ముష్టికి ఆశపడి సొంత ఇంటి తలుపులుతెరిచి వాడి దోపిడీకి సహకరించము

    5. నీ జీవితంలో ఒక్కసారి అయినా అంబేద్కర్ పుస్తకాలు చదువురా ఎంగిలి మెతుకులకు మోరెత్తే కుక్కా

  10. మీరు రాసినదాంట్లో రెండు తప్పులు వున్నాయి. ఒకటి డిక్లరేషన్ మధ్యలో వచ్చిందనటానికి ఆధారాలు లేవు.ప్రపంచ వ్యాప్తంగా విష్ణు ఆలయాల దర్శనానికి రెస్ట్రిక్షన్ వున్నాయి. శివాలయాలకు అవి వర్తించవు. విష్ణు తత్వం భౌతిక ప్రపంచం లో ప్రతి జీవ, నిర్జీవ రాసి (visible universe) లో ఉందని మతం తెలిసిన ప్రతి హిందువుకి తెలుసు. వైష్ణవుల్లో వుండే ఆహార నిబంధనలు కు ఇవే కారణం. మిగతా కులాల్లో విష్ణు భక్తులు మాంసాహారాన్ని త్యజిస్తారు. కొండకు వెళ్లాలని సంకల్పించుకున్నాక మాంసం తినరు. ఇతర మతస్తుల్లో ఇటువంటి నిబంధనలు పెట్టలేం కాబట్టి, విష్ణు మీద భక్తి ఉన్నట్టు గ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది అనాదిగా వున్న శాస్త్ర సమ్మతమే. అలానే ప్రతి దర్శనానికి పెట్టాలనే నిబంధన. భక్తి, నమ్మకం అనేది ఎల్ల కలం ఉండదు. కానీ మీరు చెప్పినట్టు టీటీడీ ఈ నిబంధన ను అమలుచేయడం లో విఫలమైంది. కేరళ హిందూ టెంపుల్స్ ను చూసి మనం నేర్చుకోవాలి.

    రెండోది ఈ నిబంధన మూర్తి కి సంబంధించింది, దానిని తీసెయ్యటం అనేది ఉండదు. ఇదేమి ఆచరణ యోగ్యం కానిది కాదు కదా?

    జగన్ వివేకము తో వ్యవహరించాలి.

    1. మీరు చెప్పిన ప్రకారం వైష్ణవులు కాని హిందువులు కూడా విష్ణువుపై, విష్ణు తత్వంపై భక్తి ఉన్నట్లు డిక్లరేషన్ యివ్వాలి.

      గుడిలోకి వెళ్లాక నిబంధనలు అందరూ పాటిస్తారు. డిక్లరేషన్ యివ్వడమనేది తక్కిన ఏ గుళ్లలో ఉందో దయచేసి మాతో పంచుకోగలరు.

      1. గురువాయూర్ టెంపుల్ లో వుంది, పద్మనాభ స్వామి స్వామి ఆలయానికి ఈ మధ్య ఒక విదేశయుణ్ణి తిప్పి పంపారు. ఏసుదాస్ ఉదంతం చదవండి. అయ్యప్ప గుడి తగాదా అక్కడ కట్టుబాట్ల మీద మనం విన్నాం స్త్రీల విషయం లో. గుడిలో మూర్తి కి వున్న నిబంధనలు పాటించాలి. అధికార దర్పంతో, అధికారులంటే భయం తో అవి నీరు కార్చారు.

        గాయనీస్ నిర్వహించే విష్ణు ఆలయాల్లో లెదర్ కి సంబందించిన బెల్ట్, వాలెట్, పర్స్ బయటనే విడిచి పెట్టాలి. ఇటువంటి నిబంధనలు శివాలయాల్లో వుండవు, ఎందుకంటే రాక్షసులకు కూడా ఆయనే దేవుడు కాబట్టి, ఇది త్రిమూర్తి తత్వం లో ప్రాధమిక సూత్రం.

        రామానుజ చార్యులు మీరడిగిన దానికి దీనికి విరుద్ధంగానే కదా చేసింది. దానిని ఇప్పుడు తవ్వడం అనవసరం.

        1. Medhavi ni Ani illusion lo batikhe Kuhana neeli mbs guddi , mooga cheviti , atti varitho emi Aina matladatam valla vedhava evaroo chuse valaki ardam kadu.

      2. అన్య మతస్తులు గుడికి ఎందుకు ప్రవేశించాలి వాళ్లకి ఏమి అవసరం ? అందునా డబ్బు కోసం , రాజకీయాల కోసం మతం మారిన జగన్ రెడ్డి లాంటి వాళ్లకి ఏమి పని ?

  11. ప్రసాద్ ఉవాచ: “ఎవరో కొందరికి తప్ప ముఖ్యమంత్రి మతం ఏమిటని, కులం ఏమిటనే పట్టింపు వుండదు.” ఆంధ్ర రాజకీయాలపై ఈ వ్యక్తికి కనీస అవగాహన అయినా ఉందా?

  12. అన్య మతస్తులు గుడికి ఎందుకు ప్రవేశించాలి వాళ్లకి ఏమి అవసరం ? అందునా డబ్బు కోసం , రాజకీయాల కోసం మతం మారిన జగన్ రెడ్డి కుటుంబానికి అలాంటి వాళ్లకి ఏమి పని ?

