చంద్రబాబును కలిసిన మీడియా అధినేత?

చంద్రబాబు నుంచి సానుకూలమైన స్పందన రాలేదని రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది.

అయన ఓ మీడియా అధినేత, తెలుగుదేశం విజ‌యం సాధించడం వెనుక అయన కృషి చాలా వుంది. ఎన్నో కష్టాలు పడ్డారు. నష్టపోయారు. అయినా మొండిగా జ‌గన్ ను ఢీకొన్నారు. మొత్తానికి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కానీ ఎక్కడో చిన్న మిస్ కమ్యూనికేషన్ వచ్చినట్లుంది.

అ మీడియా వార్తల్లో, వ్యాసాల్లో కొంచెం అసంతృప్తి తొంగి చూస్తోంది. ఇప్పటికే దీని మీద సోషల్ మీడియాలో డిస్కషన్ జ‌రుగుతోంది. తెలుగుదేశం హార్డ్ కోర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఈ విషయంలో కిందా మీదా అవుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో సదరు మీడియా అధినేత ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల హైదరాబాద్ లో ఒకటి రెండు రోజులు వున్నారు. అదే సమయంలో ఈ మీడియా అధినేత వెళ్లి కలిసినట్లు తెలుస్తోంది. ఏపీ రాజ‌కీయాలు, గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఇతరత్రా వ్యవహారాల మీద చర్చించినట్లు బోగట్టా. అదే సమయంలో తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కానీ చంద్రబాబు నుంచి సానుకూలమైన స్పందన రాలేదని రాజ‌కీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కారణం వారిద్దరి మధ్య దొర్లిన సంభాషణలో వ్యక్తమైన అభిప్రాయాలు, వాటి వ్యవహారాలు కొన్ని చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ వ్యవహార శైలికి సంబంధించినవి కావడం అని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఎవరు అలిగినా, ఎవరు అగ్రహించినా ఒకసారి చంద్రబాబు ను కలిసి మాట్లాడనంత వరకే. వన్స్ కలిస్తే, అంతా మళ్లీ విధేయుడిగా మారిపోవాల్సిందే.

14 Replies to “చంద్రబాబును కలిసిన మీడియా అధినేత?”

  1. ఆకాశవాణి వార్తలేంట్రా గూట్లే… నీకు అంతేంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఏడువు… అంటా గుంటా అని గోడల కింద నైటీ వేసుకొని పంగలేనమ్మ కబుర్లు చెప్పమాకు రా దింగ్రీ..

  2. ఎన్నో కష్టాలు పడ్డారు, నష్ట పోయారు అంటూ రాసుకొచ్చారు, ఇప్పుడు ఉన్న పోసిషన్ కాని సంపద కాని ఎవరి వల్ల వచ్చాయి? వారి కోసం ఆమాత్రం పడలేరా?

    1. మీ మీడియా వాళ్ళ కి జ్యోతి వాళ్ళకి టీడీపీ అధినేత ఇచ్చిన దాంట్లో పదో వంతు కూడా ఇచ్చి ఉండరు వైసీపీ వాళ్ళు. అయినా వైసీపీ అధికారం లో లేనప్పుడు వైసీపీ కోసం టీడీపీ మీద మీరు పోరాడడం లేదా?

Comments are closed.