ఉత్కంఠకు తెర‌.. చివ‌రి వ‌ర‌కూ పోరాటం!

అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది.

అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు తిరుప‌తి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ డిప్యూటీ మేయ‌ర్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. ఈ ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి, ఆ పార్టీ ఏకైక అధికారిక కార్పొరేట‌ర్ ఆర్సీ మునికృష్ణ త‌న స‌మీప వైసీపీ అభ్య‌ర్థి భాస్క‌ర్‌రెడ్డిపై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీ చివ‌రి వ‌ర‌కూ అవిశ్రాంత పోరాటం చేసింది.

కోరం లేక‌పోవ‌డంతో సోమ‌వారం ఎన్నిక వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ ఎస్వీ యూనివ‌ర్సిటీలో హైకోర్టు ఆదేశాల‌తో ఎన్నిక ప్ర‌శాంతంగా ముగిసింది. ఈ ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థికి 26, వైసీపీ అభ్య‌ర్థికి 21 ఓట్లు వ‌చ్చాయి. దీంతో టీడీపీ అభ్య‌ర్థి డిప్యూటీ మేయ‌ర్‌గా గెలుపొందిన‌ట్టు ఎన్నిక‌ల అధికారులు ప్ర‌క‌టించారు.

ఇదిలా వుండ‌గా తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఉప ఎన్నికలో థ్రిల్ల‌ర్ సినిమాకు మించిన స‌స్పెన్స్ క‌నిపించింది. షెడ్యూల్ ప్ర‌కారం 3వ తేదీ ఎన్నిక జ‌ర‌గాల్సి వుండింది. ఎన్నిక‌లో పాల్గొనేందుకు బ‌స్సులో వెళుతున్న వైసీపీ కార్పొరేట‌ర్లపై టీడీపీ, జ‌న‌సేన అనుచ‌రులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా న‌లుగురు కార్పొరేట‌ర్ల‌ను త‌మ అదుపులో ఉంచుకున్నార‌నే ప్ర‌చారానికి బ‌లం క‌లిగించేలా, ఇవాళ ఎన్నిక‌లో పాల్గొనేందుకు వాళ్లంతా ఆ కూట‌మి మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి ఎస్వీ యూనివ‌ర్సిటీకి వెళ్లారు. వీళ్ల‌లో అమ‌ర్‌నాథ్‌రెడ్డి అనే కార్పొరేట‌ర్ మిన‌హాయిస్తే, మిగిలిన ముగ్గురు టీడీపీ అభ్య‌ర్థికే ఓట్లు వేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం విష‌యంలోనూ అలాంటి నాట‌కీయ‌తే చోటు చేసుకుంది. అర్ధ‌రాత్రి నుంచి ఆయ‌న క‌నిపించ‌కుండా పోయారు. ఎన్నిక‌కు గంట ముందు, ఆయ‌న మీడియాకు ఓ వీడియో విడుద‌ల చేశారు. త‌న‌కు ఆరోగ్యం బాగా లేద‌ని, ఆస్ప‌త్రిలో ఉన్నాన‌ని, ఎవ‌రూ త‌న గురించి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని సెల‌విచ్చారు. ఆయ‌న ఓటింగ్‌లో పాల్గొన‌లేదు. చివ‌రికి ఎన్నిక‌ను టీడీపీ, జ‌న‌సేన త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకున్నాయి. అయితే వైసీపీ పోరాట స్ఫూర్తిని క‌న‌బ‌రిచింది.

12 Replies to “ఉత్కంఠకు తెర‌.. చివ‌రి వ‌ర‌కూ పోరాటం!”

  1. దావోస్ వెళుతున్నాం, కోట్లకు కోట్లు పెట్టుబడులు తెస్తున్నాం. నేషనల్ టీవీలో ప్రచారం చేయండి. మన జాకీ ఛానెల్స్ లో ఉదరగొట్టేయండి entha డబ్బు కార్చు అయిన పర్వాలేదు

    దావోస్ హోటల్ లోని అన్ని గదుల కిటికీ అడ్డాలు పగిలిపోయాయి. -12 డిగ్రీలా చలి. అయినా కూడా ఆకుంటుత దీక్షతో చంబా గారు కట్ డ్రాయర్ పైనా కూర్చి ఆలోచన చేస్తున్నాడు ఎలా జనాలకి కాకమ్మ కబుర్లు చెప్పాలి అని.