  13. గుడి సెట్టింగ్ వేసి అవహేళన చేసిన వాళ్ళకి గుడి లో దేవుడి మీద గుడి ఆచారాల పట్ల హిందూ మతం పట్ల గౌరవం వున్నాయి అని ఎలా అనుకోవాలి.గుడి లో ప్రవేశం హక్కు అని ఎలా అనుకోవాలి? గుడి సెలెబ్రెటీ లని, విదేశీ ప్రభుత్వ అధినేతలనే రమ్మని ఆహ్వానాలు పంపుతోందా ? లేక వాళ్ళు కోరిక తో వస్తున్నారా? ఒక వేళా వచ్చిన వాళ్ళు మర్యాద గ డిక్లరేషన్ అడిగితె మొండికేసారా? వేలమంది రోజు దర్శనానికి వచ్చేవాళ్ళు అడగలేదు కదా ఏమో అని దర్శనానికి ఆపలేదు అని దర్శనం చేసుకుంటున్నారు ఒక వేళా అడిగితె డిక్లరేషన్ ఇస్తారేమో. అందరు మొండికేయరు గా ? బ్రిటిష్ పాలనలో కూడా గుడి వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు అని చెపుతారు. సెక్కులరిజం వచ్చాకనే ఆదాయం వున్నా గుడిలో ప్రభుత్వ పెత్తనం మొదలు అయ్యింది. ప్రభుత్వం కదా పెత్తనం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వానికి నిజం గా గుడి వ్యవస్థ మీద గౌరవం ఉంటే పద్ధతులు మార్చింగ్ ఉండాలి గా?

  14. రాజకీయం పరమావధి గా బ్రతికే జగనమోహనరెడ్డి, చంద్రబాబు నాయుడు ఎలా చచ్చినా సాధారణ హిందువుల కు ఎలాంటి ఇబ్బంది లేదు. కాని వారి ఆద్యాత్మిక కేంద్రం లో వారు విధించిన నియమ నిభందనలు పాటించాలి. కాదంటే వారికి దేవాలయాల ప్రాంగణం లో ప్రవేశించని రాదు.

    1. మీరు అంతవరకే చెప్పి ఊరుకున్నారు. దేవాలయ సంస్థ అందరికీ ఒకేలా, ఎల్లవేళలా ఒకేలా నిబంధన అమలు చేయాలి అని నేను వాదిస్తున్నాను. వ్యాసం రాసిందే అందుకు. దానికి ఏమంటారో చెప్పండి.

  15. టీటీడీ ని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రభుత్వమే గా ? జగన్ ప్రమేయం లేకుండా టీటీడీ బోర్డు లో నియామకాలు జరిగాయా వైసీపీ ప్రభుత్వ హయం లో. అప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అని మార్పులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎందుకు సడలింపులు ఇవ్వాలి? అది డిక్లరేషన్ ఇవ్వను అని మొండి కేసు వ్యక్తి విషయం లో? నియమాలని ఉల్లంఘించడం ఎందుకు ? మళ్ళి అడిగితె ఎత్తివేయాలి అని డిమాండ్ ఎందుకు? వున్నా నియమాలని అమలు చేయటం రాణి వాళ్ళు అధికారం పోగానే నియమాలు ఎత్తివేయాలి అని డిమాండ్ చేయటం ఏమిటి?

  16. టీటీడీ ని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రభుత్వమే గా ? ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా టీటీడీ బోర్డు లో నియామకాలు జరిగాయా ?. అప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అని మార్పులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎందుకు సడలింపులు ఇవ్వాలి? అది డిక్లరేషన్ ఇవ్వను అని మొండి కేసు వ్యక్తి విషయం లో? నియమాలని ఉల్లంఘించడం ఎందుకు ? మళ్ళి అడిగితె ఎత్తివేయాలి అని డిమాండ్ ఎందుకు? వున్నా నియమాలని అమలు చేయటం రాణి వాళ్ళు అధికారం పోగానే నియమాలు ఎత్తివేయాలి అని డిమాండ్ చేయటం ఏమిటి?

  17. టీటీడీ ని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రభుత్వమే గా ? ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా టీటీడీ బోర్డు లో నియామకాలు జరిగాయా ?. అప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అని మార్పులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం ఎందుకు సడలింపులు ఇవ్వాలి? అది డిక్లరేషన్ ఇవ్వను అని మొండి కేసు వ్యక్తి విషయం లో? నియమాలని ఉల్లంఘించడం ఎందుకు ? మళ్ళి అడిగితె ఎత్తివేయాలి అని డిమాండ్ ఎందుకు? వున్నా నియమాలని అమలు చేయటం రాని వాళ్ళు అధికారం పోగానే నియమాలు ఎత్తివేయాలి అని డిమాండ్ చేయటం ఏమిటి?

  18. టీటీడీ ని ఎవరు నియంత్రిస్తున్నారు? ప్రభుత్వమే గా ? ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా టీటీడీ బోర్డు లో నియామకాలు జరిగాయా ?. అప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు అని మార్పులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇప్పటి ప్రభుత్వం ఎందుకు సడలింపులు ఇవ్వాలి? అది డిక్లరేషన్ ఇవ్వను అని మొండి కేసు వ్యక్తి విషయం లో? నియమాలని ఉల్లంఘించడం ఎందుకు ? మళ్ళి అడిగితె ఎత్తివేయాలి అని డిమాండ్ ఎందుకు? వున్నా నియమాలని అమలు చేయటం రాని వాళ్ళు అధికారం పోగానే నియమాలు ఎత్తివేయాలి అని డిమాండ్ చేయటం ఏమిటి?

  19. అసలు మన దేశం లో మొహం చూసి కులం మతం చెప్పలేం కదా.. ఈ సంతకం వ్యవహరం బ్రిటిష్ వారు పెట్టిఉంటారు.. వారి పాలన లో తెల్లవారు కూడా తిరుపతి కి వెళ్ళవలసి వచ్చేది.. హిందువుల మనోభావాలు దెబ్బతినకూడదు అని వారు అలా చేసి ఉంటారు…

  20. ఒక వ్యక్తిని హిందూ ద్వేషిగా చూపించడానికి కోట్లాది హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. మహాప్రసాదాన్ని అవమానించారు. మతాల మధ్య కొట్లాటలు పెట్టడానికి ప్రయత్నించారు. సత్యమేవ జయతే. ఓం నమో వెంకటేశయా 🙏

  21. Meeru ichina examples Anni (except politicians) mokku ante devudi meeda nammakam tho chesinavi. Okka politicians (any party) matrame janalni namminchadam kosam vastaru.

