టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌పై పెద్దిరెడ్డి ప‌రువు న‌ష్టం దావా!

త‌మ కుటుంబాన్ని బ‌ద్నాం చేసేలా వార్తా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేసిన రెండు టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌పై పెద్దిరెడ్డి కుటుంబం ప‌రువు న‌ష్టం దావా వేయ‌నుంది. ఈ విష‌యాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు.…

త‌మ కుటుంబాన్ని బ‌ద్నాం చేసేలా వార్తా క‌థ‌నాల్ని ప్ర‌సారం చేసిన రెండు టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌పై పెద్దిరెడ్డి కుటుంబం ప‌రువు న‌ష్టం దావా వేయ‌నుంది. ఈ విష‌యాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వెల్ల‌డించారు.

పెద్దిరెడ్డి కుటుంబం కొంత మంది ఆస్తుల్ని దోచుకుంద‌ని, అలాగే ప్ర‌భుత్వ ఖాజానాను కొల్ల‌గొట్టిందంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్టు దుష్ప్ర‌చారం చేసిన రెండు మీడియా చాన‌ళ్ల‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డానికి న్యాయ‌నిపుణుల‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

ఒక్కో చాన‌ల్‌పై రూ.50 కోట్లు చొప్పున దావా వేయ‌డానికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి సిద్ధ‌మ‌య్యార‌ని స‌మాచారం. చంద్ర‌బాబు రాజ‌గురువు చాన‌ల్‌తో పాటు ఇటీవ‌ల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డిపై ఇష్టానురీతిలో క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన మ‌రో చాన‌ల్‌పై న‌ష్ట‌ప‌రిహారం కేసు వేయ‌డానికి పెద్దిరెడ్డి కుటుంబం సిద్ధం కావ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసింది. ప్ర‌తి రోజూ టీడీపీ అనుకూల మీడియాలో పెద్దిరెడ్డి కుటుంబం వేలాది ఎక‌రాలు దోచుకుందంటూ క‌థ‌నాలు రాస్తున్న సంగ‌తి తెలిసిందే. పెద్దిరెడ్డి పాపాలు అంటూ త‌మ‌పై త‌ప్పుడు క‌థ‌నాలు రాయ‌డాన్ని మిధున్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. న్యాయ పోరాటం చేసి, త‌ప్పుడు క‌థ‌నాలు రాసిన‌, ప్ర‌సారం చేసిన చాన‌ళ్ల ఆట క‌ట్టించాల‌ని ఆయ‌న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

7 Replies to “టీడీపీ అనుకూల చాన‌ళ్ల‌పై పెద్దిరెడ్డి ప‌రువు న‌ష్టం దావా!”

  1. వేస్తె సార్ నిఖార్సుతనం తెలుస్తుంది ఒట్టొట్టి అరుపులు అరుస్తుమ్ కాదు నిజం గ నమ్మకం దమ్ము ఉంటే దావా వెయ్యాలి

Comments are closed.