    ఉదయం మిగిలిన అధికారులు లేట్ గా లేచి చూస్తే వీవీఐపీ గదిలో లేరు, కంగారు పడిపోయి ఫోన్ లు చేస్తే దావోస్ అధికారులు చెప్పరు

    ఇక్కడెవరో జనాలు లేవకుండానే స్టాల్ కూర్చోని బిల్డప్ కొడుతున్నాడు అని

    అధికారులు పరుగు పరుగు నా వెళ్లి చూస్తే అంత చలిలో బట్టలు లేకుండా మన చంబు కూర్చోని రెడ్బుక్ పట్టుకొని జనాలకోసం వేచి చూస్తున్నాడు

    కట్ చెస్తే

    కాళీ చేతులతో తిరిగి వచ్చి అంటాడు, అసలు మీకు ఎవరు చెప్పరు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనీ ?

  2. పోరాట స్ఫూర్తి, మనసులు గెలిచింది, నైతిక విజయం ఇలా రాయాల్సింది ఆర్టికల్

  3. నేను ఎంతో మంచి చేసి, రాజకీయబిక్ష పెట్టినా కార్పొరేటర్ల ప్రేమ, ఆప్యాయత ఏమయ్యిందో, ఎటుపోయిందో అర్థం కావడం లేదు. ఏదో జరిగింది కానీ సాక్షాలు లేవు. ఇలా ఐతే ఏమి చెయ్యాల్రా ‘మహమేతా?? ఈరోజు అర్థరాత్రి నీ కథ చెప్తా..

  4. రవి గారు, విద్య అంటే సంస్కారం – కానీ మీరు తక్కువ స్థాయి మనస్తత్వం కలిగిన వారితో ఏమి తేడా? దేవుడు మీకు బుద్ధి ప్రసాదించాలి!”

    ప్రజలు అత్యంత తెలివైనవారు. ఎప్పుడూ కులాల పేరుతో కాకుండా, దేశానికి, రాష్ట్రానికి మేలు చేసే పాలనను బట్టి ఓటు వేస్తారు. కానీ జగన్ మాత్రం కమ్మ, కాపు కులాలపై ద్వేషాన్ని రెచ్చగొట్టి, ఇతర కులాల ఓట్లు సంపాదించొచ్చని భ్రమ పడ్డాడు. కానీ ఇది పూర్తిగా వెనుకడుగు తీసుకుంది.

    అన్ని కులాలు కలసి జగన్‌ను కేవలం 11 స్థానాలకు పరిమితం చేశాయి (175లో 11 మాత్రమే).

    ప్రజలు ద్వేషం, కుల రాజకీయాలను పూర్తిగా తిరస్కరించారు. అంతేకాదు, ప్రతిపక్ష నేత స్థానం కూడా దక్కకుండా తీర్చిదిద్దారు.

    ఇంత స్పష్టమైన ప్రజా తీర్పు ఉన్నా, ఇంకా కుల విద్వేషాన్ని ప్రోత్సహిస్తూ, అసభ్యులను మద్దతు ఇస్తూ మీరు కూడా తక్కువ స్థాయికి దిగజారిపోవడం బాధాకరం.

    విద్య అంటే కేవలం చదువుకోవడం కాదు, అది సంస్కారాన్ని నేర్పాలి. కానీ మీరు తక్కువ స్థాయి మానసికత గల వ్యక్తులతో ఏమాత్రం భిన్నంగా కనిపించడం లేదు.

    ఇప్పటికైనా మారండి! లేకపోతే, మీరు కూడా కుల విద్వేషంతోనే గుర్తింపు పొందిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారు.

    దేవుడు మీకు బుద్ధి ప్రసాదించాలి!

Comments are closed.