    Migilina nayakulaki notices icharu Jagan ki ivvaledu Ani rasaru. Kani migilina nayakulani venta teeskuni ravalsina avasaram enti?. Daiva darsananiki vastunnara leka nirasana pradarsanaki vastunnara?. Laddu prasadaanni political milege vadukodam tappu. Ade devudni andaru party vallu ee roju Pooja cheyyandi Ani cheppadam Inka ghoram. Adi bhakti kadu. Mummatiki nirasana pradarsane.

  22. మీరు నోటీసుల విషయం సరిగా follow అయినట్లు లేదు. జగన్ వస్తున్నాడని తెలిసి, రోజ, చెవిరెడ్డి, కరుణాకరరెడ్డి వంటివాళ్ళు బల ప్రదర్శన కోసం పోలీస్ permissions కి apply చేసారు. పోలీసు వాళ్ళు permissions deny చేసి section 30 impose చేసారు. ప్రభుత్వం జగన్ హడావిడి లేకుండా రావాలంటే రావొచ్చు, క్రైస్తవుడు కాబట్టి గుడి సాంప్రదాయాన్ని పాటించి సంతకం అయితే చెయ్యాలన్నది. కరుణాకరరెడ్డి ఆరు నూరైనా సరే జగన్ రావడం ఖాయం, సంతకం మాత్రం పెట్టే ప్రసక్తి లేదు అన్నాడు. అది కేవలం రెచ్చగొట్టడం తప్ప మరేమీ కాదు. సంతకం పెట్టకూడదని డిసైడ్ అయి వస్తే మాత్రం అలిపిరిలో నే అడ్డుకోవడం ఖాయం అని బిజేపి అన్నది. ఇంతకీ ఆయన రాలేదు, వీళ్ళు అడ్డుకున్నదీ లేదు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం సరిగానే వ్యవహరించింది. ఇందులో partiality ఏముంది?

    1. వైసిపి నాయకులకు ప్రభుత్వం పంపిన నోటీసులో ‘ఆ పర్యటనకు అనుమతి లేదు’ అంది. ‘మీరు చేద్దామనుకుంటున్న ప్రదర్శనకు..’ అని లేదు. కరుణాకర రెడ్డి మాటల బట్టి ప్రభుత్వం జగన్‌కు అనుమతి నిరాకరించగలదా? సంతకం పెట్టకూడదని డిసైడ్ అయి వస్తే మాత్రం.. – అదెలా తెలుస్తుంది? జగన్ తన నోటితో తను చెప్తే తప్ప! అయినా అలిపిరిలో ఆపే హక్కు బిజెపికి ఎక్కడుంది? అన్యమతస్తులు తిరుమలకు కూడా వెళ్లవచ్చు. గుడిలోకి వెళ్లడానికి మాత్రమే సంతకం పెట్టాలి.

      1. జగన్ ని కానీ, వైసిపి నాయకులని కానీ ప్రభుత్వం వ్యక్తిగత దర్శనానికి అనుమతి నిరాకరించిందా?!? అదే జరిగితే వాళ్ళు నిక్షేపంగా కోర్టుకి వెళ్ళొచ్చు.

      2. అలిపిరిలో ఆపే హక్కు బిజేపీకి ఎక్కడుంది? – ఎందుకు లేదు? రాస్తా రోకో లు చేయడం, ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోవడం ప్రజాస్వామ్యంలో తరచూ జరిగేదే కదా?! ఆ చేసేదేదో, కొండపైన ఇతర భక్తులకి ఇబ్బంది కలగకుండా కొండ కిందనే చేయడమే కరక్ట్.

    2. బలప్రదర్శన చేద్దామని వైసిపి వాళ్లు, బిజెపి వాళ్లు యిద్దరూ ప్రయత్నించినపుడు ప్రభుత్వం యిద్దరికీ నోటీసులివ్వాలి. బిజెపికి యివ్వకపోవడం పక్షపాతం కాదా?

      1. మీరు ఎవరూ రావొద్దు అని వైసిపి నాయకులకి ప్రభుత్వం proactive గా నోటీసులు పంపలేదు. వాళ్ళు procession కి అనుమతి అడిగితే అనుమతి లేదు, దాని గురించి అయితే రావొద్దు అన్నది. బిజేపి వాళ్ళు మేము అడ్డుకుంటాము అనే statement ఇచ్చారే తప్ప police permission కి apply చేయలేదు. Section 30 అంటూ పెట్టాక అది కేవలం ఒక పార్టీ కార్యకర్తలకే ఎలా వర్తింపచేస్తారు? ఆలోచించండి! ఇందులో బిజెపి పట్ల చూపించిన పక్షపాతం ఏమీలేదు.

  23. ఒక సున్నితమైన అంశం.

    మతం మారిన వారు కొత్త మతం పేరు పెట్టుకోవడం.

    చిన్న కులాల వారు చర్చ్ లో యేసు నీ మాత్రమే దేముడిగా నమ్మిన తర్వాత తమ పేరుని బైబిల్ ప్రకారం మార్చుకుంటారు.

    ఉదాహరణ కి వెంకన్న అనే పేరు వున్న ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గము అతను లాజరస్ గా పేరు మార్చుకుంటాడు. ఇది బహిరంగ రహస్యం.

    చర్చి వైపు నుండి కూడ పేరు మార్చుకోవాలి అని పైకి చెప్పని నిబంధన వుంటది.

    కానీ ఇదే రూల్ , పెద్ద కులాలు గా చెప్పబడే బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, రాజు, వైశ్య కులాల నుండి క్రైస్తవ మతం లోకి మారిన వారికి తప్పని సరిగా అమలు చేయడం లేదు. బహుశా వారికి తమ పెద్ద కులము యొక్క హోదా, బడాయి పేరు మార్చుకోడం ద్వారా కోల్పోవడం ఇష్టం లేదు అనుకుంటా.

    నిజంగా యేసు నీ నమ్మితే హిందూ మతం వద్దు అనుకుంటే, బ్రాహ్మణ, కమ్మ , రెడ్డి, వైస్య కులము తోక లు కట్టిరించికుని బైబిల్ ప్రకారం పెట్టిన పేరుతో సమాజం లో గుర్తిపు పొందాలి.

    ఎటూ తిరిగి oc కులాల కాబట్టి, వీరికి ప్రభుత్వ పరంగా చిన్న కులాల వారికి వచ్చే ఉచిత పథకాలు, రిజర్వేషన్ కూడా ఏం వుండవు.కనుక ఇంకా ఆ హిందూ పేరు యెందుకు?

    కనీసం ఎస్సీ ఎస్టీ మతం మారిన క్రైస్తవులు నిజాయితీ గా వుంటున్నారు. అగ్ర కులం హిందువులు మాత్రమే మతం మరి కూడా రెండు వైపులా మతాన్ని మోసం చేస్తున్నారు.

    1. పేరు మార్చుకుంటే తమ పక్కనే చర్చ్ లో చిన్న కులం నుండి మతం మారిన వారితో సమానం గా కూర్చోవాలి అనే అగ్ర కుల గజ్జి కావచ్చు.

      ఒక ఎస్సీ మహిళా లక్ష్మీ , మతం మారి మేరీ గా మారినప్పుడు,

      ఒక oc మహిళా భారతి కూడా మతం మారినప్పుడు ఎలిజబెత్ గా మారాలి కదా.

      ఒక ఎస్టీ పురుషుడు సుందర్ మతం మరి పీటర్(పేతురు) గా పేరు మార్చుకున్నప్పుడ్లు

      ఒక oc పురుషుడు జ్జగ్నెన్ మొహం రెడ్డి కూడా. అబ్రహం లాంటి పేరు లేక తెలుగీకరించబడిన క్రైస్తవ పేరు లవణం లాంటి పేరు పెట్టుకోవాలి కదా.

      కారణం ఇక్కడ కూడా పెద్ద కుల గజ్జి.

      1. పెద్ద కులం లో మతం మారిన వారికి చర్చ్ లో కూడా ఆ పెద్ద కులం నుండి మతం మారిన పాస్టర్లు మాత్రమే వుంటారు.

        వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా పెద్ద కులం పాస్టర్లు ( అయ్యవారు) మాత్రమే చెయ్యాలి.

        చిన్న కులం నుండి మతం మారిన వారికి చిన్న కులం నుండి మతం మారిన పాస్టర్లు. ఇది పచ్చి నిజం.

        అమెరికా, యూరోప్ లో తెల్ల వారిక్కి , నల్ల వారికి ప్రత్యేక చర్చ్ లాగ,

        షియా ముస్లిం , సున్ని ముస్లిం లకి వేరే వేరే మసీదు లు వున్నట్లు,

        ఇక్కడ కూడా పెద్ద కులం వారికి, చిన్న కులం వారికి వేరే వేరే చర్చ్ లు.

      2. తెలుగీకరించబడిన క్రైస్తవ పేరు లవణం 

        గోపరాజు రామచంద్రరావు అనే బ్రాహ్మణుడు ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన తన కుమారుడికి లవణం అని పేరు పెట్టారు. స్వాతంత్ర్య సమరం సమరంలో పుట్టిన మరొక కుమారుడికి సమరం అని పేరు పెట్టారు. ఈ పేర్లకూ క్రైస్తవానికీ సంబంధం లేదు.

        జగన్మోహన, రాజశేఖర, శర్మిల అనేవి సంస్కృత పేర్లు తప్ప హిందూ దేవుళ్ల పేర్లు కావు. క్రైస్తవుడైనంత మాత్రాన లాటిన్ పేర్లు పెట్టుకోవాలని లేదు. జపాన్, చైనా దేశాల్లోని క్రైస్తవులు అలాటి పేర్లు పెట్టుకుంటున్నారా? శ్రీలంక క్రైస్తవులు కూడా సంస్కృతజన్యమైన పేర్లను పెట్టుకోగా చూశాను.

        మా క్రైస్తవ క్లాస్‌మేట్ పేరు అభిషిక్త . anointed one అంటే తలపై నూనె రాసి అభిషేకించి బడినవాడు. దేవుడి చేత అలా అభిషిక్తుడైనవాడు జీసస్. ఇతనికి జీసస్ అని పెట్టేబదులు దాని సంస్కృత అనువాదాన్ని పెట్టారు.

        భాషకు, మతానికి లింకు లేదు.

        1. Mee lanti l/k ye vundevaru nenu engineering chadive rojulo , tinedi ,chadivedi emo hindu scholar ship dabbu l/k perlu matram certificates Telugu vi cheppetappudu matram English vi

      3. ఎస్సీలలో కూడా పేరు మార్చుకోని వారు ఎందరో ఉన్నారు. పేరు మార్చుకోవడం వారి యిష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. క్రైస్తవంలోకి వెళ్లినా హిందూ కులపు తోకలు పెట్టుకోవడమే అభ్యంతరకరం. దానిపై 2009 ప్రాంతంలో నేను చాలా పెద్ద ఆర్టికల్సే రాశాను. కావాలంటే ఆర్కయివ్స్‌లో చూడండి

        1. చిన్న కులాలు గా పిలబడే వారు కొంత మంది హిందూ పేర్లు తో చెలామణి కావడం వెనుక , ప్రభుత్వ పరంగా వచ్చే హిందూ దళిత ఆధార పథకాలు కోసం అయి వుండొచ్చు.

          నిజానికి వారు క్రైస్తవ మతం లోకి మారిన కూడా, ప్రభుత్వ రికార్డు పరంగా వారు హిందూ పుల కిందనే లెక్క లోకి వస్తారు.

          ఇలా దొం*గ జీవితం గడిపే అబద్ధపు క్రైస్తవులు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ.

  24. ఎంత సేపు వంకర బుద్ది తో కుడి ఎడమ అయ్యింది ఎడమ కూడా ఎందుకు కాదు అని వికట కవి లా మాట్లాడతాడు ఏంటి ఈ సర్వ జ్ఞాని?

    హిందూ సప్రదాయం ప్రకారం వేరే కులస్తులు వచ్చినప్పుడు డిక్లరేషన్ పైనా సింథకం పెట్టాలి అది రూల్ .. అనాది గా వస్తుంది పాటించటం మన దర్మం.

    మరచ వచ్చు అంటున్నాడు గుండు కొట్టించుకుంటున్నరుగా అది మూర్కపు అని ఎవ్వరు అనటం లేదు ఇష్ట ప్రకారం పాటిస్తున్నారు.

    ఎవరో అనమాక క్రిస్టియన్ లేదా ముల్సిం వస్తే త్యెలియదు కాబట్టి ఎవ్వరు అడగరు..కానీ అన్నీ తెలిసి అడ్గాకుండా ఎలా ఉంటారు పై గా ఇంత కల్తీ జరగక

  25. శిక్ఖు బౌద్ద జైన మతస్తులను డిక్లరేషన్ అడగరు.

    ఎందుకంటే వారిని హిందువులలోనే ఒక భాగంగా లెక్కవేస్తారు కాబట్టి.

    తిరుమల ఒక్కచోటే కాదు కేరళ తమిళనాడు గుడులలో కూడా అడగరు. మొన్నీ మధ్య పూరీ వెళ్ళాను. ఇందిరాగాంధీనే లోపలికి రానివ్వని మహాచాందసవాద పూరి జగన్నాధాలయంలో ఒక సిక్కు కుటుంబం మాతోపాటే దర్శనం చేసుకున్నారు ఎవరూ ఆపలేదు.

    శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

    మాజీరాష్ట్రపతి జైల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

    రతన్ టాటా గారు సంతకం పెట్టే వెళ్ళారు. ఆయన ఆలయానికి చాలా కానుకలు కోట్లలో ఇచ్చారు. అయినా సంతకం పెట్టే వెళ్ళారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కేసీ అబ్రహం గారు చాలాసార్లు తిరుమల వెళ్ళారు. ఆయన మనవడి పుట్టు వెంట్రుకలు తిరుమలలోనే తీసారు. వారూ సంతకం పెట్టే వెళ్ళారు

    అలాగే మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు సంతకం పెట్టే వెళ్లారు.

    కాశ్మీర్ మాజీముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారి సతీమణి హిందువు. ఆమెను అడగలేదు.

    షారుఖ్ ఖాన్ సంతకం చేసే వెళ్ళాడు,

    ఈ తరిగొమి, హిందీనటుడు మహమూద్ గార్ల గురించి తెలియదు.

    దేవుడు లేదని చెప్పే నాస్తికులని చెప్పుకునే సీపీఐ నారాయణ సంతకం పెట్టకుండానే వెళ్ళాడు. అలాగే చండ్ర రాజేశ్వరరావు గారూ కూడా అని గుర్తు.

    సోనీయాగాంధీ సంతకం పెట్టలేదు. అప్పుడు ఉన్నది వైఎస్సార్ ప్రభుత్వం. దేవాలయం అధికారులు ధైర్యం చేయలేక ఎంట్రన్స్ లో ఒక బోర్డు ఆమెకు కనబడేట్లు పెట్టారు. కానీ ఆమె లెక్క చేయకుండా లోపలకు వెళ్ళిపోయింది.

    నాకు గుర్తు ఉన్నవి ఇవి.

    హైందవేతరులు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఒక మర్యాద.

    వచ్చినవాళ్ళు హిందువులా హైందవేతరులా అని ద్వారం దగ్గర వెరిఫై చేయరు. ప్రముఖులంటే వాళ్ళు ఫలానా మతం అని తెలుసుకాబట్టి అడుగుతారు. సామాన్యులు ఎవరో ఎలా గుర్తించాలి.

  26. శిక్ఖు బౌద్ద జైన మతస్తులను డిక్లరేషన్ అడగరు.

    ఎందుకంటే వారిని హిందువులలోనే ఒక భాగంగా లెక్కవేస్తారు కాబట్టి.

    తిరుమల ఒక్కచోటే కాదు కేరళ తమిళనాడు గుడులలో కూడా అడగరు. మొన్నీ మధ్య పూరీ వెళ్ళాను. ఇందిరాగాంధీనే లోపలికి రానివ్వని మహాచాందసవాద పూరి జగన్నాధాలయంలో ఒక సిక్కు కుటుంబం మాతోపాటే దర్శనం చేసుకున్నారు ఎవరూ ఆపలేదు.

    1. శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

      మాజీరాష్ట్రపతి జైల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

      రతన్ టాటా గారు సంతకం పెట్టే వెళ్ళారు. ఆయన ఆలయానికి చాలా కానుకలు కోట్లలో ఇచ్చారు. అయినా సంతకం పెట్టే వెళ్ళారు.

      ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కేసీ అబ్రహం గారు చాలాసార్లు తిరుమల వెళ్ళారు. ఆయన మనవడి పుట్టు వెంట్రుకలు తిరుమలలోనే తీసారు. వారూ సంతకం పెట్టే వెళ్ళారు

      అలాగే మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు సంతకం పెట్టే వెళ్లారు.

      కాశ్మీర్ మాజీముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారి సతీమణి హిందువు. ఆమెను అడగలేదు.

      షారుఖ్ ఖాన్ సంతకం చేసే వెళ్ళాడు,

      ఈ తరిగొమి, హిందీనటుడు మహమూద్ గార్ల గురించి తెలియదు.

    2. శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

      మాజీరాష్ట్రపతి జైల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

      రతన్ టాటా గారు సంతకం పెట్టే వెళ్ళారు. ఆయన ఆలయానికి చాలా కానుకలు కోట్లలో ఇచ్చారు. అయినా సంతకం పెట్టే వెళ్ళారు.

    3. శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

      మాజీరాష్ట్రపతి జైల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

      1. మాజీరాష్ట్రపతి జైల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

      2. శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

        మాజీరాష్ట్రపతి జయి**ల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

        రతన్ టాటా గారు సంతకం పెట్టే వెళ్ళారు. ఆయన ఆలయానికి చాలా కానుకలు కోట్లలో ఇచ్చారు. అయినా సంతకం పెట్టే వెళ్ళారు.

  27. శిక్ఖు బౌద్ద జైన మతస్తులను డిక్లరేషన్ అడగరు.

    ఎందుకంటే వారిని హిందువులలోనే ఒక భాగంగా లెక్కవేస్తారు కాబట్టి.

    తిరుమల ఒక్కచోటే కాదు కేరళ తమిళనాడు గుడులలో కూడా అడగరు. మొన్నీ మధ్య పూరీ వెళ్ళాను. ఇందిరాగాంధీనే లోపలికి రానివ్వని మహాచాందసవాద పూరి జగన్నాధాలయంలో ఒక సిక్కు కుటుంబం మాతోపాటే దర్శనం చేసుకున్నారు ఎవరూ ఆపలేదు.

    శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

    మాజీరాష్ట్రపతి జయి**ల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

    రతన్ టాటా గారు సంతకం పెట్టే వెళ్ళారు. ఆయన ఆలయానికి చాలా కానుకలు కోట్లలో ఇచ్చారు. అయినా సంతకం పెట్టే వెళ్ళారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కేసీ అబ్రహం గారు చాలాసార్లు తిరుమల వెళ్ళారు. ఆయన మనవడి పుట్టు వెంట్రుకలు తిరుమలలోనే తీసారు. వారూ సంతకం పెట్టే వెళ్ళారు

    అలాగే మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు సంతకం పెట్టే వెళ్లారు.

    కాశ్మీర్ మాజీముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారి సతీమణి హిందువు. ఆమెను అడగలేదు.

    షారుఖ్ ఖాన్ సంతకం చేసే వెళ్ళాడు,

    ఈ తరిగొమి, హిందీనటుడు మహమూద్ గార్ల గురించి తెలియదు.

    దేవుడు లేదని చెప్పే నాస్తికులని చెప్పుకునే సీపీఐ నారాయణ సంతకం పెట్టకుండానే వెళ్ళాడు. అలాగే చండ్ర రాజేశ్వరరావు గారూ కూడా అని గుర్తు.

    సోనీయాగాంధీ సంతకం పెట్టలేదు. అప్పుడు ఉన్నది వైఎస్సార్ ప్రభుత్వం. దేవాలయం అధికారులు ధైర్యం చేయలేక ఎంట్రన్స్ లో ఒక బోర్డు ఆమెకు కనబడేట్లు పెట్టారు. కానీ ఆమె లెక్క చేయకుండా లోపలకు వెళ్ళిపోయింది.

    నాకు గుర్తు ఉన్నవి ఇవి.

    హైందవేతరులు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఒక మర్యాద.

    వచ్చినవాళ్ళు హిందువులా హైందవేతరులా అని ద్వారం దగ్గర వెరిఫై చేయరు. ప్రముఖులంటే వాళ్ళు ఫలానా మతం అని తెలుసుకాబట్టి అడుగుతారు. సామాన్యులు ఎవరో ఎలా గుర్తించాలి.

  28. లడ్డూలో కల్తీ అని ఈనాడులో వచ్చింది.

    అశ్వద్ధామ హత: కుంజర: లాగా, రిపోర్ట్ గురించి ఇతమిద్దంగా చెప్పకుండా చెప్పి, జల్లాల్సిన బురద జల్లింది. మిగిలిన పచ్చమీడియా డిటో డిటో కాకపోతే మరీ పచ్చిగా !

    చంద్రబాబు గారు పెద్ద కళావంతుడు. ఎవరి మీదనైనా బురద జల్లేస్తాడు. దాన్నీ పచ్చ మాఫియా ఇంకా పామి పామి వదులుతుంది. ఆ బురద తుడుచుకోలేక బురదపడినవాడు నానా చావు చస్తాడు. పెద్ద NTR దగ్గర నుండి చిరంజీవి పవన్ కళ్యాణ్ సహా ఎందరో బాధితులు.

    ఇప్పుడు చంద్రబాబుగారు లడ్డూలో కల్తీ అన్నాడు కాబట్టి, అనుయాయి పవన్ కల్యాణ్ ఇంకా పెద్దగొంతుకతో శ్రుతి కలపటమే కాదు యమగెంతుళ్ళు గెంతాడు.

    ఇవాళ ఆంధ్రలో ఉన్న బీజేపీ లో వెలిగిపోతున్నది అధ్యక్షురాలి దగ్గర నుండీ మామూలు నాయకుల వరకూ తెలుగుదేశం గోత్రీకులే. ఒరిజినల్ గాళ్ళు ఏనాడో మూలకు కుదేలయ్యారు.

    మరి మరిదిగారు చెప్పింది వదినగారు వదిలేస్తారా ? ఆమెతో పాటు కొత్తగా పంగనామాలు రాసుకున్న కొత్త బీజేపీ ముఠా !

    కాకపోతే రవ్వంత పచ్చి వెలక్కాయ అడ్డంవేసింది సుప్రీంకోర్టు.

    అయినా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూట్రలైజ్ చేయటం తెలుగుదేశానికి చిటికెలో పని

  29. లడ్డూలో కల్తీ అని ఈనాడులో వచ్చింది.

    అశ్వద్ధామ హత: కుంజర: లాగా, రిపోర్ట్ గురించి ఇతమిద్దంగా చెప్పకుండా చెప్పి, జల్లాల్సిన బురద జల్లింది. మిగిలిన పచ్చమీడియా డిటో డిటో కాకపోతే మరీ పచ్చిగా !

    చంద్రబాబు గారు పెద్ద కళావంతుడు. ఎవరి మీదనైనా బురద జల్లేస్తాడు. దాన్నీ పచ్చ మాఫియా ఇంకా పామి పామి వదులుతుంది. ఆ బురద తుడుచుకోలేక బురదపడినవాడు నానా చావు చస్తాడు. పెద్ద NTR దగ్గర నుండి చిరంజీవి పవన్ కళ్యాణ్ సహా ఎందరో బాధితులు.

    1. ఇప్పుడు చంద్రబాబుగారు లడ్డూలో కల్తీ అన్నాడు కాబట్టి, అనుయాయి పవన్ కల్యాణ్ ఇంకా పెద్దగొంతుకతో శ్రుతి కలపటమే కాదు యమగెంతుళ్ళు గెంతాడు.

      ఇవాళ ఆంధ్రలో ఉన్న బీజేపీ లో వెలిగిపోతున్నది అధ్యక్షురాలి దగ్గర నుండీ మామూలు నాయకుల వరకూ తెలుగుదేశం గోత్రీకులే. ఒరిజినల్ గాళ్ళు ఏనాడో మూలకు కుదేలయ్యారు.

      మరి మరిదిగారు చెప్పింది వదినగారు వదిలేస్తారా ? ఆమెతో పాటు కొత్తగా పంగనామాలు రాసుకున్న కొత్త బీజేపీ ముఠా

      1. కాకపోతే రవ్వంత పచ్చి వెలక్కాయ అడ్డంవేసింది సుప్రీంకోర్టు.

        అయినా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యూట్రలైజ్ చేయటం తెలుగుదేశానికి చిటికెలో పని

      2. కాకపోతే సుప్రీంకోర్టు కొద్దిగా బ్రేక్ వేసింది. దాన్ని ఎదుర్కోవటం తెలుగుదేశానికి వెన్నతో పెట్టిన విద్య

  30. లడ్డూలో కల్తీ అని ఈనాడులో వచ్చింది.

    అశ్వద్ధామ హత: కుంజర: లాగా, రిపోర్ట్ గురించి ఇతమిద్దంగా చెప్పకుండా చెప్పి, జల్లాల్సిన బురద జల్లింది. మిగిలిన పచ్చమీడియా డిటో డిటో కాకపోతే మరీ పచ్చిగా !

    చంద్రబాబు గారు పెద్ద కళావంతుడు. ఎవరి మీదనైనా బురద జల్లేస్తాడు. దాన్నీ పచ్చ మాఫియా ఇంకా పామి పామి వదులుతుంది. ఆ బురద తుడుచుకోలేక బురదపడినవాడు నానా చావు చస్తాడు. పెద్ద NTR దగ్గర నుండి చిరంజీవి పవన్ కళ్యాణ్ సహా ఎందరో బాధితులు.

    ఇప్పుడు చంద్రబాబుగారు లడ్డూలో కల్తీ అన్నాడు కాబట్టి, అనుయాయి పవన్ కల్యాణ్ ఇంకా పెద్దగొంతుకతో శ్రుతి కలపటమే కాదు యమగెంతుళ్ళు గెంతాడు.

    ఇవాళ ఆంధ్రలో ఉన్న బీజేపీ లో వెలిగిపోతున్నది అధ్యక్షురాలి దగ్గర నుండీ మామూలు నాయకుల వరకూ తెలుగుదేశం గోత్రీకులే. ఒరిజినల్ గాళ్ళు ఏనాడో మూలకు కుదేలయ్యారు.

    మరి మరిదిగారు చెప్పింది వదినగారు వదిలేస్తారా ? ఆమెతో పాటు కొత్తగా పంగనామాలు రాసుకున్న కొత్త బీజేపీ ముఠా !

    కాకపోతే సుప్రీంకోర్టు కొద్దిగా బ్రేక్ వేసింది. దాన్ని ఎదుర్కోవటం తెలుగుదేశానికి వెన్నతో పెట్టిన విద్య

  31. శిక్ఖు బౌద్ద జైన మతస్తులను డిక్లరేషన్ అడగరు.

    ఎందుకంటే వారిని హిందువులలోనే ఒక భాగంగా లెక్కవేస్తారు కాబట్టి.

    తిరుమల ఒక్కచోటే కాదు కేరళ తమిళనాడు గుడులలో కూడా అడగరు. మొన్నీ మధ్య పూరీ వెళ్ళాను. ఇందిరాగాంధీనే లోపలికి రానివ్వని మహాచాందసవాద పూరి జగన్నాధాలయంలో ఒక సిక్కు కుటుంబం మాతోపాటే దర్శనం చేసుకున్నారు ఎవరూ ఆపలేదు.

    1. శ్రీలంక నాయకులు ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వలేదు.

      మాజీరాష్ట్రపతి జయి**ల్ సింగ్ గారూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారూ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ కూడా సంతకాలు పెట్టలేదు.

      రతన్ టాటా గారు సంతకం పెట్టే వెళ్ళారు. ఆయన ఆలయానికి చాలా కానుకలు కోట్లలో ఇచ్చారు. అయినా సంతకం పెట్టే వెళ్ళారు.

      ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కేసీ అబ్రహం గారు చాలాసార్లు తిరుమల వెళ్ళారు. ఆయన మనవడి పుట్టు వెంట్రుకలు తిరుమలలోనే తీసారు. వారూ సంతకం పెట్టే వెళ్ళారు

      అలాగే మాజీ రైల్వేమంత్రి జాఫర్ షరీఫ్ గారు సంతకం పెట్టే వెళ్లారు.

      1. కాశ్మీర్ మాజీముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారి సతీమణి హిందువు. ఆమెను అడగలేదు.

        షారుఖ్ ఖాన్ సంతకం చేసే వెళ్ళాడు,

        ఈ తరిగొమి, హిందీనటుడు మహమూద్ గార్ల గురించి తెలియదు.

        దేవుడు లేదని చెప్పే నాస్తికులని చెప్పుకునే సీపీఐ నారాయణ సంతకం పెట్టకుండానే వెళ్ళాడు. అలాగే చండ్ర రాజేశ్వరరావు గారూ కూడా అని గుర్తు.

        1. సోనీయాగాంధీ సంతకం పెట్టలేదు. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వంఆమెకు కనబడేట్లు పెట్టారు. కానీ ఆమె లెక్క చేయకుండా లోపలకు వెళ్ళిపోయింది.

          నాకు గుర్తు ఉన్నవి ఇవి.

          హైందవేతరులు డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఒక మర్యాద.

          వచ్చినవాళ్ళు హిందువులా హైందవేతరులా అని ద్వారం దగ్గర వెరిఫై చేయరు. ప్రముఖులంటే వాళ్ళు ఫలానా మతం అని తెలుసుకాబట్టి అడుగుతారు. సామాన్యులు ఎవరో ఎలా గుర్తించాలి.

    2. జయిల్ సింగ్ మన్మోహన్ సింగ్, విక్రమ్ రణసింఘే, నవజోత్ సింగ్ సిద్ధూ తదితరులు సరాసరి లోపలకు వెళ్ళారు

      ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కేసీ అబ్రహం, మాజీ రైల్వే మంత్రి జాఫర్ షరీఫ్, రతన్ టాటా , షారుఖ్ ఖాన్ లాంటివారు శుభ్రంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారు.

      మారిషస్ ప్రధానీ ఫిజీ ప్రధానీ శ్రీలంక అధ్యక్షుడూ ఆలయసంప్రదాయాల ప్రకారం గౌరవం పొందారు.

      సినీనటీమణులు అమల సమంతలు వెళ్ళినప్పుడు అడిగారో లేదో తెలియదు

  32. Great article questioning TTD and supporting your master. Why employees of TTD, even CBN & RRRs likes were thrown into jail without proper reason and you expect a small employee to ask your master for signature. You don’t dare to write about deeds of waqf but talk abt TTD not following rules

  33. Great article questioning TTD and supporting your master. Why employees of TTD, even CBN & RRRs likes were thrown into jail without proper reason and you expect a small employee to ask your master for signature. You don’t dare to write about deeds of waqf but talk abt TTD not following rules

  34. The rule that non-Hindus should declare their faith in the Lord was introduced in April 1990 through Government Order (GO) No. 311. “The declaration should be presented to the Peishkar, Tirumala Tirupati Devasthanams or other officer incharge of the temple (other than Sri Tirumala Temple ) who may after making such enquiries as he deems fit, accord the permission sought for. On grant of such permission he can be admitted into the temple in the same manner as any other pilgrim is admitted,” the order reads.

    Based on the above, the declaration is mandatory. However, it is very difficult to impose this rule and some one violating the rule, he/she is at fault. It may not be a punishable offence but still a violation.

    No amount cleverly camouflaged write ups can exonerate the wrong doer.

  35. పధకం ప్రకారం జరిగిన అకృత్యం..తిరుమలలో అలజడులు రేపి బాజపా కి పెత్తనం అప్పగించడానికి అంధ్ర పాలకులు ప్ర్యత్నించేరు అనుకోడం లో తప్పు లేదు..

  36. ఇంతకీ నిజాం గారి కోడలు వెళ్లినప్పటికీ డిక్లరేషన్ ఇవ్వాలి అని రూల్ ఉందా అసలు .. తమరికి తెలిస్తే రాయండి .. ఇంకా మీ ప్రశ్న కి సమాధానం జగన్ ని మాత్రమే ఎందుకు అడుగుతున్నారు అని .. కమ్మలు ఏమి పాపం చేసారు అని వాళ్ళని జగన్ టార్గెట్ చేసాడు( ఇది నామాట కాదు తమరు రాసిందే) ..సింపుల్ గ చెప్పాలి అంటే రాజకీయము అలాగే ఏడుస్తుంది .. అంతవరకూ ఎందుకు తమరి రాతలు కూడా అలాగే ఏడిసాయి .. బాబుని తలుపు చెక్కతో కొడతారు .. జగన్ ని నెమలి ఇక తో కొడతారు … మాలాంటోళ్ళు మీరు న్యూట్రల్ అని నమ్మాలి అని పాపం ..

  37. జనంలో రెండురకాలు .భాజనులు,అభాజనులు(భారతీయ అని కాదండోయ్ )

    అభాజనులు ఎవడో ఏమిటో ఎవరికీతెలియదు . తెలుసుకోరు.పేచీ అంత ఈ భాజనులతోటే .సమాజంల పైచేయి సాధించినవారు .ఇట్టేదొరికిపోయేవారు .వారికొరకే ఈడిక్లరేషను .తప్పనిసరిగావారివద్ద డిక్లరేషను

    తీసు(తీసుకోవటం అనివార్యం)కుంటే దేవాలయ ఆదర్శం

    నిలబడ్డట్టే . ఇక బౌధ్ధులసంగతి నాకుతెలియదుకాని జైనులు,శిక్కులకు హిందూమమేకత్వం వుంది .అందుచేతనేవారిని స్వధర్మంగానేభావిస్తారు .వారుకూడ

    హిందూమతంవిషయంలో సహజంగానేవుంటారు .

    ఇకమౌలికమైనప్రశ్న ఏమిటంటే హిందూధర్మం(సనాతనం)

    కాదనుకునేవారికి హిందూదేవాలయాలకు రావాల్సిన అవసరం ఏమిటి .సినిమాచూట్టానికొస్తున్నారా?

    అందుకోసరమే ఈ డిక్లరేషను .ఈపధ్ధతి ఒక్క తిరుమలలోనేకాదు .అన్ని హిందూ దేవాలయాలలోనూవుండాలి .

Comments are closed.